కాళేశ్వరంతో తీరిన నీటి గోస
సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో వ్యవసాయం పండగలా మారిందని ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అన్నారు. కోరుట్ల మండలంలోని పైడిమడుగు, మోహన్రావుపేట, సంగెం, అయిలాపూర్ గ్రామాల్లోని రైతు వేదికల్లో శనివారం రైతు దినోత్సవం నిర్వహించారు.
సారంగాపూర్లో స్టాల్ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సంజయ్కుమార్
కోరుట్లగ్రామీణం: సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో వ్యవసాయం పండగలా మారిందని ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అన్నారు. కోరుట్ల మండలంలోని పైడిమడుగు, మోహన్రావుపేట, సంగెం, అయిలాపూర్ గ్రామాల్లోని రైతు వేదికల్లో శనివారం రైతు దినోత్సవం నిర్వహించారు. అయా గ్రామాల్లో ఎండ్లబండి, ట్రాక్టరు, ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించారు. పైడిమడుగు గ్రామంలో ఎడ్లబండిపై ఎమ్మెల్యే, అదనపు కలెక్టరు మకరందు ర్యాలీగా వచ్చారు. పశువైద్య కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులు స్టాల్స్ నిర్వహించగా వాటిని సందర్శించారు. ఆర్డీవో వినోద్కుమార్, డీఎస్పీ రవీందర్రెడ్డి, ప్రత్యేకాధికారి అయాజ్, రైసస జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావు, డీన్ డా.మాధవరావు, జడ్పీటీసీ లావణ, ఎంపీపీ తోట నారాయణ, ఏవో నాగమణి, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ మకరందు పంచెకట్టుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
దేశానికే ఆదర్శం
జగిత్యాల ధరూర్క్యాంపు: రైతులు, సాగురంగ అభ్యున్నతికి రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత పేర్కొన్నారు. జగిత్యాల మండలం అంబారిపేటలో రైతుదినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఎడ్లబండి, ట్రాక్టర్లతో రైతులు ర్యాలీ తీసారు. ఆర్డీవో దుర్గామాధురి, ప్రత్యేకాధికారి రాజ్కుమార్, జడ్పీటీసీ సభ్యుడు మహేశ్, ఎంపీపీ లక్ష్మి, సర్పంచి గంగాధర్, జితేందర్రావు, దామోదర్రావు, ఏవో వినీల, తదితరులు పాల్గొన్నారు.
చివరి ఆయకట్టుకు నీరు..
సారంగాపూర్: గత పాలకుల నిర్లక్ష్యంతో బీడుగా ఉన్న భూములను సాగులోకి తీసుకువచ్చి చివరి ఆయకట్టు వరకు నీరందించి రైతుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్కుమార్ పేర్కొన్నారు. శనివారం సారంగాపూర్ రైతు వేదికలో రైతు దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయిల్పామ్, నానో ఎరువుల దుకాణాల స్టాల్ ప్రారంభించి పరిశీలించి, రైతులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ మనోహర్రెడ్డి, సురేందర్, రాజేందర్రెడ్డి, తహసీల్దార్ రవీందర్రావు, ఎంపీడీవో రాజేందర్, వ్యవసాయాధికారి తిరుపతినాయక్, తదితరులు పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలో పండగలా వ్యవసాయం
కొడిమ్యాల: మండలంలోని రైతు వేదిక వద్ద రైతు దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. తిర్మలాపూర్లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రవిశంకర్ హాజరై ఎడ్లబండిపై సందడి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులందరూ ఒక్కచోట చేరి పంటల విధివిధానాలను చర్చించేందుకు రైతు వేదికలు ఉపయోగపడతాయన్నానరు. స్వరాష్ట్రంలో వ్యవసాయం పండగలా మారిందని తెలిపారు. ఎకరానికి రూ.40 వేల ధరన్న భూములు రూ.40 లక్షలకు చేరాయని, రైతు బాధలు పట్టించుకున్నది భారాస ప్రభుత్వమేనన్నారు. ఎంపీపీ మేనేని స్వర్ణలత, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, వైస్ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, కృష్ణారావు, రాజనర్సింగరావు, రాజేందర్, రవీందర్రెడ్డి, ఏవో జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి కృషి
కోరుట్లగ్రామీణం: రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రమేష్బాబు అన్నారు. శనివారం కథలాపూర్ మండలంలోని భూషణ్రావుపేట గ్రామంలో రైతు వేదికలో జరిగిన రైతు దినోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. భూషణ్రావుపేట గ్రామంలో ఎడ్లబండిపై ఎమ్మెల్యే ఊరేగింపుగా రాగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. జడ్పీటీసీ నాగం భూమయ్య, ఎంపీపీ జవ్వాజి రేవతి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గుండారపు సౌజన్య, ఏవో యోగిత, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
[ 19-04-2024]
కమాన్పూర్ మండలం రొంపికుంట ఉపకేంద్రం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు