ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం
కొద్దిపాటి వర్షం కురిసినా సిరిసిల్ల పట్టణం ముంపుబారిన పడుతోంది. ఎగువన గొలుసుకట్టు చెరువుల ద్వారా వచ్చే వరదనీటి కాల్వలు ఆక్రమణలకు గురికావడం..
‘ఈనాడు’తో కమిషనర్ సమ్మయ్య
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల : కొద్దిపాటి వర్షం కురిసినా సిరిసిల్ల పట్టణం ముంపుబారిన పడుతోంది. ఎగువన గొలుసుకట్టు చెరువుల ద్వారా వచ్చే వరదనీటి కాల్వలు ఆక్రమణలకు గురికావడం.. దిగువన మురుగు నీటి కాల్వలు పూడుకుపోయి వరదనీరు వెళ్లలేక రహదారులుపై ప్రవహించడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. దీనిని అధిగమించడానికి నాలాల విస్తరణ, మురుగుకాల్వ పూడిక తీత వంటివి చేేపట్టాల్సి ఉంది. వర్షాకాలం సమీపిస్తుండటంతో ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టినట్లు కమిషనర్ సమ్మయ్య తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో చేపడుతున్న పనులపై ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు..
ప్ర: వర్షాకాలంలో వరదనీరు మురుగునీటి కాల్వల్లో కలిసి పోయి రహదారులపై ప్రవహిస్తోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు?
జ: పట్టణంలోని సాయిబాబా ఆలయం నుంచి శాంతినగర్ వరకు ఓపెన్ డ్రైయిన్ ఉంది. దీనిలోని పూడికను తీసేందుకు రూ.8 లక్షలతో టెండర్లు పిలిచాం. పనులు దక్కించుకున్న గుత్తేదారుతో త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. దీనితోపాటు ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారుల్లోని మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తాం.
ప్ర: ప్రధాన రహదారులపై కాలినడక బాటలు ఆక్రమణలతో చాలా వరకు దెబ్బతిన్నాయి. మెరుగుపర్చేందుకు ఏం చర్యలు చేపడతారు?
జ: సిరిసిల్ల-కామారెడ్డి, సిరిసిల్ల-సిద్దిపేట ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న టైల్స్, మ్యాన్హోల్స్ చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటితోపాటు జిల్లా జనరల్ ఆసుపత్రి కూడలి, తారక రామానగర్, శివనగర్ ప్రాంతాల్లోని టైల్స్, మ్యాన్స్హోల్స్ల మరమ్మతులకు రూ.8 లక్షలు కేటాయించాం. త్వరలోనే పనులు చేపడతాం.
ప్ర: పురపాలికశాఖకు చెందిన అద్దెగదులు చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయి. వీటితో ఆదాయం సమకూర్చుకునే మార్గం?
జ: పట్టణ పరిధిలో ప్రధాన మార్కెట్, పాత, కొత్త బస్టాండ్ పరిధిలో 175 గదులకు టెండర్ల ద్వారా 95 మాత్రమే అద్దెకు తీసుకున్నారు. కూడలికి సమీపంలోనివి, మొదటి అంతస్తులోని దుకాణాలు మాత్రమే టెండర్లలో పోటీ పడి తీసుకున్నారు. మిగితావి ఖాళీగా ఉన్నాయి. టెండర్లలో తీసుకొని దుకాణాలు అవసరమున్న వారు దరఖాస్తు చేసుకుంటే చాలు. కౌల్సిల్ ఆమోదంతో నేరుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.
ప్ర: శాశ్వత ముంపు నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు?
జ: సిరిసిల్ల పట్టణానికి సంబంధించి కొత్త చెరువు అలుగు పారితే వచ్చే వరదనీటిని మళ్లించేందుకు శ్రీనగర్ మీదుగా కచ్చాకాల్వను తవ్వించాం. ఇది బాహ్యవలయ రహదారి నుంచి తుమ్మల చెరువు వరకు వెళ్తుంది. ముష్టిపల్లి నుంచి వచ్చే వరదనీరు కొత్తచెరువులోకి వెళ్లేలా గతేడాది రూ.6.21కోట్లతో కాల్వ నిర్మాణ పనులు చేపట్టాం. దానిలో 70 మీటర్ల మేరకు పనులు పూర్తికావాల్సి ఉంది. వరనీరు వెళ్లేలా మట్టికాల్వను తీసి ఉంచాం. ప్రస్తుతం వెంకంపేట రహదారి విస్తరణ, మురుగునీటి కాల్వ నిర్మాణపనులు చివరిదశలో ఉన్నాయి. రెవెన్యూ, జలవనరుల శాఖల పర్యవేక్షణలో వర్షాలకు ముంపు లేకండా పటిష్ట చర్యలు చేపడుతున్నాం.
ప్ర: పట్టణలో చేపడుతున్న ప్రధాన అభివృద్ధి పనులు?
జ: శ్రీనగర్ కాలనీ, అంబేడ్కర్ నగర్ నుంచి బాహ్యవలయ రహదారి, విద్యానగర్ ప్రాంతాల్లో రూ.6.97 కోట్లతో అంతర్గత రహదారులను నిర్మించనున్నాం. రెండో బాహ్యవలయ రహదారిలో రగుడు నుంచి వెంకటాపూర్ వరకు రూ.4.6 కోట్లతో కేంద్రీకృత విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేస్తున్నాం. రగుడు, శాంతినగర్, పెద్దూరులో నిర్మాణం పూర్తయిన 792 రెండు పడక గదుల సముదాయంలో రూ.5.9 కోట్లతో మౌలిక వసతులు కల్పన పూర్తయింది. నాలుగో విడత లబ్ధిదారులను ఎంపికచేసి ఇక్కడ పంపిణీ చేస్తాం. రూ.61 కోట్లతో చేపడుతున్న ఎస్టీపీ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. సెప్టెంబరు 15లోగా పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా