logo

మోదీ కోసం మృత్యుంజయ హోమం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోగ్యం కోసం ధర్మస్థలలో మహా మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. స్థానిక శాసనసభ్యుడు హరీష్‌ పూంజా నేతృత్వంలో ఆదివారం ఆరంభమైన హోమం సోమవారం ఉదయం ముగిసింది. ధర్మస్థలతో పాటు దాదాపు 20 ప్రాంతాల్లోని

Published : 18 Jan 2022 01:32 IST


 ధర్మస్థల మహామండపంలో మహామృత్యుంజయ హోమం చేస్తున్న పండితులు

బెంగళూరు సాంస్కృతికం : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోగ్యం కోసం ధర్మస్థలలో మహా మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. స్థానిక శాసనసభ్యుడు హరీష్‌ పూంజా నేతృత్వంలో ఆదివారం ఆరంభమైన హోమం సోమవారం ఉదయం ముగిసింది. ధర్మస్థలతో పాటు దాదాపు 20 ప్రాంతాల్లోని ఆలయాల్లో ఈ హోమాలు కొనసాగాయని హరీష్‌ పూంజా తెలిపారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో అడ్డంకులు ఏర్పడిన నేపథ్యంలో ఆయనకు ఆయుష్షు, ఆరోగ్యం సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ హోమాన్ని నిర్వహించామన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని