చూపు దూరమవుతోంది..
జిల్లాలో కంటి వెలుగు పరీక్షలు తుది దశకు చేరాయి. జనవరి 19 నుంచి నిర్విరామంగా పల్లె, పట్టణాల్లో నేత్ర వైద్య వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి.
జిల్లాలో తుది దశకు చేరిన నేత్ర పరీక్షలు
శస్త్రచికిత్సలపై బాధితుల నిరీక్షణ
కంటి పరీక్ష చేస్తున్న నేత్ర వైద్య సహాయకులు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్ : జిల్లాలో కంటి వెలుగు పరీక్షలు తుది దశకు చేరాయి. జనవరి 19 నుంచి నిర్విరామంగా పల్లె, పట్టణాల్లో నేత్ర వైద్య వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 34 నేత్ర వైద్య బృందాలు 3,91,219 మందిని పరీక్షించాయి. 1,55,431 మంది కంటి సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. వైద్య శిబిరాలకు జనాలను తరలించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా శ్రమించారు. ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. దగ్గర, దూరపు చూపు అద్దాలు పంపిణీ చేస్తుండగా శస్త్ర చికిత్సలపై కొంత సందిగ్ధం నెలకొంది. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది.
సమీక్షలతో సత్ఫలితాలు
జిల్లాలో 267 గ్రామ పంచాయతీలు, రామగుండం నగరపాలకసంస్థ, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో మొత్తం 8,89,729 జనాభా ఉంది. ఇందులో 18 ఏళ్లు నిండిన వారు 4,87,124 మందికి నేత్ర పరీక్ష చేయాలని నిర్ణయించారు. మొదట్లో ఉత్సాహం చూపిన ప్రజలు క్రమక్రమంగా శిబిరాలకు రావడం తగ్గించారు. దీంతో అధికారులు కరపత్రాలతో చైతన్యం కల్పించారు. వైద్య, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శిబిరాలకు వచ్చేందుకు కష్టించారు. జిల్లా స్థాయిలో తరచూ సమీక్షలు చేయడంతో సత్ఫలితమిచ్చింది.
కంటి సమస్యలు అధికం
జిల్లాలో బొగ్గు గనులు, క్వారీలు, ఇటుక బట్టీలు, రైసు మిల్లుల కాలుష్య ప్రభావం నేత్ర సమస్యలకు దారితీస్తున్నాయి. చరవాణులు, కంప్యూటర్లు, ట్యాబ్లను అస్తమానం వినియోగించడంతో చూపు తగ్గుతోంది. ఉద్యోగ ప్రస్థానంలో పని ఒత్తిడికి గురవుతుండటంతో రక్తపోటు, మధుమేహం పెరుగుతోంది. అవగాహన లోపం వల్ల కంటి సమస్యలు వెలుగుచూస్తున్నాయి. వంశపారంపర్యంగా పిల్లలు దూరపు చూపు కోల్పోతున్నారని తేలింది. 50 ఏళ్లు పైబడిన వారిలో కంటి శుక్లాలు, కంటిలో దుర్మాంసం పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించారు.
శస్త్రచికిత్సలపై సందిగ్ధం
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,91,219 మందిని పరీక్షించారు. 39.72 శాతం మంది కంటి సమస్యతో బాధపడుతున్నట్లు బహిర్గతమైంది. ఇందులో 56,228 మందికి దగ్గర చూపు కంటి అద్దాలు అవసరం ఉండగా 54,228 మందికి పంపిణీ చేశారు. 48,293 మందికి దూరపు చూపు అద్దాలు అవసరం కాగా 40,115 మందికి ఇచ్చారు. మొత్తం 52,933 మంది శస్త్రచికిత్సల కోసం ప్రతిపాదించారు. మధుమేహ బాధితులకు ఎదురవుతున్న డయోబెటిక్ రెటినోపతి పరీక్షించే పరికరాలు అందుబాటులో లేవు. శస్త్రచికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేస్తేనే మేలు చేకూరనుంది.
పకడ్బందీగా నిర్వహణ
కంటి వెలుగు వైద్య శిబిరాలను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. ఎక్కడా లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. దూరపు, దగ్గర చూపు వారికి కంటి అద్దాలు పంపిణీ చేస్తున్నాం. శస్త్రచికిత్స కోసం కరీంనగర్కు పంపిస్తున్నాం.
మహేందర్కుమార్, కంటి వెలుగు జిల్లా నోడల్ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్