ఏడు కిలోమీటర్ల దూరంలో ప్రసూతి ఆసుపత్రా?
రూ.12 కోట్ల నిధులతో ప్రభుత్వం సింధనూరు తాలూకాకు మంజూరు చేసిన ప్రసూతి కేంద్రం (తల్లీ-శిశువుల ఆసుపత్రి) మస్కి మార్గంలోని కల్లూరు గ్రామంలో నిర్మింపజేయడంలో స్థానిక ఎమ్మెల్యే నాడగౌడ దురుద్దేశం ఏదో దాగి ఉందని మాజీ శాసనసభ్యుడు బాదర్లి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాదర్లి, ఎమ్మెల్సీ శరణప్ప బయ్యాపూరు
సింధనూరు, న్యూస్టుడే: రూ.12 కోట్ల నిధులతో ప్రభుత్వం సింధనూరు తాలూకాకు మంజూరు చేసిన ప్రసూతి కేంద్రం (తల్లీ-శిశువుల ఆసుపత్రి) మస్కి మార్గంలోని కల్లూరు గ్రామంలో నిర్మింపజేయడంలో స్థానిక ఎమ్మెల్యే నాడగౌడ దురుద్దేశం ఏదో దాగి ఉందని మాజీ శాసనసభ్యుడు బాదర్లి హంపనగౌడ ఆరోపించారు. ఇక్కడ ఆసుపత్రి నిర్మిస్తే..పురిటి నొప్పులతో తాళలేక ఆసుపత్రికి చేరేలోపే గర్భిణులు నరకయాతన అనుభవిస్తారన్నారు. ఈ ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ప్రజల నుంచి అనేక విమర్శలు వినిపిస్తుండటంతో తానూ నోరు విప్పాల్సి వచ్చిందని బాదర్లి పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ శరణప్ప బయ్యాపూరు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో కలసి శంకుస్థాపన చేసిన కొప్పళ ఎంపీ కూడా స్థలాన్ని చూసి పెదవి విరవడం శోచనీయమని ఖండించారు. శ్మశానం పక్కన, పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరాన నిర్మించడం వెనుక నాడగౌడ దురుద్దేశం ఏమిటన్నది తాము త్వరలోనే బట్టబయలు చేస్తామన్నారు. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళతామని..నాడగౌడ వర్గం ఈ ఆసుపత్రి నిర్మాణంలో మొండిగా ముందుకెళితే తీవ్రంగా అడ్డుకుంటామని బాదర్లి హెచ్చరించారు. వళబళ్లారి మార్గంలో కొత్తగా లేఅవుట్లు ఆయ్యాయి, పీడబ్ల్యూడీక్యాంపు నీటిపారుదల శాఖ స్థలం విశాలంగా ఉంది, పీజీ కేంద్రం ఆనుకుని కూడా ఆరు ఎకరాల స్థలం ఉంది..వీటిలో రెండు ఎకరాలు తీసుకోవడం మానేసి కల్లూరు గ్రామంలో ఆసుపత్రి నిర్మించడంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.