వైరస్ తీవ్రత తగ్గుముఖం
కన్నడనాట ఆదివారంతో పోల్చితే.. సోమవారం ఏడు వేల పైచిలుకు కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. పాజిటివిటీ ఏడు శాతం తగ్గింది. వారాంతపు లాక్డౌన్తోనే కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రి ఆర్.అశోక్ వ్యాఖ్యానించారు. నగరంలో 60 శాతం మంది
రైల్వే స్టేషన్ ఆవరణలో స్వాబ్ పరీక్ష చేయించుకుంటున్న ప్రయాణికుడు
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే : కన్నడనాట ఆదివారంతో పోల్చితే.. సోమవారం ఏడు వేల పైచిలుకు కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. పాజిటివిటీ ఏడు శాతం తగ్గింది. వారాంతపు లాక్డౌన్తోనే కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రి ఆర్.అశోక్ వ్యాఖ్యానించారు. నగరంలో 60 శాతం మంది జలుబు, జ్వరం, దగ్గు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ కొవిడ్ ఉన్నట్లు కాదని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ లక్షణాలు నాలుగు రోజులు దాటినా.. అలానే కొనసాగితే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచించారు. క్లినిక్లు, ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్న రోగుల సంఖ్య శనివారం నుంచి పెరుగుతోంది. టీకా వేయించుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపించగా, మొదటి రెండు డోసులతో పోల్చితే బూస్టర్ డోసు వేయించుకునేందుకు ఎక్కువ మంది వస్తున్నారని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గత వారం సొంత ఊర్లకు వెళ్లిన నగరవాసులు అందరూ ఒకేసారి తిరిగి వస్తుండడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద రద్దీ ఎక్కువగా కనిపించింది. ఎక్కువ సంఖ్యలో వచ్చినా.. ఆరోగ్య శాఖ కార్యకర్తలు వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు కొనసాగిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు లేకుండా వస్తున్న వారికి మార్షల్స్ జరిమానాలు విధించారు.
* వారాంతపు కర్ఫ్యూను తొలగించాలని బెంగళూరు వ్యాపారులు డిమాండ్ చేశారు. నిబంధనలను మరింత కఠినం చేస్తూ, కర్ఫ్యూను తొలగించాలని పలు వర్తక సంఘాలు, హోటళ్ల యాజమాన్యాలు, థియేటర్లు, మాల్స్ నిర్వాహకులు ప్రభుత్వానికి వినతిపత్రాలు పంపించారు. ఇతర ప్రాంతాలతో పోల్చితే నగరంలో కేసులు ఎక్కువగా ఉండడంతో 144 సెక్షన్ను అమలులోకి తీసుకు వచ్చారు. జనవరి 31 వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయని కొత్వాలు కమల్పంత్ ప్రకటించారు.
తాజా కేసులు..
కర్ణాటకలో సోమవారం 27,156 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో 7,827 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లారు. చికిత్స పొందుతూ 14 మంది మరణించారు. పాజిటివిటీ 12.45 శాతం, మరణాలు 0.05 శాతంగా నమోదయ్యాయి. క్రియాశీల కేసుల సంఖ్య 2.17 లక్షలకు చేరుకుంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విదేశాల నుంచి వచ్చిన 565 మందితో సహా, 1,081 మంది దేశీయ ప్రయాణికులకు స్వాబ్ టెస్టులు చేశారు. వీరితో పాతిక మందికి కొవిడ్ ఉన్నట్లు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో 2.17 లక్షల మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 2.16 లక్షల మంది టీకా వేయించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?