logo

రెండు కార్లను ఢీకొన్న లారీ- నలుగురు దుర్మరణం

సంక్రాంతి పండుగ రోజున ఆలయాన్ని సందర్శించి వెనుతిరుగుతుండగా లారీ రూపంలో నలుగురిని మృత్యువు కబళించింది. ఈ దుర్ఘటన శనివారం జిల్లాలోని రట్టిహళ్లి తాలూకా కడూరు సమీపంలో జరిగింది. మృతులను శివమొగ్గ జిల్లా శికారిపుర తాలూకా మత్తికోటి గ్రామానికి చెందిన శంకరగౌడ (35), శాంతమ్మ (32), పునీత్‌ (12)

Published : 17 Jan 2022 04:45 IST


నుజ్జయిన కార్లు

హావేరి, న్యూస్‌టుడే: సంక్రాంతి పండుగ రోజున ఆలయాన్ని సందర్శించి వెనుతిరుగుతుండగా లారీ రూపంలో నలుగురిని మృత్యువు కబళించింది. ఈ దుర్ఘటన శనివారం జిల్లాలోని రట్టిహళ్లి తాలూకా కడూరు సమీపంలో జరిగింది. మృతులను శివమొగ్గ జిల్లా శికారిపుర తాలూకా మత్తికోటి గ్రామానికి చెందిన శంకరగౌడ (35), శాంతమ్మ (32), పునీత్‌ (12), రఘు (14)గా గుర్తించారు. ఈ దుర్ఘటనలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. వీరిని శివమొగ్గ ఆసుపత్రికి తరలించారు. రెండు కార్లలో వీరంతా దావణగెరె జిల్లా ఉక్కడగాత్రి ఆలయాన్ని సందర్శించి వెనుతిరిగే సమయంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. రట్టిహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని