నాణ్యమైన సేవలకు గుర్తింపు
నాణ్యమైన వైద్య సేవలు.. రోగులకు మెరుగైన వసతులతో హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రి ఆదర్శంగా సాగుతోంది.. ఇవే ప్రమాణాలు ఆస్పత్రికి ఎన్క్వాస్ గుర్తింపును తెచ్చిపెట్టాయి..
హుజూరాబాద్ ఆస్పత్రికి ఎన్క్వాస్ ధ్రువపత్రం
ఆసుపత్రిలో సేవల కోసం పేర్లు నమోదు చేసుకుంటున్న ëృశ్యం
న్యూస్టుడే, హుజూరాబాద్ గ్రామీణం : నాణ్యమైన వైద్య సేవలు.. రోగులకు మెరుగైన వసతులతో హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రి ఆదర్శంగా సాగుతోంది.. ఇవే ప్రమాణాలు ఆస్పత్రికి ఎన్క్వాస్ గుర్తింపును తెచ్చిపెట్టాయి.. ఈ గుర్తింపు స్ఫూర్తిగా మరింత మెరుగైన సేవలు అందిస్తామని.. ఆస్పత్రిలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపరుస్తామని వైద్యులు చెబుతున్నారు..
హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి 100 పడకలతో సేవలను అందిస్తుంది. మొత్తం 27 మంది వైద్యులకు ఏడుగురు డిప్యుటేషన్పై వెళ్లగా 20 మంది వైద్యులు సేవలను అందిస్తున్నారు. ప్రతి రోజు సుమారు 400 మంది రోగులు సేవల కోసం ఆసుపత్రికి వస్తున్నారు. అందులో 70 మంది రోగులు చికిత్సల కోసం చేరుతున్నారు. ప్రతి నెలా జనరల్ శస్త్రచికిత్సలు, ఎముకల శస్త్రచికిత్సలు 60 నుంచి 70 వరకు అవుతున్నాయి. 150 నుంచి 200 మంది వరకు గర్భిణులకు ప్రసూతి సేవలను అందిస్తున్నారు. అందులో 50 వరకు సుఖ ప్రసవాలు జరుగుతున్నాయి. ఆసుపత్రిలో సేవలు, ఇతర నాణ్యత ప్రమాణాలపై నోడల్ అధికారి నారాయణరెడ్డి, మేనేజర్ సాగర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనలో ఆర్ఎంవో, సూపరింటెండెంట్ సూచనలతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా రోగులకు నాణ్యమైన సేవలు అందేలా చూస్తున్నారు.
ఇలా ఎంపిక : జాతీయ ఆరోగ్య వ్యవస్థల వనరుల కేంద్రం బాహ్య అంచనా నివేదిక బృందం సభ్యులు వైద్యులు నాజియా షాహీమ్ (లఖ్నవూ), అలోక్ కుమార్ స్వైన్ (భువనేశ్వర్)ల బృందం ఏప్రిల్ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు ఆసుపత్రిని సందర్శించారు. ప్రమాదాలు, అత్యవసర విభాగం, ఓపీ, చేరిన రోగులు, ప్రసూతి, పిల్లల వార్డు, శస్త్రచికిత్సలు, ల్యాబ్, మందుల విభాగం, సాధారణ పరిశీలన, ఇతర విభాగాలను బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది, రోగులతో మాట్లాడి వైద్య సేవల తీరును నమోదు చేసుకొన్నారు. నివేదికలను భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సమర్పించారు. మంత్తం 100 మార్కులకు గాను ఆసుపత్రి 95 మార్కులు కైవసం చేసుకొన్నట్లు జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్ చౌహాన్ సోమవారం మెయిల్ ద్వారా లేఖ పంపారు. ఎన్క్వాస్ గుర్తింపు లభించినట్లు పేర్కొన్నారు.
కాయకల్ప అవార్డుకు ప్రయత్నం
గత సంవత్సరం లక్ష్య అవార్డు వచ్చింది. ఈ సంవత్సరం (ఎన్క్వాస్) జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల గుర్తింపును దక్కించుకున్నాం. ఆసుపత్రికి ధ్రువీకరణ పత్రంతోపాటు మూడేళ్లపాటు ఏటా కేంద్రం రూ.10 లక్షలు అందిస్తుంది. ఈ స్ఫూర్తితో కాయకల్ప అవార్డును సాధించేందుకు ముందుకు సాగుతున్నాం.
డా.సుధాకర్రావు, ఆర్ఎంవో
సమష్టి కృషితోనే
ఆసుపత్రిలో పని చేసే వైద్యులు, సిబ్బంది సమష్టి కృషితో ఈ అవార్డును సాధించగలిగాం. రోగులకు నాణ్యమైన సేవలను అందించటమే లక్ష్యంగా పెట్టుకొన్నాం. ఆసపత్రిలో నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవార్డుతో మాకు మరింత ఆత్మవిశ్వాసం కలిగింది.
డా.రాజేందర్రెడ్డి, సూపరింటెండెంట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు