Omicron: ఆ నలుగురూ.. ఏమయ్యారు?
ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి బెంగళూరుకు వచ్చి.. కనిపించకుండా పోయిన పది మందిలో ఆరుగురి వివరాలు అందుబాటులోకి రావడంతో అధికారులు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. మరో నలుగురి జాడ కోసం వేట కొనసాగిస్తున్నారు. పోలీసులు- బెంగళూరు పాలికె అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి బెంగళూరుకు వచ్చి.. కనిపించకుండా పోయిన పది మందిలో ఆరుగురి వివరాలు అందుబాటులోకి రావడంతో అధికారులు ఒకింత ఊపిరి పీల్చుకున్నారు. మరో నలుగురి జాడ కోసం వేట కొనసాగిస్తున్నారు. పోలీసులు- బెంగళూరు పాలికె అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ నలుగురూ చరవాణిలు పని చేయకుండా ఆపేశారని తేలింది. అందులో ముగ్గురి వివరాలు త్వరలోనే తెలిసిపోతాయని భావిస్తున్నారు. ఆ దిశగా సాంకేతిక శోధన సాగుతోంది. పరారీలో ఉన్న వ్యక్తులు ఎంత మందికి ఒమిక్రాన్ వైరస్ను సోకేలా చేస్తారోనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2019 మార్చిలో కరోనా వైరస్ నగరంలో గుర్తించిన సమయంలోనూ ఇలాంటి ‘పరారీ’ ఘటనలు వెలుగు చూడటం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన 20 మంది వివరాలు అప్పట్లో లభించక కలకలం రేగింది. వారి కారణంగానే కరోనా వైరస్ వేగంగా వ్యాపించింది. గతం నుంచి పాలికె అధికారులు పాఠాలు నేర్చుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒమిక్రాన్ వైరస్ నగరంలో ఉనికిచాటి మూడు రోజులు గడిచినా నియంత్రణకు పాలికె అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టిన దాఖలాలు లేవు. ఆ వివరాలన్నీ కాగితాలు, సభల్లో చర్చకే పరిమతమవుతున్నాయి. నగరంలో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించిన వెంటనే జేపీనగర, కోణనకుంటె, కోరమంగల, హెచ్ఎస్ఆర్లేఔట్లో ఆరు ఇళ్లను సీల్డౌన్ చేశారు. అందుకు దారితీసిన కారణాలు, వాస్తవాలను బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
* దక్షిణాఫ్రికా నుంచి నగరానికి వచ్చిన కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి దుబాయికి వెళ్లేందుకు వసంతనగరలో ఉన్న పంచతారా హోటల్ సిబ్బంది సహకారం ఉందని అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తి (66) రాత్రికి రాత్రి హోటల్ నుంచి బయటపడి విమానంలో దుబాయి చేరుకున్నాడు. పాలికె అధికారులు స్పందించి ఆ హోటల్కు నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఆ వ్యక్తిని కరోనా సోకిందని, ఒమిక్రాన్ పరీక్షలు నిర్వహించడానికి అనువుగా ఆహోటల్ సిబ్బందిని అప్రమత్తం చేసి- ప్రత్యేక గదిలో క్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడమేగాక.. విదేశాలకు వెళ్లిపోవడానికి ‘ఎవరి సహకారం’ ఉందో గుర్తించే పని మొదలైందని పాలికె ప్రధాన వైద్యాధికారి డాక్టర్ బాలసుందర్ తెలిపారు. పరారైన వ్యక్తి కనీసం 24 మందికి వైరస్ సోకేలా చేశాడనే ఆందోళన వ్యక్తం చేశారు. గతనెల 25న బొమ్మసంద్రలో జరిగిన సమావేశంలో ఆయనతో కలిసి పాల్గొన్న ఆరుగురు వ్యక్తులకు కరోనా పరీక్షలు చేపట్టారు. నెగటివ్ రావడంతో ఊపిరిపిల్చుకున్నారు. దక్షిణాఫ్రికా వ్యక్తిని విమానాశ్రయం వద్దకు విడిచిపెట్టిన కారు డ్రైవర్కూ వైద్య పరీక్షలు చేశారు.
ఆస్పత్రుల్లో పడకలు సిద్ధం
* నగరంలో ఒమిక్రాన్ వైరస్ సోకిన వ్యక్తులకు చికిత్స అందించేందుకు శివాజీనగర బౌరింగ్ ఆసుపత్రిలో 60, రాజీవ్గాంధీ ఆసుపత్రిలో 200, విక్టోరియాలో 60 పడకలను సిద్ధం చేశారు. వాటితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫీవర్ క్లినిక్లను ప్రారంభిస్తారు. ఆక్సిజన్ ఉత్పిత్తి కేంద్రాలను సిద్ధం చేశారు.
* ఒమిక్రాన్ వైరస్ నియంత్రణకు కఠిన నిబంధనలు విధించాలని కొవిడ్ సాంకేతిక నిపుణుల సమితి సిఫార్సు చేసింది. సినీ థియేటర్లు, మాల్స్, మార్కెట్లు, కల్యాణ మంటపాలు, దేవస్థానాలు, ప్రార్థన మందిరాల్లో ఎక్కువ చేరకుండా నియంత్రించాలని సూచించింది. విద్యాసంస్థల్లో సాంస్కృతిక కార్యక్రమాలను జనవరి 15 వరకు నిషేధించారు. అందరూ మాస్క్ ధరించేలా నిబంధనలు విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..
[ 18-04-2024]
బెంగళూరు నగర శివారు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై వీడియో చిత్రీకరించి, యూట్యూబ్లో అప్లోడ్ చేసిన యూట్యూబర్ వికాస్ గౌడను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. -
భార్య హంతకుడికి ఐదేళ్ల కారాగారం
[ 18-04-2024]
సారాయి తాగవద్దని అడ్డుకుంటున్న నసీమా (23) అనే గృహిణిని 2021 అక్టోబరు 19న బ్లేడుతో గొంతు కోసి హత్య చేసిన ఆమె భర్త ఇబ్రహీం సయ్యద్ హబీబ్ (25)కు కలబురగిలోని ఒకటో అదనపు జిల్లా న్యాయస్థానం.. -
భాజపాతో పోటీ.. హామీలు గ్యారంటీ
[ 18-04-2024]
కర్ణాటకలో గ్యారంటీలను సజావుగా అమలు చేశామన్న ధీమాతో కాంగ్రెస్ దేశప్రజలకు అదే స్థాయి హామీలిచ్చింది. ఇప్పటికే 25 గ్యారంటీలతో ఎన్నికల ప్రణాళిక ప్రకటించిన కాంగ్రెస్ వాటిపై రాష్ట్ర ప్రచారంలో మరింత వివరణ ఇచ్చింది. -
భాజపాకు గ్యారంటీల భయం.. హస్తానికదే అభయం
[ 18-04-2024]
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్యారంటీలు కొట్టుకుని పోతాయని ప్రచారంలో ముందుకు వెళ్తున్న భాజపాకు ఎక్కడో అదే గ్యారంటీల భయం వెంటాడుతోందని సర్వత్రా చర్చనీయాంశమైంది. -
విద్యానగరిలో స్వతంత్రుడి సెగ?
[ 18-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలో అనుభవం కలిగిన నాయకుడు ప్రహ్లాద్ జోసి- యువనేత వినోద్ అసూటి మధ్య మధ్య పోటీ రసవత్తరంగా మారింది. -
పంచభూతాల్లో లీనమైన ద్వారకీశ్
[ 18-04-2024]
గుండెపోటుతో మంగళవారం ఉదయం మరణించిన సీనియరు నటుడు, దర్శకుడు, నిర్మాత- ద్వారకీశ్ భౌతికకాయానికి చామరాజపేట టీఆర్ మిల్ ఆవరణలో బుధవారం మధ్యాహ్నం పోలీసు గౌరవ లాంఛనాలతో- కుటుంబ సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహించారు. -
డీకేపై గౌడ తీవ్ర ఆరోపణ
[ 18-04-2024]
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆస్తి కోసం ఒక తొమ్మిదేళ్ల బాలికను అపహరించారని మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ మంగళవారం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. -
కరడికి చేయందించిన కాంగ్రెస్
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాజపా టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై, మంగళవారం లోక్సభ సభ్యత్వానికి- భారతీయ జనతాపార్టీకీ రాజీనామా చేసిన కొప్పళ ఎంపీ కరడి సంగణ్ణ బుధవారం బెంగళూరులో కాంగ్రెస్లో చేరారు. -
మోదీ సభకు సకల సన్నాహాలు
[ 18-04-2024]
బెంగళూరు ప్యాలెస్ మైదానంలో శనివారం సాయంత్రం నిర్వహించే బహిరంగలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజె వెల్లడించారు. -
భాజపాను బలపరుద్దాం
[ 18-04-2024]
మాదిగ సముదాయ ప్రజలందరం భాజపాను బలపరుద్దామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. చెళ్లకెర వాసవీ కల్యాణ మంటపంలో బుధవారం జరిగిన మాదిగ సముదాయ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మంత్రి మల్లికార్జున ప్రచారం
[ 18-04-2024]
బోవి గురుపీఠాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి ఎస్ఎస్ మల్లికార్జున వివిధ పీఠాధిపతులను కలిసి లోక్సభ ఎన్నికల్లో దావణగెరె కాంగ్రెస్ అభ్యర్థి డా.ప్రభ మల్లికార్జునకు మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
భాజపా రామాలయం నిర్మిస్తే.. మేం రామరాజ్యమే తెస్తాం
[ 18-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామరాజ్యమే నిర్మిస్తామని బళ్లారి జిల్లా మంత్రి బి.నాగేంద్ర స్పష్టం చేశారు. జూన్ 4న కేంద్రంలో భాజపా ప్రభుత్వం పతనమవుతుంది. -
ఫోన్ ట్యాపింగ్ చేయలేదు కుమారస్వామి స్పష్టీకరణ
[ 18-04-2024]
తాను ఫోన్ ట్యాపింగ్కు పాల్పడి ఉంటే సంకీర్ణ ప్రభుత్వం పతనమయ్యేది కాదని మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM