ఆధార్ నమోదుకు తపాలా శాఖ ఏర్పాట్లు
ఆధార్ కార్డు నేడు ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు.. పదేళ్ల క్రితం తీసుకున్న ఆధార్ కార్డుల్లో వివరాలు తాజాగా నమోదు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.
పోస్టాఫీసుల్లో శాశ్వత కేంద్రాలు
సవరణలకు అవకాశం
జమ్మికుంట సబ్ పోస్టాఫీస్లో ఆధార్ కార్డు నమోదుకు ఐరిస్ చిత్రీకరణ
న్యూస్టుడే, జమ్మికుంట: ఆధార్ కార్డు నేడు ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు.. పదేళ్ల క్రితం తీసుకున్న ఆధార్ కార్డుల్లో వివరాలు తాజాగా నమోదు చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇందు కోసం తపాలా శాఖ ప్రధాన పోస్టాఫీసుల్లో తాజాగా శాశ్వత ఆధార్ కార్డుల నమోదు కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పలు ప్రధాన పోస్టాఫీస్ల్లో ఆధార్ నమోదును చేపట్టింది. ఈ నెల చివరి దాకా ఆధార్ కార్డుల నమోదు మాసోత్సవంగా విస్తృతంగా సేవలు అందించేందుకు సిబ్బంది నిమగ్నమయ్యారు.. కొత్తగా ఆధార్ కార్డులు తీసుకునే వారికి, పాత కార్డులో తప్పిదాల సవరణకు సిబ్బంది సేవలు అందించనున్నారు. కొత్తగా కార్డులు తీసుకునే వారికి ఉచితంగా వివరాల నమోదు, కార్డుల జారీ చేయనున్నారు. పదేళ్ల క్రితం తీసుకున్న కార్డుల్లో సవరణలు, ఇతర వివరాల నమోదుకు నిర్ణీత ఫీజును నిర్ణయించారు.
* ఉమ్మడి జిల్లాలో పెద్దపల్లి పోస్టల్ డివిజన్లోని జమ్మికుంట, గోదావరిఖని, జ్యోతినగర్ సబ్ పోస్టాఫీస్ల్లో ఇప్పటికే ఆధార్ నమోదు కేంద్రాలను ప్రారంభించామని పెద్దపల్లి పోస్టల్ సూపరింటెండెంట్ ప్రభాకర్ చెప్పారు. కరీంనగర్ పోస్టల్ డివిజన్లోని కరీంనగర్ (హెడ్ పోస్టాఫీస్), మెట్పల్లి సబ్ పోస్టాఫీస్ల్లో ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియను చేపట్టారు.
* పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పెద్దపల్లి, హుజూరాబాద్, బసంత్నగర్, మంథని, రామగుండం, సుల్తానాబాద్ పోస్టాఫీస్లలో త్వరలోనే ఆధార్ నమోదు కేంద్రాలు ఆరంభం కానున్నాయి. కరీంనగర్ డివిజన్ పరిధిలోని సిరిసిల్ల, ముకరంపుర, చొప్పదండి, హుస్నాబాద్, వేములవాడ, కోరుట్ల పోస్టాఫీసుల్లో త్వరలోనే ఆధార్ కార్డుల నమోదు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి.
ఈ మార్పులు చేసుకోవచ్చు
* ఆధార్ కార్డుల్లో చరవాణి నంబరు మార్పు
* బయోమెట్రిక్ అప్డేట్
* 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ వివరాలు ఉచితంగా నమోదు
* పుట్టిన తేదీల తప్పిదాల్లో మార్పులు
* ఆధార్ కార్డుల్లో పేరు, చిరునామా, పాత చిత్రాలు మార్పు చేయటం, ఇతర అన్ని సవరణలు
* కొత్తగా ఆధార్ కార్డు కోసం వివరాల నమోదు ఉచితంగా చేస్తారు.
ఆధార్ కేంద్రాలను వినియోగించుకోవాలి
ఆధార్ కార్డుల నమోదు, సవరణల కోసం పోస్టాఫీసుల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం ఈ నెల ఆధార్ కార్డుల నమోదు ప్రత్యేక మాసోత్సవంగా సిబ్బంది విస్తృతం సేవలు అందిస్తారు. పోస్టాఫీసుల్లో శాశ్వతంగా ఆధార్ కార్డులకు సంబంధించిన కౌంటర్ల నిర్వహణ జరుగుతుంది. ఆధార్ కార్డుల వివరాల నమోదుకు ధ్రువీకరణ పత్రాలను సిబ్బందికి చూపించాలి. కేంద్రాల్లో ఆధార్ నమోదు, సవరణలు, ఆధార్ ప్రింటింగ్ ఇస్తారు. పోస్టాఫీస్ల్లోని కేంద్రాలను వినియోగించుకోవాలి.
ప్రభాకర్, పోస్టల్ సూపరింటెండెంట్, పెద్దపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!