వారాంతపు కర్ఫ్యూ విజయవంతం
వారాంతపు కర్ఫ్యూ విజయవంతమైంది. శని, ఆదివారాల్లో నగరవాసులు స్వచ్ఛందంగా బంద్ వాతావరణాన్ని సృష్టించారు. ఎక్కువ మంది ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. వారాంతపు విహార యాత్రలు, వినోదాలకు స్వస్తి పలికారు. కర్ఫ్యూను పోలీసులు, బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు కట్టుదిట్టంగా
యశ్వంతపుర కూడలిలో ద్విచక్రవాహనదారులను ప్రశ్నిస్తున్న పోలీసులు
బెంగళూరు(యశ్వంతపుర), న్యూస్టుడే: వారాంతపు కర్ఫ్యూ విజయవంతమైంది. శని, ఆదివారాల్లో నగరవాసులు స్వచ్ఛందంగా బంద్ వాతావరణాన్ని సృష్టించారు. ఎక్కువ మంది ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. వారాంతపు విహార యాత్రలు, వినోదాలకు స్వస్తి పలికారు. కర్ఫ్యూను పోలీసులు, బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు కట్టుదిట్టంగా అమలు చేశారు. సంక్రాంతి పండుగను ప్రజలు ఇళ్లకు పరిమితం చేసుకున్నారు. బయట ఎక్కడా సాంస్కృతిక కార్యక్రమాల సందడి కానరాలేదు. దేవస్థానాల్లోకి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడం వల్ల దేవాలయాల వద్ద భక్తుల రద్దీ లేకుండా పోయింది. దుకాణాలను వ్యాపారులు మూసివేశారు. సిటీ మార్కెట్ను బిన్నిమిల్లు మైదానానికి తరలించారు. వీధి వ్యాపారాలకు అనుమతించలేదు. మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఆదివారం మాంసం దుకాణాల్లో జోరుగా వ్యాపారం జరిగింది. కేవలం ఐదు వందల బీఎంటీసీ బస్సులు నడిపినా ప్రయాణికులు తక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అరగంటకు ఓ మెట్రో రైలు నడిచింది. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దూర ప్రాంతాలకు కె.ఎస్.ఆర్టీసీ బస్సులు సంచరించాయి. ఆటోలు పరిమిత సంఖ్యలో ఉండడంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వాహన సంచారం స్తంభించడంతో రహదారులు బోసిపోయాయి. ఉపరితల వంతెనలను మూసివేశారు. వాహనదారులు రాకపోవడంతో పెట్రోలు బంకులు మూతపడ్డాయి. నిత్యం రద్దీగా కనిపించే చిక్కపేట, బాళేపేట, మామూలుపేట, కాటన్పేట, ఎస్పీ రోడ్డు, గాంధీబజారు తదితర వ్యాపార ప్రాంతాల్లో హడావిడి కానరాలేదు. వారాంతపు కర్ఫ్యూకు ప్రజలు సహకరించడం పట్ల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ ధన్యవాదాలు చెప్పారు. మరో రెండువారాలు వారాంతపు కర్ఫ్యూ అమలులో ఉంటుందని, ప్రజలు, వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నిత్యం రద్దీగా ఉండే రేస్కోర్స్ రోడ్డు బోసిపోయింది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. 750 టెంకాయలు కొట్టిన నేతలు
-
భారత్లో మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా