సమ్మెలోకి రేషన్ డీలర్లు
రేషన్ డీలర్లు సమ్మెలోకి వెళ్లారు. 20 సమస్యలు పరిష్కరించాలని, గౌరవ వేతనం, కమీషన్ పెంచాలని కోరుతూ వారు మే 19న జిల్లా అదనపు పాలనాధికారులకు సమ్మె నోటీస్ ఇచ్చారు. 22న మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర నాయకులతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించారు.
తెరచుకోని వావిలాపల్లిలోని రేషన్ దుకాణం
న్యూస్టుడే, భగత్నగర్: రేషన్ డీలర్లు సమ్మెలోకి వెళ్లారు. 20 సమస్యలు పరిష్కరించాలని, గౌరవ వేతనం, కమీషన్ పెంచాలని కోరుతూ వారు మే 19న జిల్లా అదనపు పాలనాధికారులకు సమ్మె నోటీస్ ఇచ్చారు. 22న మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర నాయకులతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించారు. గౌరవ వేతనం, కమీషన్ పెంపు ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుందని తెలియజేయడంతో రాష్ట్ర నాయకులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జూన్ 2 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,964 మంది ఆకస్మికంగా సమ్మెలోకి వెళ్లడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.
ఆకస్మికం.. ఆశ్చర్యం..: గత నెల 28న రైస్ ఇండెంట్ రావడంతో ఈనెల 3వ తేదీ నుంచే బియ్యం పంపిణీ చేయడానికి ఆన్లైన్ ప్రారంభమైంది. 2వ తేదీ సాయంత్రం నుంచి డీలర్లు సమ్మెలోకి వెళ్లారు. శనివారం జిల్లా వ్యాప్తంగా రేషన్ దుకాణాలు తెరుచుకోలేదు. సాధారణంగా ప్రతి నెల 4వ తేదీ నుంచి బియ్యం పంపిణీ చేస్తారు. ఇండెంట్ ముందే రావడంతో ఒక రోజు ముందస్తుగా అధికారులు ఆన్లైన్ ప్రారంభించారు. ఈపాస్ యంత్రాల ద్వారా బియ్యం పంపిణీకి ఆన్లైన్ ద్వారాలు తెరిచారు. సమ్మె ముగిసిందనే భావనలో అధికారులు ఉండగా, మరో వైపు డీలర్ల నిర్ణయంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. బియ్యం పంపిణీకి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే అవకాశాలు లేకుండా పోయాయి. పంపిణీ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.
దీర్ఘకాలిక సమస్యలు: రాష్ట్ర వ్యాప్తంగా డీలర్లు 2021లో సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మెలో గౌరవ వేతనం కావాలని పోరాటం చేశారు. డీలర్లకు రూ.10 లక్షల బీమా కల్పించాలని, హమాలీ ఛార్జీలను ప్రభుత్వమే చెల్లించాలని, మండల స్థాయి స్టాక్ పాయింట్లలో వే బ్రిడ్జ్లు ఏర్పాటు చేయాలని, శాశ్వత అథరైజేషన్ ఇవ్వాలని, కారుణ్య నియామకాలు 50 ఏళ్లకు పెంచాలని, నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని ఇలా 20 సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దీనికి స్పందించి మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో మరో మారు సమ్మె బాట పట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,80,422 మంది కార్డుదారులకు బియ్యం అందకుండాపోయాయి.
గౌరవ వేతనం కావాలి
గౌరవంగా బతకడానికి రేషన్ డీలర్లకు వేతనం ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఎన్నో సభలలో ఇస్తామని ప్రకటించారు. తొమ్మిదేళ్లు అవుతున్నా ఆ హామీ నెరవేరలేదు. ప్రజలకు అసౌకర్యం కలిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇప్పటికైనా స్పందించి చర్చలకు పిలవాలి.
రొడ్డ శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?