బాలలు బడి బాట పట్టేలా!
సర్కారు బడులను కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించినా విద్యార్థులు చేరడానికి సుముఖత చూపడంలేదు.
రేపటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు
న్యూస్టుడే, కరీంనగర్ విద్యావిభాగం : సర్కారు బడులను కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించినా విద్యార్థులు చేరడానికి సుముఖత చూపడంలేదు. పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెరిగినా, ఉచిత పాఠ్య పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం వంటివి సమకూరుస్తున్నా ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. ఈనెల 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న దృష్ట్యా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి సారించింది. ఈ నెల 3 నుంచి ఈనెల 17వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈసారి నిర్దేశించుకున్న లక్ష్యాలేమిటి? గతంలో ఎదురైన ఇబ్బందులు, వాటిని ఎలా అధిగమించాలో ప్రత్యేక కథనం.
గతేడాది లోపాలు అధిగమించితేనే..
* ఏటా బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నా ఆశించిన మేరకు లక్ష్యాలు సాధించడం లేదు. అప్పటి లోపాలను అధిగమించేందుకు ఈ ఏడాది జిల్లా విద్యాశాఖ, ఉపాధ్యాయులు దృష్టి సారించాల్సి ఉంది.
* కరోనా అనంతరం 2020-21 విద్యాసంవత్సరంలో కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6440 మంది విద్యార్థులు చేరారు.
* కరీంనగర్ జల్లాలో గత ఏడాది బడిబాట ద్వారా 884 మంది చేరగా, అందుకు రెట్టింపు సంఖ్యలో బడులను వదిలి వెళ్లిన వారున్నారు. ఇందుకుగల కారణాలను వెతకాలి.
* పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు సకాలంలో పంపిణీ చేయలేదు. ఈసారి ఆలస్యం కాకుండా చూడాలి.
* ప్రాథమిక పాఠశాలల్లో ఎక్కువ సంఖ్యలో పిల్లలు చేరినా ఒకరిద్దరు ఉపాధ్యాయులతో బోధించడం ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఉపాధ్యాయుల కొరత కూడా ప్రవేశాలను దెబ్బతీసింది.
* విద్యావాలంటీర్లను నియమించకపోవడం, బడుల్లో అదనంగా ఉన్న బోధకులను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న వద్దకు సర్దుబాటు చేయడంలో విద్యా శాఖ విఫలమైంది. వసతుల కొరత ప్రవేశాలను దెబ్బతీసింది.
* పర్యవేక్షణ లోపంతోపాటు సమావేశాలు, వివిధ రకాల నివేదికల పేరుతో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఇతర పనులు చేతినిండా ఉండటం బోధనపై ప్రభావం చూపి బాలల సంఖ్యను దిగజార్చేలా చేసిందనే అపవాదు ఉపాధ్యాయుల్లో ఉంది.
* గతేడాది లోపాలను సవరించుకుంటూ ఈసారి ముందస్తుగా చర్యలు చేపడితే ప్రవేశాలు పెరిగే ఆస్కారం ఉంది.
నిర్దేశించుకున్న లక్ష్యాలు..
* బడి ఈడు పిల్లలను గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడం. ప్రవేశాల సంఖ్యను పెంచడం.
* తక్కువ విద్యార్థులు గల బడుల్లో తల్లిదండ్రులు, గ్రామ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నమోదు శాతాన్ని పెంచడం.
* బడి బయట బాలలను గుర్తించి ప్రవేశాలు కల్పించడం.
* చదువు మధ్యలో ఆపేసిన వారిని గుర్తించి సరైన తరగతిలో చేర్పించడం.
* సమాజ భాగస్వామ్యం, మద్దతుతో సర్కారు బడులను బలోపేతం చేయడం.
* అంగన్వాడీ కేంద్రాల్లో 5 ఏళ్ల వయసు గల బాలలను గుర్తించి వారిని బడిలో చేర్చుకోవడం.
* ఈనెల 3 నుంచి 9వ తేదీ వరకు గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమం నిర్వహణ.
* 12 నుంచి 17వ తేదీ వరకు నిర్ధారించిన రోజు వారి కార్యక్రమాల నిర్వహించడం.
మన ఊరు-మన బడి కలిసొచ్చేనా?
ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ఈసారి విద్యార్థుల ప్రవేశాలకు కలిసి వస్తుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. తరగతి గదులు, వంట గదులు, ప్రహరీలు, శౌచాలయాల నిర్మాణాలు-మరమ్మతులు, రంగులు వేయడం, డిజిటల్ తరగతులు, ఫర్నీచర్ వంటివి చేపడుతున్నారు. ఈ సదుపాయాలతో బడి నూతన శోభ సంతరించుకోనుంది. ప్రైవేటుగా దీటుగా ప్రవేశాలు పెరుగుతాయనే ధీమాలో ఉపాధ్యాయులున్నారు. ఇప్పటికే జిల్లాకు పాఠ్యపుస్తకాలు చేరాయి. ఏకరూప దుస్తులను కుట్టేందుకు ఇచ్చారు. అవి సకాలంలో పంపిణీ అయ్యేలా చూడాలి.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?