కొత్త పథకాలకే నిధులు!
బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు అప్పటి ప్రభుత్వం గోదావరి జలాలను ఎత్తిపోసేలా పథకాలను చేపట్టింది.
పాత ఎత్తిపోతలకు మరమ్మతుపై నిర్లక్ష్యం
రంగసాగర్లో నిరుపయోగంగా ఎత్తిపోతల పథకం గది
న్యూస్టుడే, సారంగాపూర్: బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు అప్పటి ప్రభుత్వం గోదావరి జలాలను ఎత్తిపోసేలా పథకాలను చేపట్టింది. బీర్పూర్ మండలంలోని రంగసాగర్, చిత్రవేణిగూడెం, రాయికల్ మండలంలోని జగన్నాథపూర్, కొత్తపేట, మల్లాపూర్ మండలాల్లో బీడు భూములకు సాగునీరు అందివ్వడమే లక్ష్యంగా 1988లో రూ.15 లక్షల చొప్పున నిధులు వెచ్చించి ఆయా గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. అప్పట్లో అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారు అవినీతితో నాసిరకం పనులు, మోటార్లు బిగించారు. దీంతో మోటార్లు తరచూ కాలిపోవడం, పైపులైన్లు పగిలిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రారంభించిన ఏడాదిలోపే మూలనపడ్డాయి. రంగసాగర్లో తరచూ మరమ్మతుల పేరిట రూ.50 లక్షల వరకు నిధుల వృథా చేసినా ఏనాడు సాగునీరు అందలేదు. చిత్రవేణిగూడెంలోనూ పలుమార్లు మరమ్మతులు చేపట్టినా కొన్నేళ్లుగా పథకం నిరుపయోగంగా ఉంది. మరమ్మతులతో గుత్తేదారులకు లాభాలు వచ్చాయి కానీ తమకు ఒరిగిందేమీ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని కమ్మునూర్, మంగెళ, రేకులపల్లె, చిన్న కొల్వాయిలో నూతనంగా ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వానాకాలం వర్షాలకు గోదావరి వరద రావడంతో పథకాలు కొట్టుకుపోయాయి. వాటి మరమ్మతులకు ప్రభుత్వం రూ.273.96 లక్షలు మంజూరు చేయగా ప్రస్తుతం పనులు కొనసాగుతుండగా, పాత పథకాల ఊసేలేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సొంతంగా మోటార్ల ఏర్పాటు..
గోదావరి చెంతనే నిండుగా పారుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రైతులు సొంతంగా గోదావరి వద్ద మోటార్లను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో రైతు కిలోమీటర్ల పొడవునా సొంతంగా పొలాలకు పైపులైన్లు వేసుకుంటున్నారు. ఇందుకోసం ఒక్కో రైతు సుమారు రూ.3 లక్షల వరకు వ్యయం చేశారు. 20 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన సిమెంటు పైపులు శిథిలమైపోవడంతో, నూతన పైపులైన్లను ఏర్పాటు చేసుకోవడం భారంగా మారిందని రైతులు వాపోతున్నారు. అధికారులను కలిస్తే నిధులు సమీకరించుకోమంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుంటలు నింపినా చాలు.. -సతీష్, రంగసాగర్
ఇటీవల పలు గ్రామాల్లో వరదలకు కొట్టుకుపోయిన పథకాల మరమ్మతులకు నిధులు మంజూరు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన పథకాలకు నిధులు మంజూరు చేయకపోవడం బాధాకరం. ఎత్తిపోతల పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురికావడంతో సొంతంగా మోటార్లు ఏర్పాటు చేసుకుంటున్నాం. కొంత మంది ఖర్చుకు భయపడి వ్యవసాయాన్నే వదిలేస్తున్నారు. కనీసం గ్రామంలోని కుంటలు, చెరువుల్లోకి నేరుగా నింపేలా చేస్తే వాటి ద్వారా సాగు చేసుకునే అవకాశముంది.
పనులు కొనసాగుతున్నాయి
-చక్రునాయక్, డీఈఈ
గోదావరి వరదకు కొట్టుకుపోయిన పలు పథకాల మరమ్మతులకు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఆయా పనులు కొనసాగుతుండగా, గతంలో ఉన్న వాటికి నిధులు మంజూరు కాలేదు. పాత పథకాలకు నిధులు మంజూరు చేసేలా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
తాజా వార్తలు (Latest News)
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!
-
కార్లు, స్థలాల పేరుతో రూ.కోట్లు స్వాహా