logo

Suicide: భర్తతో వేరుపడి.. ప్రియుడితో జీవించాలనుకొని..

ఆమె గర్భిణి. కుటుంబ కలహాల కారణంగా భర్తతో వేరుపడి పుట్టింటికి చేరింది. అక్కడ ఓ వ్యక్తి పరిచయం కావడంతో కలిసి జీవించాలని ఇద్దరూ నిర్ణయించారు. అందులో భాగంగా ఆదివారం ఒక ప్రాంతంలో కలుసుకోవాలని నిర్ణయించారు. అప్పటికే ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్లుం

Updated : 14 Dec 2021 08:52 IST

రామనగర, న్యూస్‌టుడే : ఆమె గర్భిణి. కుటుంబ కలహాల కారణంగా భర్తతో వేరుపడి పుట్టింటికి చేరింది. అక్కడ ఓ వ్యక్తి పరిచయం కావడంతో కలిసి జీవించాలని ఇద్దరూ నిర్ణయించారు. అందులో భాగంగా ఆదివారం ఒక ప్రాంతంలో కలుసుకోవాలని నిర్ణయించారు. అప్పటికే ఆమె ఓ నిర్ణయానికి వచ్చినట్లుంది. ప్రియుడు రాగానే ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేక అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రామనగర జిల్లా మాగడి సమీపంలో ఆదివారం చోటుచేసుకున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. మృతులను బ్యాలకెరె నివాసి మోహన్‌ (24), దాసేగౌడనపాళ్యకు చెందిన పుష్పలత (24)గా గుర్తించారు. పుష్పలతకు గతంలో వివాహమై ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆమె గర్భణి బ్యాలహళ్లికి చెందిన మోహన్‌కూ వివాహమైంది. వారం కిందటే పుష్పలత భర్తతో ఘర్షణపడి బ్యాలకెరెకు వచ్చింది. ఆ సమయంలోనే ఇద్దరికీ పరిచయమై ప్రేమకు దారితీసింది. సహజీవనం చేయాలని నిర్ణయించారు. భర్తతో వేరుపడిన తనకు త్వరలోనే ప్రసవమైతే పుట్టే బిడ్డ తన తండ్రి ఎవరని అడిగితే ఏమని సమాధానమివ్వాలనే అంశమై ఆమె అంతర్మథనానికి గురైందని పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఆమె మరణంతో చలించిన మోహన్‌ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. రామనగర గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని