సేవలు మెరుగైతేనే పూర్తి స్థాయి ధ్రువీకరణ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్రం నిర్వహించిన ‘లక్ష్య’, ‘ముస్కాన్’ పోటీల్లో గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రికి ఆశించిన మేరకు మార్కులు రాకపోగా శరతులతో కూడిన
ముస్కాన్ పోటీలో మార్కులు అంతంతే
గోదావరిఖని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలోని పిల్లల వార్డు
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం : ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్రం నిర్వహించిన ‘లక్ష్య’, ‘ముస్కాన్’ పోటీల్లో గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రికి ఆశించిన మేరకు మార్కులు రాకపోగా శరతులతో కూడిన ధ్రువీకరణతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రసూతి విభాగంలో వైద్య సేవల తీరును ధ్రువీకరించేందుకు ‘లక్ష్య’ పిల్లల వైద్య సేవల తీరుపై ‘ముస్కాన్’ పోటీల్లో జాతీయ ఆరోగ్య మిషన్ మార్గదర్శకాల ప్రకారంగా సేవలు లేకపోవడంతో మార్కులు తక్కువ వచ్చాయి. 2019లో నిర్వహించిన లక్ష్య పోటీల్లో గోదావరిఖని ఆసుపత్రి 88 శాతం మార్కులతో ధ్రువీకరణకు ఎంపిక కాగా ఇటీవల నిర్వహించిన పోటీల్లో కేవలం 76 శాతం మార్కులతో శరతులతో కూడిన ధ్రువీకరణతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జాతీయ స్థాయిలో మొదటి సారిగా నిర్వహించిన ముస్కాన్ పోటీల్లోనూ గోదావరిఖని ఆసుపత్రి 83శాతం మార్కులతో శరతులతో కూడిన ధ్రువీకరణకు ఎంపిక కావాల్సి వచ్చింది. ఈ కారణంగా ఒకే సంవత్సరం ప్రయోజనం చేకూరనుంది. వచ్చే సంవత్సరం నాటికైనా ఈ లోపాలను సవరించుకొని అత్యుత్తమ మార్కులు సాధిస్తే పూర్తిస్థాయిలో మూడేళ్ల పాటు ఆర్థిక ప్రయోజనాలు అందుకునే అవకాశముంది.
ప్రసూతి సేవల్లో వెనుకబాటు
ప్రసూతి సేవలకు సంబంధించిన ‘లక్ష్య’లో సహజ ప్రసవాల గదికి 76 శాతం, ఆపరేషన్ థియేటరుకు 77 శాతం మార్కులు వచ్చాయి. ప్రధానంగా వ్యాధి నిర్ధారణ, అంటువ్యాధుల నివారణ, నాణ్యత పెంపు, రక్తనిధి కేంద్రం నిర్వహణ తదితర విభాగాల్లో 50శాతం మార్కులే రావడంతో ఆయా విభాగాల్లో సేవలను మెరుగుపరచుకోవాల్సి ఉంది. వీటితో పాటు ఆసుపత్రిని పరిశీలించిన ‘లక్ష్య’ ప్రతినిధులు పలు సూచనలు చేశారు. ప్రధానంగా తల్లి, బిడ్డలకు ట్యాగ్స్ పెట్టడం లేదు. సహజ ప్రసవాల గదిలో మార్గదర్శకాల ప్రకారం పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన నర్సింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. రికార్డులను పక్కాగా నిర్వహించాలి. ప్రసవానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. గర్భిణి, బాలింత పడకలకు సమీపాన శిక్షణ పొందిన సహాయకులను ఏర్పాటు చేయాలి. అత్యవసర వేళల్లో స్పందించాల్సిన అంశాలపై అవగాహన కల్పించాలి.
పిల్లల వైద్యంలో ప్రగతి
ఆసుపత్రిలోని 12 సంవత్సరాల లోపు పిల్లలకు అందిస్తున్న వైద్య సేవలను మరింత మెరుగు పరచుకోవాల్సి ఉంది. ఇటీవల చేపట్టిన ‘ముస్కాన్’ పరిశీలనలో 83 శాతం మార్కులు వచ్చినప్పటికీ కొన్ని విభాగాల్లో లక్ష్యాలను చేరుకోలేకపోవడంతో శరతులతో కూడిన ధ్రువీకరణ ఇచ్చారు. పిల్లల ఓపీ విభాగంలో 79 శాతం, ఇన్పేషెంటు విభాగంలో 90 శాతం, నవజాత శిశు సంరక్షణ కేంద్రానికి 80 శాతం మార్కులు కేటాయించారు. నాణ్యతా ప్రమాణాల పెంపుదలకు 72 శాతం, సదుపాయాల కల్పనకు 63 శాతం, ఔషధాల నిర్వహణకు 66 శాతం, సిబ్బంది పనితీరు మెరుగుదలలో 56 శాతం మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నవజాత శిశు సంరక్షణ కేంద్రంతో పాటు పిల్లల వార్డుల్లో సేవలందించే వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంది. తల్లీబిడ్డలకు సంబంధించి ఆరోగ్య కార్డులను నిర్వహించాలి. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై ప్రజల ప్రతిస్పందనపై విచారణ చేపట్టాలి. రోగులు, ఉద్యోగుల సంతృప్తి విభాగంలో కేవలం 56 శాతం మార్కులు రాగా నాణ్యతా ప్రమాణాల పరిశీలన విభాగంలో 58 మార్కులే వచ్చాయి. పిల్లల వైద్యంపై ఎప్పటికప్పుడు సమీక్షల నిర్వహణ, అంతర్గత పరిశీలనలో 50 శాతం మార్కులు వచ్చాయి. రిస్క్ మేనేజ్మెంట్లో 50శాతం మార్కులే వచ్చాయి. శిశు మరణాల రేటు తగ్గింపు, న్యుమోనియా, డయేరియా వ్యాధుల నివారణలో జాతీయ ఆరోగ్య మిషన్ సూచించిన లక్ష్యాలను చేరుకోలేకపోయారు. ఇప్పటికైనా ఆయా విభాగాల్లో సేవలు మెరుగుపరిచేందుకు ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
నేటి నుంచి నామినేషన్లు షురూ!
[ 18-04-2024]
ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్తో అసలు అంకం షురూ అవనుంది. -
ప్రచార పర్వానికి కాంగ్రెస్ సిద్ధం!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది. -
కొప్పుల మొదటిసారి.. జీవన్ మూడోసారి
[ 18-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి. -
క్లిక్ దూరంలో సమగ్ర సమాచారం
[ 18-04-2024]
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి. -
రెండు సార్లు ఎంపీ.. సాధారణ జీవనం
[ 18-04-2024]
వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. -
ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. -
హాట్రిక్ విజేత..అరుదైన ఘనత
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. -
అక్కడ స్థానికేతరులే అధికం
[ 18-04-2024]
1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు. -
వసతుల మెరుగుకు కార్యాచరణ
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. -
ఆదాయంలో జమ్మికుంట మార్కెట్ టాప్
[ 18-04-2024]
పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. -
ఓటరు దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం
[ 18-04-2024]
నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్లు పాల్గొన్నారు. -
మిల్లుల్లోనే బియ్యం.. ధాన్యానికేదీ స్థలం?
[ 18-04-2024]
గత వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం
-
పదవి కోసం పెద్దిరెడ్డి నా కాళ్లు పట్టుకున్నారు: కిరణ్కుమార్రెడ్డి
-
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
-
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?