అమ్మను వదిలించుకున్నారు
నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిని వదిలించుకున్నారు. వృద్ధాప్యంలో ఆలనా పాలన చూసుకోవాల్సిన వారు ఓ చెట్టు కింద వదిలేసి మానవత్వాన్ని మంట గలిపారు.
అచేతనంగా పడి ఉన్న వృద్ధురాలు
వేములవాడ, న్యూస్టుడే: నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిని వదిలించుకున్నారు. వృద్ధాప్యంలో ఆలనా పాలన చూసుకోవాల్సిన వారు ఓ చెట్టు కింద వదిలేసి మానవత్వాన్ని మంట గలిపారు. అచేతనంగా ఉండి చీకట్లో మగ్గుతూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ దిక్కులు చూస్తున్న ఆ వృద్ధురాలిని చూసిన వారి గుండెలు కలిచివేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... వేములవాడ మున్సిపల్ పరిధిలో నందికమాన్ ప్రాంతంలోని ఓ చెట్టు వద్ద దాదాపు 80 ఏళ్లు పైబడిన ఓ వృద్ధురాలిని నాలుగు రోజుల క్రితం వదిలి వెళ్లారు. అచేతనంగా ఉన్న ఆమెను చూసిన పక్కనున్న ఇటుకల తయారీ కార్మికులు రొట్టెలు, నీళ్లు, అరటి పండ్లు అందజేశారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వదిలి వెళ్లారనే విషయాన్ని ఆమె స్పష్టంగా చెప్పలేకపోతుంది. ఓ సారి నాంపల్లి గ్రామమని, మరోసారి తిమ్మాపూర్, ఇంకోసారి నర్సింగాపూర్ గ్రామమని, తన పేరు బూదవ్వ అంటూ పొంతన లేని మాటలు చెప్పడంతో చిరునామా తెలుసుకోవడం కష్టంగా మారింది. తనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారని తెలిపింది. ఈ విషయం తెలుసుకొన్న పట్టణ సీఐ కరుణాకర్ గురువారం రాత్రి ఆమె వద్దకు వెళ్లి వివరాలు ఆరా తీశారు. సఖి కేంద్రం అధికారులు ఆమెను వృద్ధుల సంరక్షణ కేంద్రానికి తరలించారని, సరైన వివరాలు చెప్పడం లేదని సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరుట్ల మాజీ ఎమ్మెల్యేకు అస్వస్థత
[ 08-12-2023]
కోరుట్ల మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అస్వస్థతకు గురయ్యారు. -
ఇద్దరికి అమాత్యయోగం
[ 08-12-2023]
అందరూ అనుకున్నట్లే.. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలిద్దరికి మంత్రి పదవులు లభించాయి. మంథని శాసనసభ్యుడిగా గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు హుస్నాబాద్లో విజేతగా నిలిచిన పొన్నం ప్రభాకర్లు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. -
6 గ్యారంటీలపై ఆశల ఊసులు
[ 08-12-2023]
కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వేళ.. ఉమ్మడి జిల్లా వాసులకు ఆరు గ్యారంటీల అమలుపై ఆశలు పెరుగుతున్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తొలి సంతకం చేయడంతోపాటు ప్రభుత్వం ఏర్పాటైన తొలిరోజున గురువారం రాష్ట్రమంత్రి వర్గం భేటీలో ఈ నిర్ణయాలపై చర్చించడంతో యంత్రాంగం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. -
ప్రమాణ శ్రీకారం
[ 08-12-2023]
త్రివర్ణ పతాకాల రెపరెపలు.. జై కాంగ్రెస్... జై సోనియమ్మ .. జై రేవంతన్నా.. నినాదాలతో గురువారం ఎల్బీ స్టేడియం పరిసరాలు హోరెత్తాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు... ఎటు చూసినా పార్టీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో బషీర్బాగ్ పరిసరాలు గురువారం సందడిగా మారాయి. -
అధ్వాన దారులు... తప్పని అవస్థలు!
[ 08-12-2023]
-
పల్లెల్లో మద్యం జోరు
[ 08-12-2023]
పల్లెల్లో మళ్లీ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. నెల రోజులుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో మద్యం అమ్మకాలు నిషేధించారు. కోడ్ ఎత్తేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఒక్కో గ్రామంలో 3 నుంచి 8 వరకు మద్యం గొలుసు దుకాణాల ఏర్పాటుతో పలువురు బానిసలుగా మారుతున్నారు. -
మహిళలు సామాజికంగా ఎదగాలి
[ 08-12-2023]
మార్వాడి మహిళలు సామాజికంగా, సాంస్కృతికం ఎదిగి సమాజంలో భాగస్వాములు కావాలని అఖిల భారత మార్వాడి మహిళా మండలి అధ్యక్షురాలు నీరాజీ బత్వాల్ అన్నారు. దక్షిణ భారత మార్వాడి మహిళా మండలిని విస్తృత పరిచేందుకు, సంఘాలను బలోపేతం చేసేందుకు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం సాయంత్రం కరీంనగర్ మార్వాడి మందిర్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. -
పనుల్లో జాప్యం.. పెరగాలి వేగం
[ 08-12-2023]
అయిదేళ్లకు ఒకసారి జరిగే శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రెండు నెలలుగా అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ మూడు రోజుల కిందట ముగిసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, అధికారులు ఎప్పటిలాగే యథావిధిగా కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. -
క్రీడా స్ఫూర్తి చాటాలి
[ 08-12-2023]
క్రీడలతో విద్యార్థుల్లో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని డీఈవో మాధవి అన్నారు. పెద్దపల్లి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రామగుండం లయన్స్ క్లబ్ ఆఫ్ మగువ సౌజన్యంతో ఎల్కలపల్లిగేటు కాలనీలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గురువారం ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. -
యువ కార్మికులే నిర్ణయాత్మకం
[ 08-12-2023]
సింగరేణి ఎన్నికల్లో ఈసారి యువ కార్మికులే కీలకం కానున్నారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత ఓట్లు ప్రాధాన్యత చాటుకోనున్నాయి. సింగరేణి ఎన్నికల్లో మొత్తం 39,832 మంది కార్మికులున్నారు. ఇందులో 16 వేల మంది వరకు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత ఉన్నారు. -
ఎన్నికల సిబ్బందికి అభినందన
[ 08-12-2023]
ఎలాంటి వివాదం తలెత్తకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారని జిల్లా కలెక్టర్ ముజామిల్ఖాన్ అన్నారు. ఎన్టీపీసీలో గురువారం సాయంత్రం రామగుండం ఎన్నికల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. -
ఖని ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి
[ 08-12-2023]
గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన మహిళ కడుపులో శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతిచెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళ బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జాతీయ స్థాయి క్రీడాకారిణికి సన్మానం
[ 08-12-2023]
ఇటీవల గోవాలో జరిగిన జాతీయ స్థాయి మహిళా కాంపౌండ్ అర్చరీ క్రీడల్లో ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు చెందిన తానిపర్తి చికిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, బంగారు పతకం సాధించింది. -
ధాన్యం సేకరణపై తుపాను ప్రభావం
[ 08-12-2023]
తుపాను ప్రభావం జిల్లాలో ధాన్యం సేకరణపై పడింది. గత రెండు రోజులుగా చినుకులు పడుతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. విక్రయానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం అకాల వర్షంతో తడిసిపోతాయని అన్నదాతలు టార్పాలిన్ కవర్లు కప్పారు. -
ఎన్నికల్లో మద్యం కిక్కు!
[ 08-12-2023]
శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో మద్యం ఏరులై పారింది. మద్యం ప్రియులకు కిక్కు ఇవ్వగా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకు రూ. వంద కోట్లకు పైగా విక్రయాలు సాగాయి. -
కొత్త వారు రాక.. ఉన్నవాళ్లు చదవలేక
[ 08-12-2023]
సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించి మూడేళ్లవుతుంది. దీనిలో టెక్స్టైల్ టెక్నాలజీలో రెండేళ్లుగా ఒక్కరూ ప్రవేశాలు పొందలేదు. తొలి ఏడాది ఎంసెట్, ఈసెట్ ద్వారా వచ్చిన 14 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ కోర్సుకు రెండేళ్లుగా అగ్రహారం పాలిటెక్నిక్ డిప్లొమా, ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తున్నారు. -
రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ
[ 08-12-2023]
ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం గురువారం ఉదయం గీతా కార్మికులు ఎల్లమ్మ ఆలయం వద్దకు వెళ్లేసరికి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా.. -
‘ఈనాడు’ ఆటో ఎక్స్పో వాయిదా
[ 08-12-2023]
ఈ నెల 9, 10 తేదీల్లో కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించాల్సిన ‘ఈనాడు’


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: అంతకుమించిన తృప్తి ఏముంటుంది!: సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
-
UPI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆటో డెబిట్, ఆ యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు
-
Fake Toll Plaza: రోడ్డు వేసి.. నకిలీ టోల్ ప్లాజా కట్టి.. ₹కోట్లు కొట్టేసి: గుజరాత్లో ఘరానా మోసం
-
Flipkart: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
-
ChandraBabu: ప్రతిపక్షాల ఓట్లను అధికార పార్టీ తొలగిస్తోంది: ఈసీకి చంద్రబాబు లేఖ
-
Revanth Reddy: దిల్లీ వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి