ఇంకుడుగుంత.. తీరని చింత
ప్రతీ నీటి బొట్టు భూగర్భంలో ఇంకేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంకుడుగుంతల కార్యక్రమ ప్రగతి ఆరంభ శూరత్వంగా మారింది. మొదట్లో ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో ప్రజా చైతన్యం వెల్లివిరిసింది.
బిల్లులు అందక నిలిచిన నిర్మాణాలు
పెద్దపల్లి మండలంలో నిర్మించిన ఇంకుడుగుంత
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్: ప్రతీ నీటి బొట్టు భూగర్భంలో ఇంకేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంకుడుగుంతల కార్యక్రమ ప్రగతి ఆరంభ శూరత్వంగా మారింది. మొదట్లో ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో ప్రజా చైతన్యం వెల్లివిరిసింది. ఉపాధి హామీలో నిధులు కేటాయించడంతో పూరి గుడిసెలో ఉన్న పేదలు కూడా నిర్మించుకుని ఆదర్శంగా నిలిచారు. బిల్లుల చెల్లింపులో జాప్యం.. ఇతర కారణాలతో ప్రగతి ముందుకు సాగడం లేదు. పల్లెల్లో ఎక్కడికక్కడే మురుగు నీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. ఏటా వానాకాలంలో ఇంటికో ఇంకుడుగుంత నిర్మించుకోవాలని అధికారుల హడావుడి తప్ప రెండేళ్లుగా ఆ ఊసే కనిపించడం లేదు.
ఉద్దేశం ఇదే..
పల్లెల్లో మరుగు, వర్షపు నీరు రహదారులపై చేరి అపరిశుభ్ర వాతావరణం దర్శనమిస్తోంది. ఏటికేటా వర్షం నీరు వృథాగా పోతోంది. భూగర్భ జలాలను పెంపొందించి వృథా నీటికి అడ్డుకట్ట వేసేందుకు ఆరేళ్ల క్రితం ఇంకుడుగుంతల నిర్మాణాలను ప్రోత్సహించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరు చేశారు. జాబ్కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి అనుమతి ఇచ్చారు. గ్రామాల్లో స్వశక్తి సంఘాల మహిళలు ఇంటింటికి వెళ్లి ఇంకుడుగుంతలపై అవగాహన కల్పించారు. పల్లెల స్వచ్ఛత కోసం ప్రజాప్రతినిధులు చొరవ చూపడంతో ఆశించిన స్థాయిలో ఫలితం వచ్చింది. ఉమ్మడి జిల్లాలో 2,65,529 ఇంకుడుగుంతలు ప్రతిపాదించగా 1,48,878 పూర్తయ్యాయి. మిగిలినవి ప్రగతిలో కొనసాగుతున్నాయి.
అడ్డంకులు ఇవి..
బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాల సాధనలో ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్డితో పాటు ఇంకుడుగుంత తవ్వుకోవాలని చైతన్యం చేశారు. ఇంకుడుగుంత నిర్మాణంలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. సంపూర్ణ పారిశుద్ధ్య క్రతువులో కీలకమైన ఇంకుడుగుంతల లక్ష్యం నెరవేరడం లేదు. ఏళ్ల తరబడి బిల్లుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. కొన్ని చోట్ల నిలిచిన పనులను పూర్తి చేయలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.11,998.45 లక్షల వ్యయంతో 2,65,529 ఇంకుడుగుంతల నిర్మాణానికి ప్రతిపాదించగా 1,48,878 నిర్మించారు. రూ.5651.53 లక్షలు ఖర్చయ్యాయి.
పెరిగిన వ్యయం
ఇంకుడుగుంతల నిర్మాణ వ్యయం పెరిగింది. 1.2 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పు, 1.8 మీటర్లలోతు తవ్వి, అందులో గులకరాళ్లు, ఇసుక మిశ్రమం నింపుతున్నారు. గతంలో ఒక్కోదానికి రూ.4,226 ఉండగా ప్రస్తుతం రూ.6,096 చెల్లిస్తున్నారు. పెరిగిన ముడిసరకుల ధరలకు అనుగుణంగా వ్యయాన్ని పెంచినా ఫలితం లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడింది. గ్రామాల్లో చేతిపంపులు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఆవరణంలో నిర్మించుకోవాలనే నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. ఎవరైనా స్వచ్ఛందంగా తవ్వుకునేందుకు ముందుకొచ్చినా బిల్లులు రాక వెనక్కి తగ్గుతున్నారు. రాబోయే వర్షాకాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే ప్రభుత్వ సంకల్పం నెరవేరనుంది.
అవగాహన కల్పిస్తున్నాం
గ్రామాల్లో ఇంకుడుగుంతల తవ్వకాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. గతంలో నిర్మించిన వాటికి బిల్లులు చెల్లింపులో కొంత జాప్యం జరుగుతోంది. లబ్ధిదారులు వెనకాడుతున్నారు. ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటున్నాం. అసంపూర్తి వాటిని పూర్తి చేస్తాం. కొత్తగా కావాలంటే మంజూరు ఇస్తున్నాం.
శ్రీధర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
‘‘ఈమె పేరు తాటికొండ అంజలి. ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామం. రెండేళ్ల క్రితం ఇంకుడుగుంత నిర్మించుకున్నారు. బిల్లు కోసం అన్ని ఆధార పత్రాలు ఇచ్చారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా బిల్లు రాలేదని అంజలి పేర్కొన్నారు.’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా