హరిత లక్ష్యం చేరేనా!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం హరిత తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో 2014లో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
9వ విడతలో జిల్లా లక్ష్యం 18,03,000 మొక్కలు
కోరుట్ల మండలం యూసుఫ్నగర్ నర్సరీలో సిద్ధంగా మొక్కలు
న్యూస్టుడే, కోరుట్ల : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం హరిత తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో 2014లో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతంలో ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం’లో ఊరురా విస్తృతంగా మొక్కలను నాటించే కార్యక్రమం అమలు చేస్తుంది. ప్రస్తుత ఏడాది ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19న ‘తెలంగాణ హరితోత్సవం’ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ఇప్పటికే నిర్దేశించింది. అదే రోజు 9వ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభించనున్నట్లు రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఇటీవల వెల్లడించారు. దీంతో జగిత్యాల జిల్లాలో 9వ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమౌతుంది.
స్వల్ప లక్ష్యంతో సాధన
9వ విడత హరితహారం కార్యక్రమం ద్వారా ఊరురా, పంచాయతీ వాడల్లో, రోడ్ల కిరువైపులా, ప్రభుత్వ స్థలాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, రైతుల భూముల్లో, పొలం గట్లపై, ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటాలని ఉపాధిహామీ సిబ్బంది స్థలాలను ఇప్పటికే గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో, ఇంటింటికీ పంపిణీ చేసేందుకు గ్రామపంచాయతీలోని నర్సరీల్లో నీడనిచ్చే, పండ్ల, పూల మొక్కలను పెంచి సిద్ధంగా ఉంచారు. గతంలో ప్రతి గ్రామపంచాయతీకి 40వేల మొక్కలు నాటాలనే లక్ష్యంను జిల్లా అధికారులు నిర్దేశించేవారు. అధికారులు కేటాయించిన లక్ష్యం అందుకోవడం కష్టంగా మారేది. నామమాత్రంగా మొక్కలు నాటి కాగితాల మీద లెక్కలు చెప్పడంతో విమర్శలపాలయ్యేవారు. 2022-23 నుంచి గ్రామపంచాయతీలలో ఎన్ని మొక్కలు నాటాలనే లక్ష్యంను ఉపాధిహామీ సిబ్బంది, పంచాయతీ పాలకులకు అప్పగించారు. వారు డిసెంబర్లో గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామంలో ఏరకమైన మొక్కలు ఎన్నినాటాలి, ఇళ్లలో ప్రజల భాగస్వామ్యంతో ఎలాంటి మొక్కలు నాటించవచ్చని నిర్ణయిస్తారు. గ్రామాల్లో ఇప్పటికే మొక్కలు నాటించే స్థలాలను గుర్తించారు. గ్రామపంచాయతీ పరిధిలోని పరిస్థితులను బట్టి స్వల్ప లక్ష్యం నిర్దేశించుకోవడంతో శతశాతం అమలు పరిచేందుకు ఉపాధిహామీ సిబ్బంది, పాలక యంత్రాంగం శ్రమిస్తున్నారు. ఈవిషయమై ‘న్యూస్టుడే’ జిల్లా డీఆర్డీఏ పీడీ లక్ష్మినారాయణను సంప్రదించగా 19న హరితోత్సవం రోజునే జిల్లావ్యాప్తంగా హరితహారం కార్యక్రమం అమలు చేసేందుకు నిర్ణయించామని పేర్కొన్నారు. అదేరోజున అన్ని గ్రామాల్లో, ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వివరించారు. వర్షాలు కురిసే పరిస్థితులను బట్టి మొక్కలను నాటిస్తామని, అప్పటివరకు ఉపాధిహామీ సిబ్బంది కూలీలతో గుంతలను తవ్వి, మొక్కలను సరఫరా చేసి సిద్ధంగా ఉంచుతామన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసిన వెంటనే మొక్కలను పూర్తిస్థాయిలో నాటిస్తామని పేర్కొన్నారు.
కోరుట్ల మండలం సంగెం రోడ్డులో మొక్కలు నాటకుండా వదిలేసిన రహదారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్