వేర్వేరు ఘటనల్లో విద్యుదాఘాతంతో ముగ్గురి మృత్యువాత
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన ఓదెల మండలంలో బుధవారం చోటు చేసుకుంది.
నాంసానిపల్లెలో యువరైతు...
రాకేశ్
ఓదెల, న్యూస్టుడే: ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన ఓదెల మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పొత్కపల్లి పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నాంసానిపల్లెకు చెందిన నూనె రాకేశ్ (23) బుధవారం పంట పొలం వద్ద నారుమడి దున్నేందుకు వెళ్లాడు. నీరు పెట్టే క్రమంలో విద్యుత్తు మోటార్ నడవకపోవడంతో స్టార్టర్లో ఫ్యూజ్ను తీసి పరిశీలించాడు. ఫ్యూజ్ వైరు వేసే క్రమంలో చేయికి తీగ తాకి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రాకేశ్ తండ్రి సదయ్య ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రాకేశ్ హైదరాబాద్లో పనిచేస్తున్న ప్రైవేటు సంస్థను వదిలి ఇంటి దగ్గర ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకుని జీవనోపాధి పొందుతామని యువ రైతుగా మారాడు. విద్యుదాఘాతం రూపంలో మృత్యువు బలి తీసుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రాకేశ్కు తల్లి మంజుల, ఓ సోదరి ఉన్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.రామకృష్ణ తెలిపారు.
సుల్తానాబాద్లో మిల్లు ఆపరేటర్..
తయాబ్ ఆలీ మృతదేహం
సుల్తానాబాద్: విద్యుదాఘాతంతో బియ్యం మిల్లు ఆపరేటర్ మృతిచెందిన ఘటన సుల్తానాబాద్ పురపాలిక పరిధిలోని పూసాలలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై విజేందర్, బాధితులు తెలిపిన సమాచారం మేరకు.. పశ్చిమబెంగాల్ రాష్ట్రం మల్దా జిల్లా హరిచంద్రాపురం మండలం రహమల్పూర్కు చెందిన తయాబ్ ఆలీ(21).. పూసాల పరిధిలోని కామధేనువు బియ్యం మిల్లులో రెండు నెలలుగా మిల్లు ఆపరేటర్గా పని చేస్తున్నాడు. బుధవారం మిల్లులో పనులు ముగించుకొని మిల్లు ఆవరణలో ఉన్న తన నివాసానికి వచ్చి స్నానం చేశాడు. ఇనుపతీగపై తడిగా ఉన్న వస్త్రాన్ని ఆరవేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై కుప్పకూలాడు. తోటి కార్మికులు ఆయనను సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహన్ని పెద్దపల్లి ఆసుపత్రికి తరలించి శవపరీక్షలు చేశారు. మృతుడి బావమరిది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మిల్లు కార్మికులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసంలో విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. వదులు తీగలు, తెగిన తీగలకు కేవలం ప్లాస్టిక్ కవర్లు చుట్టి నిర్లక్ష్యంగా వదిలేయడంతో నివాసం పైకప్పునకు ఉన్న ఇనుప పైపులకు, విద్యుత్తు తీగలు తగలడంతో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.
మంథనిలో యువకుడు...
కుమారస్వామి
మంథని గ్రామీణం, న్యూస్టుడే: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మంథని పట్టణ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు, ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రచ్చపల్లి గ్రామానికి చెందిన శనిగరం కుమారస్వామి (18).. కొన్ని రోజులుగా పట్టణంలోని ఓ వాటర్ సర్వీస్ సెంటర్లో పని చేస్తున్నాడు. నీటికి విద్యుత్తు సరఫరా అవడాన్ని గమనించని కుమారస్వామి.. హార్వెస్టర్కు వాటర్ సర్వీసింగ్ చేస్తున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు