నిబంధనల నడుమ గణతంత్ర వేడుక
గణతంత్ర దినోత్సవం అత్యంత పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. వేర్వేరు బృందాలకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవం
పవన్కుమార్ మాలపాటి, జిల్లా పాలనాధికారి
బళ్లారి, న్యూస్టుడే: గణతంత్ర దినోత్సవం అత్యంత పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి. వేర్వేరు బృందాలకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా పాలనాధికారి పవన్కుమార్ మాలపాటి అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవం నిర్వహణపై జిల్లా పాలనాధికారి సోమవారం ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 26న ఉదయం 9గంటలకు జిల్లా క్రీడామైదానంలో జిల్లా బాధ్యమంత్రి బి.ఎస్.ఆనంద్సింగ్ పతాకావిష్కరణ చేస్తారు. ఈ కార్యక్రమానికి ముందు స్థానిక హెచ్.ఆర్.గవియప్ప కూడలిలోని 150 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం కంటోన్మెంట్లోని విమ్స్ వైద్య కళాశాల ముందున్న గాంధీ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారన్నారు. గణతంత్ర దినోత్సవానికి స్వాగత, ప్రచార, పరేడ్, సన్మానం, బందోబస్తు, ఆరోగ్య తదితర సమితులను ఏర్పాటు చేశామని, బాధ్యతలు అప్పగించిన అధికారులు సక్రమంగా నిర్వహించాలని డీసీ పేర్కొన్నారు. ఏడీసీ మంజునాథ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, నగరంలో ప్రముఖ కూడళ్లు, దేవస్థానాలు తదితర ప్రాంతాల్లో 25, 26 తేదీల్లో విద్యుత్తు దీపాలతో అలంకరించాలన్నారు. వివిధ క్షేత్రాల్లో ప్రతిభ కనబరిచిన వారికి సన్మానం చేయాలని సూచించారు. సమావేశంలో కన్నడ, సంస్కృతిశాఖాధికారి సిద్దలింగేశ్ రంగణ్ణనవర్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని