తలాపునే గోదావరి.. గొంతు తడిపే దారేది!
తలాపునే గోదావరినది ఉన్నా ధర్మపురిలో మాత్రం తాగు నీటి సమస్యలు నేటికీ పరిష్కారం కావడం లేదు.
మిషన్ భగీరథ నీటి సరఫరా అంతంతే
పట్టణ ప్రజల పాట్లు
ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా
న్యూస్టుడే, ధర్మపురి: తలాపునే గోదావరినది ఉన్నా ధర్మపురిలో మాత్రం తాగు నీటి సమస్యలు నేటికీ పరిష్కారం కావడం లేదు. గత మూడు రోజులుగా మిషన్ భగీరథ ప్రధాన గ్రిడ్ నుంచి ధర్మపురికి తాగునీరు సరఫరా కావడం లేదు. అసలే వేసవి, మరోవైపు శుభ కార్యాలు, భక్తుల రద్దీ వెరసి తాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా మిషన్ భగీరథ గ్రిడ్ పైపు లైనుకు పలు చోట్ల లీకేజీలు ఏర్పడటంతోనే, పురాతన నీటి ట్యాంకులోకి నీరందడం లేదని స్థానికులు భావిస్తున్నారు. గత మూడు రోజులుగా మిషన్ భగీరథ గ్రిడ్ పైపుల ద్వారా నీరందకపోవడంతో ప్రజలు తీవ్రస్థాయిలో తాగు నీటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని పుర అధికారులు సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో నల్లాల ద్వారా నీరందక వేసవిలో ప్రజలు శుద్ధజల నీటి ప్లాంట్ల వైపు పరుగులు తీస్తున్నారు. నూటికి యాభై శాతం మంది పట్టణంలో ప్రైవేటు శుద్ధజల నీటి ప్లాంట్లపై ఆధార పడుతుండగా మిగతా యాభైశాతం మంది నల్లాలపై ఆధార పడుతున్నారు. ధర్మపురి పట్టణంలో ఐదువేల నల్లా కనెక్షన్లుండగా వీటికి మిషన్ భగీరథ పథకం ద్వారా నీరందడం లేదు. నూతనంగా నిర్మించిన బోలిచెరువు పథకం ద్వారా సరఫరా చేయాలని యోచించినా, చెరువులో నీరు లేకుండా పోయింది. దీంతో ప్రధానంగా మిషన్ భగీరథ పైపులైను పథకం ద్వారానే సరఫరా అయ్యే నీటిపై ఆధార పడాల్సి వస్తోంది. ఈ పథకం ప్రధాన గ్రిడ్ పైపులైన్లకు బుద్దేశ్పల్లి, బుగ్గారం మండలంలోని పలు గ్రామాల్లో లీకేజీలు ఏర్పడటంతో స్థానికులకు నీటికోసం ఇక్కట్లు తప్పడం లేదు. వారానికోమారు ఒక్కోచోట గండి పడటంతో ప్రధాన పైపులైన్లకు లీకేజీలు ఏర్పడుతున్నాయి. గత్యంతరం లేక పురపాలకసంఘం అధికారులు గోదావరినది పురాతన పైపులైనుకు అనుసంధానం చేశారు. కాగా గాంధీ విగ్రహ కూడలి వద్ద కింది ప్రాంతంలో పైపులైను దెబ్బతినడంతో అనుసంధానం చేయలేకపోతున్నారు. వేసవి దృష్ట్యా మిషన్ భగీరథ పైపులైను ద్వారా పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆయా అంశాలను ‘న్యూస్టుడే’ పుర కమిషనర్ సీహెచ్ రమేష్ దృష్టికి తీసుకువెళ్లగా... తాగునీటి సరఫరా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ట్యాంకర్ల ద్వారా పంపిస్తున్నామన్నారు. ప్రధానంగా మిషన్ భగీరథ పథకం పైపులైను లీకేజీలతో కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయని... వాటి పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ