అసౌకర్య ప్రయాణం
సామాన్యులకు రైలు ప్రయాణం నరకప్రాయంగా మారింది. విపరీతమైన ఉష్ణోగ్రతలకు తోడు టిక్కెట్టు కొనుక్కొని కనీసం బోగిలో నిలబడేందుకు కూడా చోటు దక్కకపోవడంతో ప్రయాణికులు రైల్వేశాఖపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జనరల్ బోగీల్లో సామాన్యులకు అవస్థలు
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి
జనరల్ బోగిలో కిక్కిరిసి వెళ్తున్న ప్రయాణికులు (పాత చిత్రం)
సామాన్యులకు రైలు ప్రయాణం నరకప్రాయంగా మారింది. విపరీతమైన ఉష్ణోగ్రతలకు తోడు టిక్కెట్టు కొనుక్కొని కనీసం బోగిలో నిలబడేందుకు కూడా చోటు దక్కకపోవడంతో ప్రయాణికులు రైల్వేశాఖపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సూపర్ ఫాస్ట్ రైలుకు గరిష్ఠంగా 20 వరకు బోగీలుంటే.. రైలు ముందు ఒకటి, చివర ఒక జనరల్, దివ్యాంగుల బోగీలు తగిలించి రైల్వే శాఖ చేతులు దులుపుకుంటోంది. వేసవిలో ప్రయాణాలు ఎక్కువ చేస్తుండటంతో సామాన్యులు రైలెక్కితే నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి ఉంది.
సికింద్రాబాద్ నుంచి పాట్నాలోని దానాపూర్కు వెళ్లే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, సిర్పూర్ కాగజ్నగర్, తెలంగాణ, జీటీ, కేరళ, ఇతర అన్నీ రైళ్లల్లోనూ జనరల్ నుంచి ఏసీ బోగీల వరకు ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత జనాలు ఉంటున్నారు. ఇటీవలే కొందరు ఓదెల, కొలనూర్, రామగుండం రైల్వే స్టేషన్ల పరిధిలో బోగీల్లో రద్దీ మూలంగా వేగంగా వెళ్తున్న రైలు నుంచి పట్టుతప్పి మృత్యువాతపడ్డ ఘటనలు న్నాయి. తీవ్ర గాయాలపాలైనవారూ ఉన్నారు.
ఇదీ పరిస్థితి
* కరీంనగర్ వయా పెద్దపల్లి నుంచి మంచిర్యాలకు రాజీవ్ రహదారిపై వెళితే బస్సులో సుమారు 84 కిలోమీటర్ల మేర మూడు గంటల కంటే ఎక్కువ సమయం పడుతోంది. అదే రైలులో అయితే పెద్దపల్లి నుంచి మంచిర్యాలకు అరగంటలోపే వెళ్లే అవకాశం ఉంది. గతంలో చాలా మంది ప్రయాణికులు కరీంనగర్ నుంచి మంచిర్యాల, బెల్లంపల్లి, ఆదిలాబాద్లకు వెళ్లాలంటే పెద్దపల్లి బస్టాండ్లో దిగి అక్కడి నుంచి సమయానికి అందుబాటులో ఉండే ఎక్స్ప్రెస్లు, ప్యాసింజర్ రైళ్లకు వెళ్లేవారు. ఇదే తరహాలో సికింద్రాబాద్కు వెళ్లిన దాదాపు 5 గంటలకుపైగా బస్సులో సమయం పడుతోంది. అదే రైలులో అయితే 3 గంటల్లో గమ్యస్థానం చేరుకుంటాం.
* నిత్యం కరీంనగర్, నిజామాబాద్ల నుంచి మంచిర్యాల, బల్లార్షాలకు వెళ్లే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, చిరువ్యాపారులు, సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు రైళ్లు కాకుండా బస్సుల్లో ప్రయాణించాలంటే ఆలోచిస్తున్నారు. సమయపాలన లేని బస్సులు, నిత్యం రద్దీ, అస్తవ్యస్తంగా రహదారులు, ట్రాఫిక్ బాధలు, గంటలకొద్దీ ప్రయాణాలు వెరసి రోజులో సగం సమయం ప్రయాణానికే కేటాయించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెరిగిన బస్సు ఛార్జీల మూలంగా భారంగా భావిస్తున్నారు.
* తప్పని పరిస్థితుల్లో రైలు ఎక్కితే బోగీల్లోని మరుగుదొడ్లు, లగేజీ ర్యాక్లు, సీట్ల కింద, మీద ఎక్కడపడితే అక్కడ ప్రయాణికులు చోటు సంపాదించుకోవాల్సిన పరిస్థితి. అత్యవసరంగా తాగునీటికి, మరుగుదొడ్లకు వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంటుందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రభుత్వాలు కొత్త రైళ్లను ప్రవేశపెడుతున్నప్పటికీ జనరల్ బోగీలు అదనంగా పెంచాలని, సామాన్యులకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?