చేపల వంటకాలు.. నోరూరించేందుకు సిద్ధం
జిల్లాలోని జలాశయాలు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో ఏటా ప్రభుత్వం చేప, రొయ్య పిల్లలను వదలుతుంది. దీంతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి.
చేపల వంటకాలు.. నోరూరించేందుకు సిద్ధం
న్యూస్టుడే, బోయినపల్లి
వివిధ రకాల వంటలు
జిల్లాలోని జలాశయాలు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో ఏటా ప్రభుత్వం చేప, రొయ్య పిల్లలను వదలుతుంది. దీంతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈనెల 8 నుంచి 10 వరకు చేపల ఆహార ఉత్సవం (ఫిష్ ఫుడ్ ఫెస్టివల్) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాల సభ్యులకు హైదరాబాద్లో శిక్షణ ఇప్పించారు. మూడు రోజులు నోరూరించే వివిధ రకాల చేపల వంటకాలు జిల్లావాసులకు అందుబాటులో ఉండనున్నాయి.
జిల్లాలో మధ్యమానేరు, ఎగువ మానేరు, అన్నపూర్ణ జలాశయంతోపాటు చెరువులు, కుంటలు ఉన్నాయి. ఈ ఏడాది 430 చెరువులు, జలాశయాల్లో చేప, రొయ్య పిల్లలను వదిలారు. రాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయంలో 28.50 లక్షల చేప, 26.63 లక్షల రొయ్య పిల్లలు, ఎగువమానేరులో 10.50 లక్షల చేప, 5.25 లక్షల రొయ్య పిల్లలను వదిలారు. వీటితో మత్స్యకారులకు నిత్యం ఉపాధి లభిస్తుంది. తాజా చేపలు లభిస్తుండటంతో జలాశయం వద్దకు వచ్చి సమీప గ్రామాల ప్రజలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ప్రధాన రహదారి వెంబడి ఉన్న టేలాల వద్ద వ్యాపారుల నుంచి వాహనదారులు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది మధ్యమానేరు జలాశయంలో చేపలు 1,800 టన్నులు, రొయ్యలు 295, ఎగువమానేరులో చేపలు 850, రొయ్యలు 42 టన్నుల ఉత్పత్తి వస్తుందని అధికారులు అంచనా వేశారు. వీటి రుచులను జిల్లా వాసులకు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
శిక్షణలో మహిళా మత్స్యపారిశ్రామిక సంఘాల సభ్యులు
హైదరాబాద్లో మహిళలకు శిక్షణ
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జిల్లాలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో చేపల ఆహార ఉత్సవం (ఫిష్ ఫుడ్ ఫెస్టివల్) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కేంద్రంలోని సమీకృత రైతు మార్కెట్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రూ.3 లక్షలను కేటాయించారు. జిల్లాలోని మహిళా మత్స్య పారిశ్రామిక సంఘాల్లోని సభ్యులకు హైదరాబాద్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం, హాస్పటాలిటి మేనేజ్మెంట్ (నీతమ్)లో జిల్లా మత్స్యశాఖ నుంచి 24 మందికి 40 రకాల వంటకాలపై నిష్ణాతులైన చెఫ్లతో శిక్షణ ఇప్పించారు. 10 స్టాల్స్ ఏర్పాటు చేసి ఒక్కో స్టాల్స్లో నాలుగు రకాల వంటలను అందుబాటులో ఉంచనున్నారు. చాలా మందికి చేపలు అనగానే చేపల పులుసు, ఫ్రై అధికంగా గుర్తుకొస్తాయి. అయితే అనేక మందికి తెలియని వివిధ రకాల వంటకాలను స్టాల్స్లో ప్రదర్శించనున్నారు. చేపల పులుసు, పచ్చళ్లు, సమోసా, బర్గర్, పకోడి, కట్లెట్స్, రొయ్య బిర్యాని, పకోడి, వేపుడు, పచ్చళ్లు, బటర్ఫ్లై, అపోలో చేప, ఫిష్ ఫింగర్, రొయ్య బటర్ఫ్లై, చేప మంచూరియా, కొర్ర మీను పచ్చళ్లు, స్మోకెడ్ చేప తదితర రకాల వంటకాలు చేయనున్నారు. మత్స్య సహకార సంఘాలు బలోపేతం కావడానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
విజయవంతం చేయాలి
జిల్లా కేంద్రంలో మూడు రోజులు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే 24 మందికి శిక్షణ పూర్తయింది. 10 స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నాం. మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. స్టాల్స్ను ప్రతి ఒక్కరూ సందర్శించి చేపల ఆహార ఉత్సవాన్ని విజయవంతం చేయాలి.
శివప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక