చెన్నపట్టణ బొమ్మలకు సరికొత్త రూపు
కొయ్య బొమ్మల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకునేందుకు చెన్నపట్టణ సిద్ధమవుతోంది. సంప్రదాయాలకు పెద్దపీట వేసే మైసూరు రాజవంశంలో ప్రస్తుత మహారాణి త్రిషికా సింగ్ ఒడెయరు సరికొత్త డిజైన్లను సూచించారు. ఇందులో భాగంగా ముందుగా సఫారీ సెట్ బొమ్మల్ని ప్రతిపాదించారు. వీటి
చెన్నపట్టణ బొమ్మలు
రామనగర, న్యూస్టుడే: కొయ్య బొమ్మల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకునేందుకు చెన్నపట్టణ సిద్ధమవుతోంది. సంప్రదాయాలకు పెద్దపీట వేసే మైసూరు రాజవంశంలో ప్రస్తుత మహారాణి త్రిషికా సింగ్ ఒడెయరు సరికొత్త డిజైన్లను సూచించారు. ఇందులో భాగంగా ముందుగా సఫారీ సెట్ బొమ్మల్ని ప్రతిపాదించారు. వీటి తయారీకి చెన్నపట్టణలోని బొమ్మల తయారీదారులు నడుం బిగించారు. సఫారీ బొమ్మలకు చిన్నారుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటికి ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం కల్పించడంతో అంతర్జాతీయంగా కూడా వీటికి డిమాండ్ పెరిగింది. దశాబ్ద కాలం క్రితం వరకు చెన్నపట్టణ బొమ్మలకు దేశీయంగానూ, అప్పుడప్పుడూ అంతర్జాతీయంగా ప్రాచుర్యం ఉండేది. తరువాత కాలంలో చైనా బొమ్మలు తక్కువ ధరలకే లభించడంతో క్రమేపీ ఆదరణ కోల్పోయింది. రెండేళ్లుగా కరోనా కారణంగా ఈ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. ప్రస్తుతం కొత్త రకం బొమ్మల తయారీని చేపట్టడంతో చెన్నపట్టణ బొమ్మలకు పూర్వవైభవం ఖాయమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కొత్త రకం బొమ్మల్ని ‘ది లిటిల్బంటింగ్ డాట్కామ్’ ద్వారా కొనుగోలు చేసేందుకు వీలుంటుందని త్రిషికా సింగ్ ఒడెయరు తెలిపారు. సంప్రదాయ డిజైన్లకే పరిమితమైన చెన్నపట్టణ బొమ్మలకు ఒడెయరు జోక్యంతో సరికొత్త రూపు సంతరించుకున్నాయి. గత ఏడాది ఆమె మహారాజు యదువీర్తో కలిసి చెన్నపట్టణను సందర్శించి అక్కడి బొమ్మల తయారీదారులతో వివిధ డిజైన్లపై చర్చించి తగిన సూచనలు చేశారు. ఆనాటి పర్యటన ఫలితంగా ప్రస్తుతం కొత్త డిజైన్లలో బొమ్మలు అందుబాటులోకి వచ్చాయి.
చెన్నపట్టణ బొమ్మల తయారీని ఇటీవల వీక్షించిన మహారాణి త్రిషికా సింగ్ ఒడెయరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖËర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!