భర్త భారమై.. ప్రియుడూ దూరమై..
జీవితాంతం తోడుగా ఉంటానంటూ తాళికట్టిన భర్త.. నాలుగేళ్లకే చేదుగా మారాడు. పక్కింటి యువకుడితో ప్రేమాయణం కొనసాగించి చివరకు భర్తకు దూరమై ప్రియుడిని వివాహం చేసుకుంది. ఇద్దరివీ వేర్వేరు కులాలనే నెపంతో ఆ యువకుడి తల్లిదండ్రులు ఆమెను చేరదీసేందుకు నిరాకరించారు. ఫలితంగా..
బెళగావి, న్యూస్టుడే : జీవితాంతం తోడుగా ఉంటానంటూ తాళికట్టిన భర్త.. నాలుగేళ్లకే చేదుగా మారాడు. పక్కింటి యువకుడితో ప్రేమాయణం కొనసాగించి చివరకు భర్తకు దూరమై ప్రియుడిని వివాహం చేసుకుంది. ఇద్దరివీ వేర్వేరు కులాలనే నెపంతో ఆ యువకుడి తల్లిదండ్రులు ఆమెను చేరదీసేందుకు నిరాకరించారు. ఫలితంగా.. తనకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తానంటూ ప్రియుడి నివాసం ఎదుట నిరాహార దీక్షకు దిగింది. పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆమెను మహిళా సాంత్వన కేంద్రానికి తరలించారు. ఈ సంఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా బైలహొంగలలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. బైలహొంగల పట్టణానికి చెందిన మహిళ (27)కు నాలుగు సంవత్సరాల కిందట గోకాక్ ఆలూకా అరభావి గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది. కొంత కాలంగా ఆమెకు పక్కింటి మౌనేశ్ బడిగేర అనే యువకుడితో పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారింది. ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. భర్త లేనప్పుడు ప్రియుడితో కలిసి ఉండేది. ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త మందలించాడు కూడా. ఆమె వైఖరిలో మార్పురాలేదు. ఈనేపథ్యంలో పెద్దలతో పంచాయతీ పెట్టించి ఆమెను మందలించేలా చేశాడు. ప్రియుడే సర్వస్వమనుకున్న ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. ప్రియుడితో కలిసి ఓ రోజున ఆలయంలో వివాహం చేసుకుంది. ఇంటికి ఆమెను తీసుకొచ్చేందుకు మౌనేశ్ కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఈ నేపథ్యంలో మౌనేశ్ తల్లిదండ్రుల సూచనతో కొన్ని రోజులుగా అదృశ్యమయ్యాడు. తనను ఒంటరిదాన్ని చేశావంటూ సోమవారం నుంచి ఆమె గోకాక్లోని మౌనేశ్ నివాసం ఎదుట నిరాహార దీక్షకు దిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను గోకాక్లోని మహిళా సాంత్వన కేంద్రానికి ఇతరలించారు. మౌనేశ్ వచ్చిన తరువాత న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే