ముంపు ముప్పు తప్పేనా!
వర్షాకాలం ముంచుకొస్తుండటంతో కరీంనగర్ నగర పాలక సంస్థ వారు ముందస్తు చర్యలు ప్రారంభించారు.
నాలాల్లోని పూడిక తొలగింపు మొదలు
ఇందిరానగర్లో డ్రైనేజీల్లోంచి పూడిక తొలగించి ట్రాక్టర్లో వేస్తూ..
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్: వర్షాకాలం ముంచుకొస్తుండటంతో కరీంనగర్ నగర పాలక సంస్థ వారు ముందస్తు చర్యలు ప్రారంభించారు. వరద కాల్వలు పొంగి పొర్లకుండా అందుల్లోని చెత్తా చెదారం, పూడిక తొలగించే పనులు మొదలుపెట్టారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదంతా ఈ కాల్వల గుండానే దిగువ ప్రాంతానికి పంపించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. మట్టి, రాళ్లు, చెత్త, చెదారం పేరుకుపోతుండటంతో ఏటా సమస్యలు వస్తున్నాయి. రోడ్డుపై ప్రవహించడం, భారీగా వరద వస్తే ఇళ్లల్లోకి వస్తుండటంతో ఆయా ప్రాంతవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వరదకాల్వలు, అంతర్గత ప్రధాన డ్రైనేజీలను శుభ్రం చేస్తున్నారు.
పకడ్బందీగా పనులు
నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రూ.67.79 లక్షలతో పూడికతీత పనులకు నిధులు కేటాయించారు. కనిపించని పనులు కావడంతో పకడ్బందీగా చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పైపైనే పూడికతీత పనులు చేసి పత్తా లేకుండా పోకుండా.. ఈసారి ఇంజినీరింగ్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వర్క్ ఇన్స్పెక్టర్ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. వ్యర్థాలు తొలగించడంతోపాటు తరలించడం వరకు ఫొటోలు తీయడం, సమీప ఇంటి యజమానుల ఫోన్ నెంబర్లను తీసుకొని రికార్డు చేస్తున్నారు. పూడిక భారీగా నిండి ఉండగా ఆ మేర ఖాళీ అవుతుందా? అనే అనుమానాలు లేకపోలేదు. తీసిన సిల్ట్ను ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. పెద్ద డ్రైనేజీల దగ్గర పొక్లెయిన్తో, చిన్న వాటిలో కార్మికులతో తీయిస్తున్నారు.
కోతకు గురైన కాల్వలకు మరమ్మతులు
వరదకాల్వలు పలు ప్రాంతాల్లో కోతకు గురైంది. మే నెలలో భారీ వర్షం పడిన సమయంలో రోడ్ల మీదికి, ఇళ్లలోకి నీరు రావడంతో అప్పటికప్పుడే ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించి నమోదు చేసుకున్నారు. మంకమ్మతోట రెండో ఠాణా పక్కన, గ్రంథాలయం వైపు, కలెక్టరేట్ లోపల, అంబేడ్కర్ స్టేడియం వైపు, ప్రభుత్వాసుపత్రి ఎదురుగా నుంచి శర్మనగర్ వైపు, అశోక్నగర్లో వరద కాల్వలు పలు చోట్ల కూలాయి. అందుల్లో భారీగా మట్టి ఉంది. ఇలాంటి కాల్వలను వెంటనే మరమ్మతు చేయాల్సిన అవసరముంది.
పూడికతీత పనులు ఇక్కడే
ప్రాంతం మీటర్లు
ఎస్టీ కాలనీ, సెంట్పాల్ పాఠశాల రోడ్డు వావిలాలపల్లి 235
మారుతీనగర్ సీవెరేజ్ డ్రైనేజీ 700
శ్రీదేవి ఆసుపత్రి ఎదురుగా నుంచి వీక్లీ మార్కెట్ వరకు 750
ముకరంపుర పరివార్ బేకరి నుంచి సాయికృష్ణ థియేటర్ 500
సాయికృష్ణ టాకీస్ నుంచి కరీంనగర్ ఫంక్షన్ హాల్ వరకు 500
రాంనగర్ పారమిత, సిద్ధార్థ స్కూల్ వైపు ఫిష్ మార్కెట్ 860
మంకమ్మతోట వాసర ఆసుపత్రి నుంచి మార్క్ఫెడ్ వరకు 800
గౌతమినగర్, అమీర్నగర్, కోతిరాంపూర్, కట్టరాంపూర్,
భగత్నగర్, దద్దిన్నమ్మకుంట డ్రెయినేజీలు 2500
దోబీఘాట్ జంక్షన్ నుంచి పొన్నం శ్రీనివాస్ ఇంటి వరకు 500
వాణినికేతన్ వెనుక నుంచి రెండో పోలీసుస్టేషన్,
ఆర్అండ్బీ క్రాస్ కల్వర్టు, లేబర్ అడ్డా వరకు 180
కెనాల్ సిల్ట్ జగిత్యాల రోడ్డు నుంచి గౌడ్స్ కాలనీ 500
వీక్లీ మార్కెట్ నుంచి వరహస్వామి దేవాలయం 1200
నయీం మసీదు నుంచి వయా హెల్త్ సెంటర్ 400
సాయిబాబా టెంపుల్ నుంచి గౌరిశెట్టికాంప్లెక్స్ 400
కెనాల్ డి-94 షెకాబీకాలనీ నుంచి జగిత్యాల రోడ్డు 700
కలెక్టరేట్ నుంచి అంబేడ్కర్ స్టేడియం 300
ఇందిరానగర్ జంక్షన్ నుంచి మంచిర్యాల చౌరస్తా 750
ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు
వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో చర్యలు ప్రారంభించాం. చిన్న, పెద్ద డ్రైనేజీల్లోని పూడికను తొలగించే పనులు వారం రోజుల్లో పూర్తి చేస్తారు. డ్రైనేజీలు మురికి నీరు వెళ్లేందుకు మాత్రమే. చెత్తా చెదారం ఎట్టి పరిస్థితిలో అందులో వేయొద్దు.
వై.సునీల్రావు, మేయర్, కరీంనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జమ్మికుంటలో వర్షం.. అప్రమత్తమైన అన్నదాతలు
[ 20-04-2024]
జమ్మికుంటలో వర్షం కురిసింది. దీంతో స్థానిక పాత వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడవకుండా అన్నదాతలు, మార్కెట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
రెండో రోజు నలుగురు నామినేషన్
[ 20-04-2024]
కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు రెండో రోజు శుక్రవారం కేవలం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ స్థానం కోసం భాజపా అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఆ పార్టీ నాయకులు ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు. -
ఆర్ఎం కార్యాలయానికి ఆరుగురు ఉద్యోగుల సరెండర్
[ 20-04-2024]
హుజూరాబాద్ ఆర్టీసీ డిపోనకు చెందిన ఆరుగురు ఉద్యోగులను కరీంనగర్ ఆర్ఎం కార్యాలయానికి సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్థానిక డిపోలో పనిచేసే డ్రైవర్ రవీందర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఈ నెల 15న అనిశా అధికారులకు చిక్కిన విషయం విదితమే. -
ఉక్కపోతతో తల్లీబిడ్డల ఉక్కిరిబిక్కిరి
[ 20-04-2024]
భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి. -
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరం
[ 20-04-2024]
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరమని హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు అన్నారు. వారికి చికిత్స అందేలా చూడాలని శుక్రవారం కరీంనగర్లో ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కి వినతిపత్రం అందజేశారు. -
గంగుల, బండిల స్నేహం అందరికీ తెలుసు
[ 20-04-2024]
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ల మధ్య స్నేహం అందరికీ తెలుసునని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను ఓడించేందుకు గంగుల కమలాకర్ భాజపాతో కుమ్మకైనట్లు ఆరోపించారు. -
వారసత్వ సంపద పరిరక్షణకు ఓటేద్దాం
[ 20-04-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. -
ఇదీ అన్నదాత ఎజెండా!
[ 20-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. భిన్న వ్యవసాయ ఉత్పత్తులతో రాష్ట్రంలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. దేశ విదేశాలకు ఎగుమతి చేసే పసుపు, మామిడి, మొక్కజొన్న, సన్న వరి, చెరకు, ఆవాలు, ఎర్రజొన్న, తెల్లజొన్న, సజ్జ తదితర పంటల దిగుబడిలో ఆదర్శంగా నిలుస్తున్నా అన్నదాతను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. -
ఒక ఎంపీ.. అయిదు జిల్లాలు
[ 20-04-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది. -
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
[ 20-04-2024]
ఇటుక బట్టీ వద్ద నీటి తొట్టిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. కుటుంబసభ్యులు పోలీసుల కథనం ప్రకారం.. -
శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి
[ 20-04-2024]
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థినులకు కరీంనగర్ కేజీబీవీలో నిర్వహిస్తున్న ఎప్సెట్ శిక్షణ తరగతులను సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి మల్లయ్య భట్టు శుక్రవారం సందర్శించారు. -
కరీంనగర్లో రూ.15.81 లక్షల పట్టివేత
[ 20-04-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శుక్రవారం పోలీసులు కరీంనగర్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.15.81 లక్షల నగదును పట్టుకున్నట్లు కమిషనర్ కార్యాలయం తెలిపింది. -
ఇంటి నుంచే ఓటింగ్పై అధికారులకు శిక్షణ
[ 20-04-2024]
ఇంటినుంచే ఓటింగ్పై పాటించాల్సిన నిబంధనలపై అధికారులకు మంథని శాసనసభ సెగ్మెంట్ అధికారి హనుమనాయక్ అవగాహన కల్పించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు శిక్షణ ఇచ్చారు. -
అడుగడుగునా తనిఖీలతో ప్రలోభాలకు అడ్డుకట్ట
[ 20-04-2024]
ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం
[ 20-04-2024]
బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. -
కిట్టు సరే.. పరీక్ష చేసేవారేరీ?
[ 20-04-2024]
కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్కడక్కడ పైపులు పగిలి లీకేజీతో కలుషితమైన నీరు సరఫరా అయ్యే అవకాశం ఉంది. -
ఆరేళ్లుగా ఉపాధి కరవు
[ 20-04-2024]
వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కోసం ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఆ కుటుంబాలకు పనులు కల్పించడం లేదు. -
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. -
‘పసుపు బోర్డు పేరుతో మోసం’
[ 20-04-2024]
పసుపు బోర్డు పేరుతో ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ