భగీరథ జలం.. అందనంత దూరం
ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లిస్తున్నామని పాలకులు చెబుతున్నా ధర్మారం మండలం కమ్మర్ఖాన్పేటకు శుద్ధ జలాలు అందని ద్రాక్షగానే మారాయి.
పంచాయతీలపై విద్యుత్తు బిల్లుల భారం
చిత్రంలో తాగునీటి కుళాయి వద్ద నిల్చున్నది బత్తిని సరళ-వెంకటేష్. ఊరు కమ్మర్ఖాన్పేట. వీరి ఇంటి వద్దకు పైపులైన్లు వేసి నల్లాలు బిగించినా తాగునీరు రావడం లేదు. దీంతో చేదబావి నీళ్లనే తాగుతున్నామని వాపోతున్నారు. ఈ ఒక్క కుటుంబమే కాదు. ఊళ్లో ఎవరికీ మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదు. దీంతో కుళాయిలు అలంకార ప్రాయంగా మారాయి.
న్యూస్టుడే, ధర్మారం : ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లిస్తున్నామని పాలకులు చెబుతున్నా ధర్మారం మండలం కమ్మర్ఖాన్పేటకు శుద్ధ జలాలు అందని ద్రాక్షగానే మారాయి. 451 కుటుంబాలున్న ఈ గ్రామ జనాభా 1,679. ధర్మారంలోని భగీరథ ప్లాంటులో శుద్ధి చేసిన జలాలు ఇక్కడకు చేరాల్సి ఉంది. గ్రామంలో అంతర్గత పైపులైన్లు వేసినా, ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసినా, పాఠశాల పక్కనే గుట్టపై ఉన్న ట్యాంకుకు పైపులైనును కలిపినా నీళ్లు మాత్రం రావడం లేదు. దీంతో స్థానికంగా వున్న బావి, బోరు ఆధారంగా పాత పైపులైన్ల ఆధారంగానే తాగు నీరందిస్తున్నారు. ఇందుకు ప్రతి నెలా రూ.51 వేల వరకు పంచాయతీ విద్యుత్తు బిల్లు చెల్లించాల్సి వస్తోంది. తమ గ్రామానికి శుద్ధ జలాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్య తీరలేదని సర్పంచి గుజ్జుల రమ పేర్కొన్నారు.
ఒక్క ఊరిలోనే కాదు..
* బొమ్మారెడ్డిపల్లిలోనూ సగం గ్రామానికి తాగు నీరందడం లేదు. ఇక్కడ రెండు ట్యాంకులుండగా ఒక దాంట్లోకే నీళ్లు చేరుతున్నాయి. మరో ట్యాంకు ఎత్తుగా ఉండటంతో ఎక్కడం లేదు. దీంతో సగం గ్రామానికి మాత్రమే సరఫరా అవుతున్నాయి.
* బూస్టర్ పంపు ఏర్పాటు చేసి ట్యాంకులోకి నీళ్లు చేర్చేందుకు యత్నించారు. కానీ పంపును ఆన్ చేస్తే మొదటి ట్యాంకులోకి చేరడం లేదు. ఈ విషయమై సర్పంచి ప్రేమలత పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించలేదు. దీంతో ఈ ఊరి ప్రజలు ఏళ్ల తరబడి బావులనే నమ్ముకున్నారు. నెలకు రూ.45 వేల వరకు విద్యుత్తు బిల్లు వస్తోంది.
* బొట్లవనపర్తి ఎస్సీ కాలనీకి సైతం శుద్ధ జలాలు అందడం లేదు. ఓ గేట్వాల్వు మరమ్మతుకు నోచుకోవడం లేదు. పంచాయతీ ద్వారా వాల్వు మరమ్మతుకు పాలకవర్గం సముఖంగా ఉన్నా మిషన్ భగీరథ పైపులైన్ల మరమ్మతు అధికారులే చేపట్టాల్సి ఉండటంతో మిన్నకుంటున్నామని సర్పంచి ప్రమీల తెలిపారు.
* దొంగతుర్తి పాఠశాల వద్ద ఎర్రబోరుపై ఉన్న ట్యాంకులోకి అరకొరగా నీళ్లు వస్తున్నాయి. దీంతో స్థానిక బావి నీటినీ ట్యాంకులోకి తరలించి గ్రామానికి సరఫరా చేస్తున్నారు. చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ, స్థానిక వనరుల నీళ్లను కలిపి సరఫరా చేస్తున్నారు. దీంతో చాలా మంది ఈ నీటిని తాగేందుకు అయిష్టత కనబరుస్తున్నారు.
అధికారులేమంటున్నారంటే..
బొట్లవనపర్తిలో గేట్వాల్వు బిగింపు పనులను పంచాయతీ ఆధ్వర్యంలో చేపడితే రికార్డు చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఇంట్రా డీఈఈ రాజ్కుమార్ తెలిపారు.
కమ్మర్ఖాన్పేటకు తాగునీరందించే పైపులైనులో సమస్య ఉందని, వీలైనంత త్వరగా మరమ్మతు చేస్తామని గ్రిడ్ ఏఈ అజీముద్దీన్ వివరించారు. బొమ్మారెడ్డిపల్లిలో నీళ్లు చేరని ట్యాంకు వద్ద ఇదివరకే ఉన్న సంపుకు పంపుసెట్టు ఏర్పాటు చేసి ట్యాంకులోకి నీటిని ఎత్తిపోస్తామన్నారు.
గ్రామంలోని నీటి ట్యాంకు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
[ 19-04-2024]
కమాన్పూర్ మండలం రొంపికుంట ఉపకేంద్రం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్