లోలెవల్ వంతెన కష్టాలు ఇంకెన్నాళ్లో?
గంభీరావుపేట - లింగన్నపేట మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు లోలెవల్ వంతెన కష్టాలు తప్పడం లేదు.
మానేరు వాగుపై లోలెవల్ వంతెన
న్యూస్టుడే, గంభీరావుపేట: గంభీరావుపేట - లింగన్నపేట మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు లోలెవల్ వంతెన కష్టాలు తప్పడం లేదు. ఏళ్లుగా వరదలతో ఇబ్బందులు పడుతున్నామని.. ఇకనైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి
గంభీరావుపేట నుంచి లింగన్నపేటకు వెళ్లే దారిలో మానేరు వాగుపై గతంలో నిర్మించిన లోలెవల్ వంతెన ఉంది. అప్పటి మాజీ మంత్రి పాటి రాజం కృషితో లోలెవల్ వంతెనను నిర్మించారు. నాటి పరిస్థితులకు ఆ వంతెన సరిపోయింది కానీ.. కాలక్రమేణ వంతెన పూర్తిగా లోలెవల్ కావటంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ మానేరు నిండి మత్తడి దూకుతున్న సమయంలో వంతెనపై నుంచి వరద ఉద్ధృతంగా వెళ్తుండగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. గంభీరావుపేట నుంచి సిద్దిపేట, ముస్తాబాద్, కొత్తపల్లి, దుబ్బాక, లింగన్నపేటకు వెళ్లడానికి.. లింగన్నపేట నుంచి గంభీరావుపేట, మాచారెడ్డి, కామారెడ్డికి వెళ్లడానికి వీలులేకుండా పోతుండగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వంతెనపై వరద వెళ్లిన ప్రతీసారి ఇబ్బందులు పడుతున్నారు. చాలాసార్లు ప్రజాప్రతినిధులతో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. రెండు సంవత్సరాల క్రితం వంతెనపై వరద వెళ్లిన సమయంలో బస్సు వంతెనపై చిక్కుకుందని, తృటిలో ప్రాణాపాయం తప్పిందని గుర్తు చేసుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ.17 కోట్లు మంజూరైనా..
ఇటీవల కురిసిన వర్షాలకు గతంలో ఎప్పుడూ లేనివిధంగా వంతెన పైనుంచి భారీగా వరద వెళ్లింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. స్థానిక భాజపా, అభావిప నాయకులు సైతం వంతెన నిర్మాణం చేయాలని ధర్నాలు చేశారు. దీంతో భారాస నాయకులు మంత్రి కేటీఆర్కు విన్నవించగా మంత్రి స్పందించి పైవంతెన నిర్మాణానికి గత సంవత్సరం డిసెంబర్లో రూ.17 కోట్ల నిధులను మంజూరు చేశారు. దీంతో భారాస నాయకులు సంబరాలు చేసుకుని ప్రస్తుతం ఉన్న వంతెన వద్ద సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. నిధులు మంజూరు చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే మాదిరిగా క్షేత్రస్థాయి పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. మొదటి దశ ఆన్లైన్ టెండర్ వంతెన నిర్మాణానికి ఒక్కరూ ముందుకు రాకపోవడంతో అధికారులు ఇటీవల రెండోసారి ఆన్లైన్ టెండర్ వేశారు. అయినా ఎవరూ ముందుకు రాలేదని అధికారులు చెబుతున్నారు. సొంత డబ్బులతో పనులు చేస్తున్నా డబ్బులు రాకపోతుండడంతో గుత్తేదారులు అనాసక్తి చూపుతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. టెండరు ప్రక్రియను త్వరగా పూర్తి చేసి వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
త్వరలోనే పనులు ప్రారంభం
- నరేందర్, ఆర్అండ్బీ ఏఈ
వంతెన నిర్మాణానికి రూ.17 కోట్ల నిధులతో పరిపాలన అనుమతులతో పాటు సాంకేతిక అనుమతులు వచ్చాయి. ఆన్లైన్లో టెండర్ ప్రక్రియ ప్రారంభించినా ఎవరూ ముందుకు రావటం లేదు. గుత్తేదారులతో మాట్లాడి త్వరగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపడుతాం.
వంతెన నిర్మాణంలో జాప్యం తగదు
మాది కొతపల్లి గ్రామం. మా ఊరు నుంచి నిత్యం పలురకాల పనులపై గంభీరావుపేట మండల కేంద్రానికి ప్రజలు వెళ్తుంటారు. వర్షాలు కురిసిన సమయంలో మానేరు వాగు వచ్చినప్పుడు వంతెన మునిగి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. రూ.17 కోట్ల నిధులు మంజూరు అయినట్లు చెబుతున్నా ఇప్పటికీ సమస్య పరిష్కారానికి మోక్షం లేదు. ప్రతీ వర్షాకాలం ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మంత్రి కేటీఆర్ స్పందించి పనులు వేగంగా పూర్తిచేసేలా చూడాలి.
గౌటి గణేశ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.