శారీరక దృఢత్వంతోనే మానసికోల్లాసం
శారీరక దృఢత్వంతోనే మానసికోల్లాసం లభిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోనూ రాణించాలని ఆయన సూచించారు.
జిల్లా స్థాయి క్రీడా పోటీల ప్రారంభంలో మంత్రి కమలాకర్
క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న మంత్రి గంగుల కమలాకర్, చిత్రంలో ఎమ్మెల్యే రసమయి, తదితరులు
తిమ్మాపూర్, న్యూస్టుడే : శారీరక దృఢత్వంతోనే మానసికోల్లాసం లభిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోనూ రాణించాలని ఆయన సూచించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను గురువారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. గతంలో చదవాలన్న కోరిక ఉన్న చదివించే ప్రభుత్వాలు లేవని నేడు సీఎం కేసీఆర్ అందరికి విద్యనందించాలనే ఉద్దేశంతో కేజీ టు పీజీ విద్య ప్రవేశపెట్టారని వివరించారు. విద్యార్థులు క్రీడలకు దూరం కావద్దనే ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో కేవలం 19 గురుకులాల్లో 8వేల మంది విద్యార్థులు చదువుకునేవారని, ప్రస్తుతం 337 గురుకులాల్లో 1,85,000 మంది విద్యనభ్యసిస్తున్నారన్నారు. గురుకులాల్లో అందించే నాణ్యమైన విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని కోరారు. పాఠశాలలో నీటి సమస్య ఉందని పలువురు విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకు రాగా సాయంత్రంలోగా సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు. వర్షం కారణంగా పోటీలకు కొంత అంతరాయం కలిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జిల్లా పాలనాధికారి గోపి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ మధు, మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలల డిప్యూటీ కమీషనర్ తిరుపతి, ప్రిన్సిపల్ విమల, భారాస మండలాధ్యక్షుడు రమేష్, ఎంపీపీ వనిత, సర్పంచులు నీలమ్మ, శ్రీవాణి, రాష్ట్ర నాయకుడు దేవేందర్రెడ్డి, ఏకానందం తదితరులు పాల్గొన్నారు.
చిన్నారుల మాటలకు మంత్రి ఫిదా..
క్రీడా పోటీలు ప్రారంభించిన అనంతరం మంత్రి అక్కడి నుంచి వెళ్తుండగా చిన్నారులంతా అడ్డగించి, వారి ముద్దు ముద్దు మాటలతో తమ నృత్యాన్ని చూడాలని కోరారు. వారి మాటలకు ముగ్ధుడైన మంత్రి చిన్నారుల డ్యాన్స్ను తిలకించి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరుట్ల మాజీ ఎమ్మెల్యేకు అస్వస్థత
[ 08-12-2023]
కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అస్వస్థతకు గురయ్యారు. -
ఇద్దరికి అమాత్యయోగం
[ 08-12-2023]
అందరూ అనుకున్నట్లే.. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలిద్దరికి మంత్రి పదవులు లభించాయి. మంథని శాసనసభ్యుడిగా గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు హుస్నాబాద్లో విజేతగా నిలిచిన పొన్నం ప్రభాకర్లు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. -
6 గ్యారంటీలపై ఆశల ఊసులు
[ 08-12-2023]
కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వేళ.. ఉమ్మడి జిల్లా వాసులకు ఆరు గ్యారంటీల అమలుపై ఆశలు పెరుగుతున్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలి సంతకం చేయడంతోపాటు ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజున గురువారం రాష్ట్రమంత్రి వర్గం భేటీలో ఈ నిర్ణయాలపై చర్చించడంతో యంత్రాంగం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అధ్వాన దారులు... తప్పని అవస్థలు!
[ 08-12-2023]
-
పల్లెల్లో మద్యం జోరు
[ 08-12-2023]
పల్లెల్లో మళ్లీ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. నెల రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో మద్యం అమ్మకాలు నిషేధించారు. కోడ్ ఎత్తేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఒక్కో గ్రామంలో 3 నుంచి 8 వరకు మద్యం గొలుసు దుకాణాల ఏర్పాటుతో పలువురు బానిసలుగా మారుతున్నారు. -
మహిళలు సామాజికంగా ఎదగాలి
[ 08-12-2023]
మార్వాడి మహిళలు సామాజికంగా, సాంస్కృతికం ఎదిగి సమాజంలో భాగస్వాములు కావాలని అఖిల భారత మార్వాడి మహిళా మండలి అధ్యక్షురాలు నీరాజీ బత్వాల్ అన్నారు. దక్షిణ భారత మార్వాడి మహిళా మండలిని విస్తృత పరిచేందుకు, సంఘాలను బలోపేతం చేసేందుకు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం సాయంత్రం కరీంనగర్ మార్వాడి మందిర్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
పనుల్లో జాప్యం.. పెరగాలి వేగం
[ 08-12-2023]
అయిదేళ్లకు ఒకసారి జరిగే శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రెండు నెలలుగా అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ మూడు రోజుల కిందట ముగిసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు ఎప్పటిలాగే యథావిధిగా కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. -
క్రీడా స్ఫూర్తి చాటాలి
[ 08-12-2023]
క్రీడలతో విద్యార్థుల్లో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని డీఈవో మాధవి అన్నారు. పెద్దపల్లి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రామగుండం లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ సౌజన్యంతో ఎల్కలపల్లిగేటు కాలనీలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గురువారం ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. -
యువ కార్మికులే నిర్ణయాత్మకం
[ 08-12-2023]
సింగరేణి ఎన్నికల్లో ఈసారి యువ కార్మికులే కీలకం కానున్నారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత ఓట్లు ప్రాధాన్యత చాటుకోనున్నాయి. సింగరేణి ఎన్నికల్లో మొత్తం 39,832 మంది కార్మికులున్నారు. ఇందులో 16 వేల మంది వరకు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత ఉన్నారు. -
ఎన్నికల సిబ్బందికి అభినందన
[ 08-12-2023]
ఎలాంటి వివాదం తలెత్తకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారని జిల్లా కలెక్టర్ ముజామిల్ఖాన్ అన్నారు. ఎన్టీపీసీలో గురువారం సాయంత్రం రామగుండం ఎన్నికల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. -
ఖని ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి
[ 08-12-2023]
గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహిళ కడుపులో శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతిచెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళ బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జాతీయ స్థాయి క్రీడాకారిణికి సన్మానం
[ 08-12-2023]
ఇటీవల గోవాలో జరిగిన జాతీయ స్థాయి మహిళా కాంపౌండ్ అర్చరీ క్రీడల్లో ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు చెందిన తానిపర్తి చికిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, బంగారు పతకం సాధించింది. -
ధాన్యం సేకరణపై తుపాను ప్రభావం
[ 08-12-2023]
తుపాను ప్రభావం జిల్లాలో ధాన్యం సేకరణపై పడింది. గత రెండు రోజులుగా చినుకులు పడుతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. విక్రయానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం అకాల వర్షంతో తడిసిపోతాయని అన్నదాతలు టార్పాలిన్ కవర్లు కప్పారు. -
ఎన్నికల్లో మద్యం కిక్కు!
[ 08-12-2023]
శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో మద్యం ఏరులై పారింది. మద్యం ప్రియులకు కిక్కు ఇవ్వగా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకు రూ. వంద కోట్లకు పైగా విక్రయాలు సాగాయి. -
కొత్త వారు రాక.. ఉన్నవాళ్లు చదవలేక
[ 08-12-2023]
సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించి మూడేళ్లవుతుంది. దీనిలో టెక్స్టైల్ టెక్నాలజీలో రెండేళ్లుగా ఒక్కరూ ప్రవేశాలు పొందలేదు. తొలి ఏడాది ఎంసెట్, ఈసెట్ ద్వారా వచ్చిన 14 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ కోర్సుకు రెండేళ్లుగా అగ్రహారం పాలిటెక్నిక్ డిప్లొమా, ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తున్నారు. -
రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ
[ 08-12-2023]
ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం గురువారం ఉదయం గీతా కార్మికులు ఎల్లమ్మ ఆలయం వద్దకు వెళ్లేసరికి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా.. -
‘ఈనాడు’ ఆటో ఎక్స్పో వాయిదా
[ 08-12-2023]
ఈ నెల 9, 10 తేదీల్లో కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించాల్సిన ‘ఈనాడు’


తాజా వార్తలు (Latest News)
-
IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్లు.. అప్పుడు హీరోలు వీరే!
-
NTR: నెట్ఫ్లిక్స్ కో-సీఈవోకు ఎన్టీఆర్ ఆతిథ్యం.. ఫొటోలు వైరల్
-
ఐటీ సోదాల్లో ₹220 కోట్లు స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న మోదీ
-
Chandrababu: రైతుల కష్టాలు జగన్కు ఏం తెలుసు?: చంద్రబాబు
-
Vadhuvu: రివ్యూ: వధువు.. అవికా గోర్ నటించిన వెబ్సిరీస్ ఎలా ఉందంటే?
-
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ