ఇంటింటా ఓటరు సర్వే
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు వ్యూహారచనలు చేస్తున్నాయి.. ఎన్నికల సంఘం కూడా అందుకు అనుగుణంగా ఇంటింటా ఓట్ల పరిశీలన, కొత్త వారి నమోదుకు దరఖాస్తుల స్వీకరణ, సవరణలు చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఆధార్తో అనుసంధానం
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు వ్యూహారచనలు చేస్తున్నాయి.. ఎన్నికల సంఘం కూడా అందుకు అనుగుణంగా ఇంటింటా ఓట్ల పరిశీలన, కొత్త వారి నమోదుకు దరఖాస్తుల స్వీకరణ, సవరణలు చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈనెల 25 నుంచి శ్రీకారం చుట్టగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన సమావేశానికి పాలనాధికారి, అదనపు పాలనాధికారి, ఇతర అధికారులు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో కూడా ఆర్డీవో ఆనంద్కుమార్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బూత్స్థాయి అధికారులు, సూపర్వైజర్లు, సహాయ ఎన్నికల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. నియోజకవర్గాల వారీగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. జిల్లాలో ఇప్పటికే ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, ఆధార్ కార్డుతో అనుసంధానం వంటివి కొనసాగుతున్నాయి.
నమోదు.. పరిశీలన
అన్ని నియోజకవర్గాలలో బీఎల్వోలు ఈనెల 25 నుంచి ఇంటింటా పరిశీలన ప్రారంభించారు. ఈ ప్రక్రియ వచ్చే నెల 23 వరకు కొనసాగుతుంది. అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారితో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పిస్తారు. రెండు ఓట్లు కలిగి ఉన్న వారితో మాట్లాడి ఒక ఓటు ఉండేలా దరఖాస్తు తీసుకుంటారు. చనిపోయిన వారి వివరాలు సేకరించి వాటిని తొలగించే చర్యలు చేపడతారు. ఓటు ఉండి వలస వెళ్లిన వారి వివరాలు సేకరిస్తారు. ఆధార్తో అనుసంధానం చేసుకునేలా ప్రోత్సహిస్తారు.
అక్టోబరు 4న తుది ఓటరు జాబితా
అన్ని రకాలుగా వచ్చిన దరఖాస్తులను జులై 25 నుంచి 31 వరకు పరిశీలన పూర్తి చేసి అక్టోబరు 1 నాటికి అర్హులైన వారిని జాబితాలో చేర్చడానికి అంతర్జాలంలో వివరాలు నమోదు చేస్తారు. వీటి ఆధారంగా ఆగస్టు 2న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. అదే నెల 2 నుంచి 31 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ మధ్యలో ఓటరు నమోదు, తొలగింపు, మార్పులపై రెండు శనివారాలు, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 22న అభ్యంతరాలపై వివరణ ఇస్తారు. అక్టోబరు 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు.
పోలింగ్ కేంద్రాల గుర్తింపు
జూన్ 24 నుంచి జులై 24 వరకు ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలను గుర్తించడం, వాటి సౌకర్యాలను పరిశీలిస్తారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లు ఉండేలా సరి చూసుకుంటారు. అవసరమైన చోట కొత్త కేంద్రాలను ఏర్పాటుకు ఫొటోలతోపాటు ప్రతిపాదనలు పంపిస్తారు.
ఆధార్, మొబైల్ నంబరు నమోదు చేయించాలి
- జి.శ్యాంప్రసాద్లాల్, అదనపు పాలనాధికారి, కరీంనగర్
ఇంటింటా సర్వే పకడ్బందీగా నిర్వహిస్తాం. 18 ఏళ్లు నిండిన వారందరికి ఓటు హక్కు కల్పిస్తాం. ప్రతి ఓటరు ఆధార్, మొబైల్ నెంబర్ నమోదు చేయించాలి. నియోజకవర్గాల వారీగా జరిగే సర్వేలో ఎన్నికల సిబ్బందికి సహకరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
[ 19-04-2024]
కమాన్పూర్ మండలం రొంపికుంట ఉపకేంద్రం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు