అధ్యక్ష పదవి రేసులో ఇద్దరు అతివలు
హొసపేటె నగరసభ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు రిజర్వేషన్లు ప్రకటించారు. 2020 అక్టోబరులో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగా ఈ నెల 21న అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. అధ్యక్ష పదవిని దళిత మహిళ, ఉపాధ్యక్ష స్థానాన్ని సాధారణ(జనరల్) వర్గాలకు కేటాయించారు. మొత్తం 35 మంది
సుంకమ్మ
హొసపేటె, న్యూస్టుడే: హొసపేటె నగరసభ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు రిజర్వేషన్లు ప్రకటించారు. 2020 అక్టోబరులో ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ల ఆధారంగా ఈ నెల 21న అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు. అధ్యక్ష పదవిని దళిత మహిళ, ఉపాధ్యక్ష స్థానాన్ని సాధారణ(జనరల్) వర్గాలకు కేటాయించారు. మొత్తం 35 మంది సభ్యుల్లో స్వతంత్రులను కలుపుకొని 20 మంది సభ్యుల బలం ఉన్న భారతీయ జనతా పార్టీకే ఈ పదవులు దక్కడం లాంఛనమే. భాజపా నుంచి 4వ వార్డులో గెలిచిన సుంకమ్మ, 23వ వార్డు నుంచి విజయం సాధించిన గంగమ్మ అధ్యక్ష పదవికి అర్హులు. మంత్రి ఆనంద్సింగ్ అనుగ్రహం మేరకు వీరిద్దరిలో ఒకరు అధ్యక్ష పదవి చేపడతారని ప్రచారం జరుగుతోంది. ఈ పదవి కోసం ఆనంద్సింగ్ ఇంటి చుట్టూ వీరు తిరుగుతున్నారు. స్వతంత్రుల మద్దతుతో నగరసభలో అధికారం చేపట్టిన భాజపా, ఆ రుణం తీర్చుకునేందుకు 9మంది స్వతంత్రుల్లో ఒకరికి ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇది కూడా మంత్రి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.
21న ఎన్నికలు: నగరసభ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఈ నెల 21న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఉపవిభాగం అధికారి సిద్ధరామేశ్వర తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నామపత్రాల సమర్పణ, 1.30 గంటలకు పరిశీలన, 2 గంటలకు ఉపసంహరణ, అవసరమైతే 2.10 గంటలకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.
గంగమ్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?