వీధి వ్యాపారులకు రుణాల దన్ను
కొవిడ్-19 లాక్డౌన్ కారణంగా చిరు వ్యాపారులు బజారున పడ్డారు.. తిరిగి వ్యాపారాలు చేసుకోవడానికి పైసా లేక.. అప్పులు దొరకక అవస్థలు పడుతున్న వేళ వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి, ఆత్మనిర్భర్ పథకాన్ని ప్రారంభించారు.
పీఎం స్వనిధి సద్వినియోగం
రెండో స్థానంలో కరీంనగర్ నగరపాలిక
న్యూస్టుడే, కరీంనగర్ సుభాష్నగర్
కరీంనగర్లో ఫుట్పాత్పై విక్రయాలు
కొవిడ్-19 లాక్డౌన్ కారణంగా చిరు వ్యాపారులు బజారున పడ్డారు.. తిరిగి వ్యాపారాలు చేసుకోవడానికి పైసా లేక.. అప్పులు దొరకక అవస్థలు పడుతున్న వేళ వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి, ఆత్మనిర్భర్ పథకాన్ని ప్రారంభించారు.. పట్టణాలు, నగరాల్లో గుర్తించిన చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆర్థికంగా దన్నుగా నిలిచారు.. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించి మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి కావడంతో జూన్ 1 నుంచి 3 వరకు దిల్లీలో ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ‘న్యూస్టుడే’ కథనమిది..
కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 పురపాలికలు, 2 నగరపాలికల్లో 65,246 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. రోడ్ల మీద, ఫుట్పాత్లపై పండ్లు, కూరగాయలు, అల్పాహార కేంద్రాలు, వస్త్రాలు, నిత్యావసరాలు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. కరోనా మహమ్మారి వీరి వ్యాపారాలను బాగా దెబ్బతీసింది. లాక్డౌన్ తర్వాత వ్యాపారాలు చక్కదిద్దుకునేందుకు చిరు వ్యాపారులు అష్టకష్టాలు పడ్డారు. ఉపాధి లేక, జీవనం గడవక అవస్థలు పడుతున్న చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పించింది.
* మొదట్లో నిరాకరించి : పీఎం స్వనిధి, ఆత్మనిర్భర్ కింద వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా నేరుగా రుణాలు అందించేందుకు ముందుకొచ్చారు. రూ.10 వేలు ఖాతాలో జమ చేస్తుండగా ప్రతి నెలా వడ్డీతో సహా కట్టాల్సి ఉండటంతో చిరు వ్యాపారులు మొదట్లో నిరాకరించారు. ఇచ్చే మొత్తం సరిపోదనే భావనతోనే ఉండేవారు. పురపాలక అధికారులు అవగాహన కల్పించడంతోపాటు దగ్గరుండి రుణాన్ని ఇప్పించారు. తర్వాత లక్ష్యాన్ని విధించడం, ఈ మొత్తం రెట్టింపు అవుతుందనే ఆశతో రుణాలు తీసుకోవడానికి చిరు వ్యాపారులు ఆసక్తి చూపించారు.
* రూ.10 వేల నుంచి రూ.50 వేలకు.. : పీఎం స్వనిధి కింద మొదటి విడతలో రూ.10 వేలు ఖాతాల్లో జమ చేస్తే, ఈ మొత్తాన్ని ఏడాదిలోగా వడ్డీతో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. సక్రమంగా చెల్లించిన వారికి మళ్లీ రుణాలు ఇచ్చేందుకు స్వయంగా బ్యాంకర్లే ముందుకొచ్చారు. దాంతో రెండో విడతలో రూ.20 వేలకు అర్హత కల్పించారు. ప్రస్తుతం మూడో విడతలో రూ.50 వేలు అందించేందుకు లక్ష్యాన్ని విధించడంతో అర్హులైన వీధి వ్యాపారులు కూడా ముందుకొస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. పీఎం స్వనిధి అమలులో రెండో విడతలో కరీంనగర్ నగరపాలక సంస్థ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండగా, దేశంలో పది లక్షల లోపు జనాభాలోని కార్పొరేషన్లలో రెండో స్థానంలో నిలిచింది. మూడో విడతలో కూడా లక్ష్యాన్ని సాధించేలా కసరత్తు చేస్తున్నారు.
అడగకముందే రుణం మంజూరు
రోడ్డుపై దుస్తులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తాను. వీధి వాపార గుర్తింపు కార్డు ఇచ్చారు. ఆ సమయంలో రూ.10 వేలు రుణం ఇప్పించారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో చెల్లించడంతో రూ.20 వేలు ఇచ్చారు. ఆ మొత్తాన్ని కూడా చెల్లించడంతో మూడోవిడతకు దరఖాస్తు చేయమని మున్సిపల్ అధికారులు ఫోన్ చేశారు. బయట ఫైనాన్స్ కంటే నయమే. అడగకముందే రుణం మంజూరు చేశారు.
రాజేశం, కరీంనగర్
సమయానికి ఆదుకుంది
లాక్డౌన్ సమయంలో పైసలు లేక, పని చేసుకుందామంటే పెట్టుబడి లేక ముప్పు తిప్పలు పడ్డాం. కుటుంబ పోషణ భారంగా మారింది. ఆ సమయంలో తక్కువ వడ్డీతో ఈ రుణం ఆదుకుంది. మూడు విడతలుగా రుణం తీసుకొని చెల్లించా. బ్యాంకు అధికారులు మళ్లీ రుణం ఇస్తామని చెబుతున్నారు. చెల్లించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుందని తీసుకోవడం లేదు.
అంజయ్య, చెరుకు జ్యూస్ సెంటర్, కరీంనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో