యువజన కాంగ్రెస్లో రాద్ధాంతం
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష స్థానం కోసం మరో పోరాటం ప్రారంభమైంది. త్వరలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానని ప్రచారం చేసుకుంటున్న ప్రస్తుత ఉపాధ్యక్షుడు మొహమ్మద్ నలపాడ్- బళ్లారి గ్రామీణ
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష స్థానం కోసం మరో పోరాటం ప్రారంభమైంది. త్వరలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతానని ప్రచారం చేసుకుంటున్న ప్రస్తుత ఉపాధ్యక్షుడు మొహమ్మద్ నలపాడ్- బళ్లారి గ్రామీణ జిల్లా అధ్యక్షుడు సిద్ధుహళ్లేగౌడపై దాడి చేసినట్లు సమాచారం గుప్పుమంది. యువజన అధ్యక్షస్థానానికి 2021 జనవరిలో జరిగిన ఎన్నికల్లో శాంతినగర శాసనసభ్యుడు ఎన్.ఎ.హ్యరీస్ తనయుడు నలపాడ్కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అతడిపై క్రిమినల్ కేసులు ఉండటంతో పార్టీ అధిష్ఠానం ఆయనను పక్కనపెట్టి రెండో స్థానం వచ్చిన మాజీ మంత్రి ఎం.ఆర్.సీతారాం తనయుడు రక్షా రామయ్యకు అధ్యక్ష స్థానం కట్టబెట్టింది. అప్పటి నుంచి నలపాడ్- రక్షా రామయ్య మధ్య పోరు కొనసాగుతోంది. ఉపాధ్యక్షురాలు భవ్య నరసింహమూర్తిని నలపాడ్ బెదిరించారనే ఆరోపణ నేపథ్యంలో ప్రత్యర్థి నేతలు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదం పెద్దది కాకుండా యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్యతో చర్చించి ఓ పరిష్కార మార్గం సూచించారు. గత ఏడాది డిసెంబరు 31 వరకు అధ్యక్ష స్థానంలో రక్షా రామయ్య కొనసాగాలని- ఆపై నలపాడ్కు అవకాశం కల్పించాలని సూచించారు. డీకే మద్దతు తనకే ఉందని, ఫిబ్రవరిలో పదవి చేపడతానని నలపాడ్ ప్రచారం చేసుకుని.. ఆ ఏర్పాట్లలో మునిగిపోయారు. ఆ ఏర్పాట్లపైనే బుధవారం సాయంత్రం నగరంలోని యలహంక క్లబ్లో ఏర్పాట్లు చేయగా.. అన్ని జిల్లాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులూ హాజరయ్యారు. అక్కడే బళ్లారి యువ నేతపై దాడి జరిగిందని సమాచారం. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధుహళ్లేగౌడ ప్రయత్నించగా అగ్రనేతలు జోక్యం చేసుకుని అడ్డుకున్నట్లు తెలిసింది. నలపాడ్ ప్రవర్తనపై బళ్లారి నేత తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. దాడి ఒట్టి ప్రచారమని ఇటు సిద్ధుహళ్లేగౌడ.. అటు నలపాడ్ గురువారం స్పష్టం చేశారు. ఇదంతా పెద్ద కుట్రగా తప్పుపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామనగరలో శివశక్తి ప్రదర్శన
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్ -
పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
[ 29-03-2024]
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. -
గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప
[ 29-03-2024]
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. -
నాకు ప్రాణాపాయం
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
యాప్ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!
[ 29-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్లను సిద్ధం చేసింది. ఈ యాప్లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
[ 29-03-2024]
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. -
ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
[ 29-03-2024]
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
[ 29-03-2024]
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. -
లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.