దళపతుల మద్దతే కీలకం
విధానపరిషత్ బరిలో నువ్వా నేనా అన్నట్లుగా రెండు ప్రధాన పార్టీల మధ్య పోరు హోరెత్తుతోంది. వీటి రెండింటి నడుమ తానేమీ తక్కువ కాదన్నట్లుగా జనతాదళ్ విమర్శల స్వరాన్ని పెంచింది. మొన్నటి వరకు సాధారణ విమర్శలతో కొనసాగిన ప్రచారం.. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరింది.
దావణగెరె సభలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప
బెంగళూరు (ఎలక్ట్రానిక్ సిటీ), న్యూస్టుడే : విధానపరిషత్ బరిలో నువ్వా నేనా అన్నట్లుగా రెండు ప్రధాన పార్టీల మధ్య పోరు హోరెత్తుతోంది. వీటి రెండింటి నడుమ తానేమీ తక్కువ కాదన్నట్లుగా జనతాదళ్ విమర్శల స్వరాన్ని పెంచింది. మొన్నటి వరకు సాధారణ విమర్శలతో కొనసాగిన ప్రచారం.. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరింది. ఈనెల 10న జరిగే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడం ద్వారా ప్రజాబలం ఏమాత్రం సన్నగిల్లలేదని చాటిచెప్పాలని అధికార భారతీయ జనతాపార్టీ తపిస్తుండగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన ఈ ఎన్నికల్లో గెలుపొందితే అధికార పార్టీ దూకుడును కట్టడి చేయాలని విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. ఆరు స్థానాలకే పోటీకి పరిమితమైన జనతాదళ్ పార్టీ నాయకుల ప్రతీ కదలికా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉంటున్నాయని పరిశీలకుల మదింపు. దళ్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, భాజపా తమ వంతు ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నాయి. కోలారులో మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్ను భాజపా ఆకర్షించగా, సినీ నిర్మాత, ఎమ్మెల్సీ మనోహర్ను, ఆ పార్టీ శాసనసభ్యుడిని కాంగ్రెస్ తనవైపు లాక్కుంది. ఇతర నియోజకవర్గాల్లో ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది.
* తమ ప్రతీ అడుగూ ఆచితూచి వేస్తామని చెబుతూనే పార్టీ లక్ష్యం 2023లో రానున్న అసెంబ్లీ ఎన్నికలేనని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. తాము పోటీచేస్తున్న ఆరు స్థానాల్లో మినహా మిగిలిన చోట్ల ఏ పార్టీకి మద్దతునిచ్చేదీ మరో రెండు రోజుల్లో ప్రకటించనున్నట్లు ఆయన చేసిన ప్రకటన తీవ్ర కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. పాతమైసూరు ప్రాంతంలో తమ పట్టును నిలుపుకొంటూనే మిగిలిన ప్రాంతాల్లో తమ మద్దతును ఎంపిక చేసే పార్టీకి ప్రకటిస్తామని వెల్లడించారు.
తుమకూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సిద్ధరామయ్య
ఈ విషయాన్ని వెల్లడిస్తూనే ఆయన తమ చిరకాల ప్రత్యర్థి సిద్ధరామయ్యపై విమర్శల్ని గుప్పించడాన్ని విస్మరించలేదు. దళ్ను కుటుంబ పార్టీగా అభివర్ణించే మీరు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. మీ కుటుంబంలోనూ ఎక్కువ మందే ఉన్నారు కదా అని నిలదీశారు. ప్రత్యర్థిని వేలెత్తిచూపితే మిగిలిన నాలుగు వేళ్లూ మీ వైపే చూపుతాయనే విషయాన్ని విస్మరించినట్లున్నారని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాల్ని సంధించారు. కుటుంబ పాలన అంటూ నిత్యం విమర్శలతో నోరు నొప్పించుకునే బదులు ఓ పలకపై ఆ విషయాన్ని రాసి మెడకు వేలాడదీసుకోవాలని సలహా ఇచ్చారు. వ్యక్తిగత విమర్శల ద్వారా అనుకున్న లక్ష్యం నెరవేరదనే వాస్తవాన్ని గుర్తించాలని సూచించారు.
* భాజపా అనుబంధపార్టీ దళ్.. అంటూ సిద్ధరామయ్య చేసిన విమర్శల్ని మాజీ ముఖ్యమంత్రి యూడియూరప్ప తీవ్రంగా ఖండించారు. ఆయన తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి ఆరోపణలు నైతికంగా మనిషిని దిగజార్చేవిగా ఉంటాయనే వాస్తవాన్ని గుర్తించాలన్నారు. ఏకవచనంతో విమర్శలు మంచిదికాదని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు. రెండు పార్టీలూ ప్రజల్ని మోసగిస్తున్నాయని భాజపా, దళ్పై నిప్పులు చెరుగుతున్నారు. అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. ఒకవైపు మాజీ ప్రధాని దేవేెగౌడ వైఖరి చూస్తుంటే తిరిగి భాజపా పంచన చేరుతున్నట్లుగా అనిపిస్తోందని అయితే కొన్ని నియోజవర్గాల్లో దళ్ నాయకులు కాంగ్రెస్కు మద్దతునిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. చిక్కమగళూరులో దళపతులు కాంగ్రెస్కు మద్దతునిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
మైసూరు సభలో దళపతి కుమారస్వామి తదితరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు