ధాన్యం డబ్బులు ఎప్పుడు అందేను?
ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.
జగిత్యాల : మోతె కొనుగోలు కేంద్రంలో తూకం వేయని ధాన్యం కుప్పలు
న్యూస్టుడే, జగిత్యాల ధరూర్ క్యాంపు, గంగాధర : ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించిన రైతులు 15 రోజులు గడిచినా డబ్బులు రాక ఆందోళన చెందుతున్నారు.. వానాకాలం పంట సీజన్ ముంచుకొస్తుండటంతో యాసంగి సాగుకు చేసిన అప్పులు చెల్లించేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సేకరణలో జాప్యం : యాసంగిలో ఉమ్మడి జిల్లాలో 9.60 లక్షల ఎకరాల్లో రైతులు వరిని సాగుచేశారు. చీడపీడలు, అకాలవర్షాలతో కనీస దిగుబడి తగ్గటం, విత్తనధాన్యం, సన్నధాన్యం, మార్కెట్ యార్డులు, మిల్లుల్లో నేరుగా అమ్మకాలుపోను కనీసం కనీసం 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో ప్యాక్స్, ఐకేపీ, డీసీఎంఎస్, మెప్మా, హాకా, ఎఫ్పీవోల ద్వారా 1,312 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిద్వారా ఇప్పటివరకు 10.19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కరీంనగర్ జిల్లాలో సేకరణ వేగంగా సాగగా అన్ని జిల్లాల్లో కలిపి ఇప్పటివరకు 385 కేంద్రాల్లోనే సేకరణ ముగిసింది. ఇంకా 927 కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉండగా త్వరితగతిన వర్షాల్లోపు కొనుగోళ్లు పూర్తి చేయాల్సి ఉంది. ఒక్కో ధాన్యం బస్తాలో 1-4 కిలోల వరకు అధికంగా తూకం వేయటం, మిల్లుల్లో కోతలు, తరుగు, హమాలీ ఛార్జీలను క్వింటాలుకు రూ.35 వరకు వసూలు చేయటం, బస్తాలను లారీల్లో నింపినందుకు అదనపు వసూళ్లు, రెండోసారి తూర్పారపట్టడం, తట్లకిరాయి తదితరాలు కలిపి రైతులకు తీవ్ర ఆర్థికనష్టం కలిగించాయి.
చెల్లింపుల్లో ఆలస్యం : ఓ వైపు నెలరోజుల ముందుగానే వానాకాలం సీˆజన్ను ప్రారంభించాలని చెబతున్న రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం డబ్బులు చెల్లించకపోవడంతో రైతు వద్ద పెట్టుబడికి డబ్బులేని పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు రూ.2,097.26 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేయగా రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.574.97 కోట్లను మాత్రమే విడుదల చేశారు. సకాలంలో ధాన్యాన్ని విక్రయించగలిగి డబ్బులు చేతికందితేనే ప్రైవేటు అప్పులను చెల్లించటం, యంత్రాల అద్దెలను చెల్లించటం, బాంకుల్లోని రుణాలను పునరుద్ధరించుకోవడంతోపాటుగా వానాకాలం పెట్టుబడులకు వెచ్చించే వీలుంటుంది. కానీ ఆలస్యమవుతుండటంతో వానాకాలం సాగుకు ఇబ్బందులే అని రైతులు వాపోతున్నారు. కేంద్రాల్లోని మిగిలిన ధాన్యాన్నీ త్వరితగతిన కొనుగోలు చేయాలని, చెల్లింపులవేగం పెంచాలని కోరుతున్నారు. దీనిపై జగిత్యాల పౌరసరఫరాల సంస్థ డీఎం రజనీకాంత్ మాట్లాడుతూ ధాన్యాన్ని విక్రయించి ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిన తరువాత డబ్బులు విడుదలవుతాయని వివరించారు.
రూ.3.91 లక్షలు రావాలి.. : చిత్రంలోని సారంగాపూర్కు చెందిన రాజిరెడ్డి 190 క్వింటాళ్ల ధాన్యాన్ని పక్షం రోజుల క్రితం ప్రభుత్వ సంస్థకు విక్రయించినా ఇప్పటికీ పైకం చేతికందలేదు. రూ.3.91 లక్షల వరకు రావాల్సి ఉండగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతరత్రా చెల్లింపులను సకాలంలో చేయలేకపోతున్నానని రైతు వాపోతున్నారు.
20 రోజులైంది ధాన్యం తెచ్చి.. : చిత్రంలోని జగిత్యాల మండలం మోతెకు చెందిన పోచయ్య 450 బస్తాల వరకు ధాన్యాన్ని మే 10వ తేదీన కేంద్రానికి తేగా ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు. లారీలు సకాలంలో రాకపోవటంతో ధాన్యాన్ని తూకం వేయక కేంద్రంలోనే పడిగాపులు పడుతున్నారు.
పెట్టుబడులెలా? : గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన బీమా అజయ్ ప్రభుత్వ కేంద్రంలో ధాన్యం విక్రయించి 20 రోజులు గడిచినా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాలేదు. పెట్టుబడులకు చేసిన అప్పులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నానని వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
మలేరియా నిర్మూలనకు కృషి
[ 26-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది.