రూ.3.75 కోట్లతో డా.రాజ్కుమార్ ఉద్యానవనం సుందరీకరణ
డా.రాజ్కుమార్ ఉద్యానవనాన్ని రూ.3.75కోట్లతో సుందరీకరిస్తున్నట్లు బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార (బుడా) అధ్యక్షుడు పి.పాలన్న కాకర్లకోట పేర్కొన్నారు. ఆయన అధ్యక్షతన బుడా సామాన్య సమావేశం సోమవారం బుడా కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి
మాట్లాడుతున్న బుడా అధ్యక్షుడు పి.పాలన్న , చిత్రంలో
ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్ అధికారులు
బళ్లారి, న్యూస్టుడే: డా.రాజ్కుమార్ ఉద్యానవనాన్ని రూ.3.75కోట్లతో సుందరీకరిస్తున్నట్లు బళ్లారి నగరాభివృద్ధి ప్రాధికార (బుడా) అధ్యక్షుడు పి.పాలన్న కాకర్లకోట పేర్కొన్నారు. ఆయన అధ్యక్షతన బుడా సామాన్య సమావేశం సోమవారం బుడా కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి హాజరైన స్థానిక శాసనసభ్యుడు గాలి సోమశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ ఏచరెడ్డి సతీశ్, పాలికె, బుడా అధికారులు సలహా మేరకు పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రధానంగా డా.రాజ్కుమార్ ఉద్యానవనంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.3.75 కోట్లు కేటాయించారు. తక్షణమే టెండర్లు పిలిచి అభివృద్ధి చేయాలని తీర్మానించారు. డా.రాజ్కుమార్ ఉద్యానవనం అభివృద్ధి చెందింతే నగర వాసులకు సెలవు రోజులు, సాయంత్రపు వేళల్లో విశ్రాంతి తీసుకోవడంతో పాటు పిల్లలకు అనుకూలంగా ఉంటుందన్నారు. నగరంలో 20 ఉద్యానవనాల అభివృద్ధితోపాటు, జిమ్ పరికరాలను ఏర్పాటు చేయాలని నిధులు కేటాయించారు. నగరంలో పలు కూడళ్లులో వీది దీపాలు వేయాలి. రహదారులు వేయాలని చర్చించారు. నగరంలో తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలైన కొలిమి చౌక్, బసవేశ్వరనగర్, మరో రెండు ప్రాంతాల్లో నీటిశుద్ధి కేంద్రాలను నిర్మాణానికి అనుమతితోపాటు, నిధులు కేటాయించారు. శివారు ప్రాంతమైన అల్లం భవనం సమీపంలో 100 ఎకరాల్లో కొత్తగా లేఅవుట్ అభివృద్ధి చేసి పేదలకు తక్కువ ధరలకు ఇంటి స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM