Elephant: బెడిసికొట్టిన ఏనుగు అపహరణ యత్నం!
వక్కలు.. నగలు.. చిల్లర దొంగల గురించి వింటున్నాం.. చూస్తున్నాం. ఏకంగా ఏనుగునే అపహరించాలని చూసిన ఘరానా దొంగల విషయం ఇప్పుడు వెలుగుచూసింది! ఇటీవల తుమకూరులో జరిగిన...
తుమకూరు (బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ), న్యూస్టుడే: వక్కలు.. నగలు.. చిల్లర దొంగల గురించి వింటున్నాం.. చూస్తున్నాం. ఏకంగా ఏనుగునే అపహరించాలని చూసిన ఘరానా దొంగల విషయం ఇప్పుడు వెలుగుచూసింది! ఇటీవల తుమకూరులో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరకు సుఖాంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. తుమకూరులోని కరిబసవస్వామి మఠానికి చెందిన లక్ష్మి అనే ఏనుగును అపహరించేందుకు చేసిన యత్నం బెడిసి కొట్టింది. ఈ దొంగలకు సాక్షాత్తూ అటవీ శాఖలోని కొందరు అధికారులు సహకరించడం గమనార్హం. ఈ సంఘటన వివరాల్లోకెళ్తే..... చిన్న పిల్లాడిని సైతం ఆత్మీయంగానే చూసే లక్ష్మిని ఎలాగైనా అపహరించాలని గుజరాత్కు చెందిన ఓ సర్కస్ కంపెనీ నిర్వాహకులు వ్యూహాన్ని రూపొందించారు. గత నెలలో పశువైద్యుల పేరుతో కొందరు మఠాన్ని సందర్శించారు. ఏనుగుకు వైద్యపరీక్షలు నిర్వహించి దాని కడుపులో గడ్డ ఉందని, తొలగించకపోతే ప్రాణాలకే ముప్పని మఠం వర్గాల్ని బెదిరించారు. దీంతో మఠం ప్రతినిధులు ఏనుగును బన్నేరుఘట్టలోని పశువైద్య కేంద్రానికి తరలించేందుకు అంగీకరించారు. కొద్ది రోజుల తరువాత ఆ ముఠా సభ్యులు తిరిగి మఠానికి వచ్చి లారీలో ఏనుగును తీసుకెళ్లారు. బన్నేరుఘట్టకు కాకుండా దాబస్పేట రాగానే మావటీని, ఇతర సహాయకులపై దాడిచేసి వారిని లారీ నుంచి దించేశారు. అనంతరం లారీని నేరుగా కుణిగల్ తాలూకాని ఓ గ్రామంలో ఎవరికీ తెలియకుండా దాచి ఉంచారు. విషయం తెలుసుకున్న మఠం వర్గాలు కుణిగల్ తాలూకాలో గాలించి చివరకు ఏనుగును గుర్తించి మరో లారీలో దాన్ని మఠానికి తీసుకొచ్చారు. ఏనుగును అపహరించేందుకు రూ.40 లక్షలకు బేరమాడారని ప్రాథమిక సమాచారం. మఠం వర్గాల ఫిర్యాదు ఆధారంగా తుమకూరు నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖËర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!