ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం
జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తయి, వాటిలో మౌలిక వసతులు అందుబాటులో ఉన్న వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
లబ్ధిదారుల ఎంపికకు సర్వే
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణం పెద్దూరులో పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్లు
జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తయి, వాటిలో మౌలిక వసతులు అందుబాటులో ఉన్న వాటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దీనికోసం మండలాల వారీగా పూర్తయిన ఇళ్ల నిర్మాణాలు, వాటికి వచ్చిన దరఖాస్తుల జాబితాలో అర్హులను గుర్తిస్తున్నారు. ఈ నెలాఖరు, వచ్చే నెలలో విడతల వారీగా ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలని భావిస్తున్నారు. జిల్లాలో పేదలకు ఇవ్వాలని పలు దశల్లో 6,886 రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేసింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 5.04 లక్షలు, పట్టణాల్లో రూ.5.30 లక్షల చొప్పున కేటాయించారు. ఇప్పటికీ 3,402 నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటికి రూ. 209 కోట్లు ఖర్చు చేశారు. సిరిసిల్ల పట్టణంలో మంగళవారం నాలుగో విడత లబ్ధిదారుల ఎంపిక జరిగింది. దీనిలో పెద్దూరు, రగుడులోని ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న అర్హుల్లో 516 మందిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ఇంకా శాంతినగర్, మండెపల్లిలో 264 నిర్మాణాలు పూర్తయినవి ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో నిర్మాణం పూర్తయిన వాటిలో సింహభాగం పంపిణీ జరిగింది. వేములవాడ నియోజకవర్గంలో వట్టెంల, వేములవాడ పట్టణంలో ఒక విడత పంపిణీ చేశారు. కోనరావుపేట, చందుర్తి, రుద్రంగిలో టెండర్ల దశలోనే ఉన్నాయి. ఇల్లంతకుంటలో నిర్మాణాలు పూర్తయినా లబ్ధిదారుల ఎంపిక కాలేదు.
మౌలిక వసతుల్లో జాప్యం
మౌలిక వసతుల కల్పనలో జాప్యం వల్ల రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ కావడం లేదు. ఇప్పటి వరకు పంపిణీ జరిగిన చోట అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, విద్యుత్తు, తాగునీటి వసతులు పూర్తయ్యాయి. చాలా చోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా, ఏదో ఒక సమస్యతో నిలిచిపోయాయి. సిరిసిల్ల పురపాలికకు మంజూరైన ఇళ్లకు పురపాలకశాఖ నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. గ్రామీణ ప్రాంతాల్లోనే సమస్య ఉంది. తంగళ్లపల్లి మండలం జిల్లెలలో 20 ఇళ్లు పూర్తి చేశారు. అంతర్గత రహదారులు, విద్యుత్తు సౌకర్యం, మురుగు కాల్వల నిర్మాణం పూర్తయింది. కానీ ఆ గృహాలకు వెళ్లేందుకు రహదారి లేక లబ్ధిదారుల పరిశీలనకే పరిమితమైంది. ఇదే మండలంలోని రామన్నపల్లిలో మురుగు కాల్వలు లేక పంపిణీ ఆగిపోయింది. చాలా చోట్ల నిర్మాణాలు పూర్తి చేసినవి ఏళ్ల తరబడి పంపిణీకి నోచుకోకపోవడంతో ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుతున్నాయి.
మూడింతల దరఖాస్తులు
ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన మండలాలు, గ్రామాల్లో ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది. ఒక్కోచోట రెండు, మూడింతల దరఖాస్తులు వచ్చాయి. వాటన్నింటిపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు దఫాలుగా వడ పోశారు. లాటరీ పద్ధతిలో ఎంపిక చేసిన చోట అర్హులమైన తమకు ఇళ్లు కేటాయించడం లేదంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులపై లబ్ధిదారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో సిరిసిల్ల పట్టణానికి చెందిన 11వ వార్డు కౌన్సిలర్ మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. తమ వార్డుకు కేటాయించిన వాటిలో తక్కువ మందిని ఎంపిక చేశారని ఆరోపించారు. ఇతర కౌన్సిలర్లు సర్దిచెప్పడంతో నిరసన విరమించారు. మరికొన్ని చోట్ల గృహలక్ష్మి పథకంలో అవకాశం కల్పిస్తామని అర్హులకు నచ్చజెప్పుతున్నారు. నిర్మాణాలు పూర్తయిన ఇళ్ల పంపిణీపై అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ను సంప్రదించగా గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాల్లో పరిశీలన జరుగుతుందన్నారు. త్వరలోనే అర్హులైన వారికి పంపిణీ చేస్తామన్నారు.
తంగళ్లపల్లి మండలం జిల్లెలలో నిర్మాణం పూర్తయిన రెండు పడక గదుల ఇళ్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరుట్ల మాజీ ఎమ్మెల్యేకు అస్వస్థత
[ 08-12-2023]
కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అస్వస్థతకు గురయ్యారు. -
ఇద్దరికి అమాత్యయోగం
[ 08-12-2023]
అందరూ అనుకున్నట్లే.. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలిద్దరికి మంత్రి పదవులు లభించాయి. మంథని శాసనసభ్యుడిగా గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు హుస్నాబాద్లో విజేతగా నిలిచిన పొన్నం ప్రభాకర్లు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. -
6 గ్యారంటీలపై ఆశల ఊసులు
[ 08-12-2023]
కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వేళ.. ఉమ్మడి జిల్లా వాసులకు ఆరు గ్యారంటీల అమలుపై ఆశలు పెరుగుతున్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలి సంతకం చేయడంతోపాటు ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజున గురువారం రాష్ట్రమంత్రి వర్గం భేటీలో ఈ నిర్ణయాలపై చర్చించడంతో యంత్రాంగం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అధ్వాన దారులు... తప్పని అవస్థలు!
[ 08-12-2023]
-
పల్లెల్లో మద్యం జోరు
[ 08-12-2023]
పల్లెల్లో మళ్లీ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. నెల రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో మద్యం అమ్మకాలు నిషేధించారు. కోడ్ ఎత్తేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఒక్కో గ్రామంలో 3 నుంచి 8 వరకు మద్యం గొలుసు దుకాణాల ఏర్పాటుతో పలువురు బానిసలుగా మారుతున్నారు. -
మహిళలు సామాజికంగా ఎదగాలి
[ 08-12-2023]
మార్వాడి మహిళలు సామాజికంగా, సాంస్కృతికం ఎదిగి సమాజంలో భాగస్వాములు కావాలని అఖిల భారత మార్వాడి మహిళా మండలి అధ్యక్షురాలు నీరాజీ బత్వాల్ అన్నారు. దక్షిణ భారత మార్వాడి మహిళా మండలిని విస్తృత పరిచేందుకు, సంఘాలను బలోపేతం చేసేందుకు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం సాయంత్రం కరీంనగర్ మార్వాడి మందిర్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
పనుల్లో జాప్యం.. పెరగాలి వేగం
[ 08-12-2023]
అయిదేళ్లకు ఒకసారి జరిగే శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రెండు నెలలుగా అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ మూడు రోజుల కిందట ముగిసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు ఎప్పటిలాగే యథావిధిగా కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. -
క్రీడా స్ఫూర్తి చాటాలి
[ 08-12-2023]
క్రీడలతో విద్యార్థుల్లో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని డీఈవో మాధవి అన్నారు. పెద్దపల్లి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రామగుండం లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ సౌజన్యంతో ఎల్కలపల్లిగేటు కాలనీలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గురువారం ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. -
యువ కార్మికులే నిర్ణయాత్మకం
[ 08-12-2023]
సింగరేణి ఎన్నికల్లో ఈసారి యువ కార్మికులే కీలకం కానున్నారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత ఓట్లు ప్రాధాన్యత చాటుకోనున్నాయి. సింగరేణి ఎన్నికల్లో మొత్తం 39,832 మంది కార్మికులున్నారు. ఇందులో 16 వేల మంది వరకు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత ఉన్నారు. -
ఎన్నికల సిబ్బందికి అభినందన
[ 08-12-2023]
ఎలాంటి వివాదం తలెత్తకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారని జిల్లా కలెక్టర్ ముజామిల్ఖాన్ అన్నారు. ఎన్టీపీసీలో గురువారం సాయంత్రం రామగుండం ఎన్నికల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. -
ఖని ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి
[ 08-12-2023]
గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహిళ కడుపులో శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతిచెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళ బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జాతీయ స్థాయి క్రీడాకారిణికి సన్మానం
[ 08-12-2023]
ఇటీవల గోవాలో జరిగిన జాతీయ స్థాయి మహిళా కాంపౌండ్ అర్చరీ క్రీడల్లో ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు చెందిన తానిపర్తి చికిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, బంగారు పతకం సాధించింది. -
ధాన్యం సేకరణపై తుపాను ప్రభావం
[ 08-12-2023]
తుపాను ప్రభావం జిల్లాలో ధాన్యం సేకరణపై పడింది. గత రెండు రోజులుగా చినుకులు పడుతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. విక్రయానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం అకాల వర్షంతో తడిసిపోతాయని అన్నదాతలు టార్పాలిన్ కవర్లు కప్పారు. -
ఎన్నికల్లో మద్యం కిక్కు!
[ 08-12-2023]
శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో మద్యం ఏరులై పారింది. మద్యం ప్రియులకు కిక్కు ఇవ్వగా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకు రూ. వంద కోట్లకు పైగా విక్రయాలు సాగాయి. -
కొత్త వారు రాక.. ఉన్నవాళ్లు చదవలేక
[ 08-12-2023]
సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించి మూడేళ్లవుతుంది. దీనిలో టెక్స్టైల్ టెక్నాలజీలో రెండేళ్లుగా ఒక్కరూ ప్రవేశాలు పొందలేదు. తొలి ఏడాది ఎంసెట్, ఈసెట్ ద్వారా వచ్చిన 14 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ కోర్సుకు రెండేళ్లుగా అగ్రహారం పాలిటెక్నిక్ డిప్లొమా, ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తున్నారు. -
రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ
[ 08-12-2023]
ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం గురువారం ఉదయం గీతా కార్మికులు ఎల్లమ్మ ఆలయం వద్దకు వెళ్లేసరికి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా.. -
‘ఈనాడు’ ఆటో ఎక్స్పో వాయిదా
[ 08-12-2023]
ఈ నెల 9, 10 తేదీల్లో కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించాల్సిన ‘ఈనాడు’


తాజా వార్తలు (Latest News)
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్
-
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
TSRTC: పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
-
Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్ వీసా డిపాజిట్ రెట్టింపు!