పిల్లలకు మందకొడిగా టీకా
నిపుణులు హెచ్చరించినట్లుగానే కరోనా మూడో దశ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జనవరి 1 నుంచి 19 వరకు అఖండ బళ్లారి జిల్లాలో మొత్తం 4,244 మందికి కరోనా సోకగా, వారిలో 0-18 ఏళ్ల పిల్లలు 691 మంది ఉన్నారు. వీరిలో తీవ్ర లక్షణాలు కనిపించక పోవడం
ఆధార్ కార్డులతో బారులు తీరిన విద్యార్థినులు
బళ్లారి, న్యూస్టుడే: నిపుణులు హెచ్చరించినట్లుగానే కరోనా మూడో దశ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జనవరి 1 నుంచి 19 వరకు అఖండ బళ్లారి జిల్లాలో మొత్తం 4,244 మందికి కరోనా సోకగా, వారిలో 0-18 ఏళ్ల పిల్లలు 691 మంది ఉన్నారు. వీరిలో తీవ్ర లక్షణాలు కనిపించక పోవడం ఊరట కలిగిస్తోంది. వారిని ఇళ్ల వద్దనే ఉంచి చికిత్స చేస్తున్నారు. కరోనా వ్యాప్తిలో బళ్లారి తాలూకా అగ్రస్థానంలో ఉండగా, కంప్లి తాలూకాలో తŸక్కువ మంది ఉన్నారు.
విమ్స్ వైద్య విద్యార్థులు సుమారు 60 మంది కొవిడ్ బాధితులయ్యారు. ఎర్రంగలి మొరార్జీదేశాయి వసతిగృహంలో ఉంటున్న విద్యార్థుల్లో 46 మందికి వైరస్ సోకింది. నగరంలోని బి.ఐ.టి.ఎం ఇంజినీరింగ్ కళాశాల, ఎ.ఎస్.ఎం. హాస్టల్, ఎస్.జి.కళాశాల విద్యార్థులకు వైరస్ సోకింది. తాలూకాల వారీగా చూస్తే.. బళ్లారి 248, సిరుగుప్ప 64, సండూరు 68, కంప్లి 9, కురుగోడు 12, హొసపేటె 177, హగరిబొమ్మనహళ్లి 14, కూడ్లిగి 19, హరపనహళ్లి 21, కొట్టూరు 14, హూవినహడగలిలో 45 మంది పిల్లలకు కరోనా సోకింది.
టీకా వితరణలో నిర్లక్ష్యం ఎందుకు?
15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసువారికి జనవరి 19 నుంచి టీకా వేయాలని నిర్ణయించారు. అఖండ బళ్లారి జిల్లాలో ఈ వయసు పిల్లలు మొత్తం 1,70,344 మంది ఉన్నారు. వారంలోగా వీరికి మొదటి డోసు టీకా ఇస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా ప్రకటించారు. జనవరి 3 నుంచి 19 సాయంత్రం 7.30 గంటల వరకు 94,421 మంది (55.4 శాతం)కి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలియజేశారు. టీకా కొరత కారణంగా లక్ష్యం మేరకు వేయలేదని బోగట్టా.
ఎర్రంగలి మొరార్జీదేశాయి వసతిశాలలో బాధిత విద్యార్థులకు
అవగాహన కల్పిస్తున్న ఉపాధ్యాయులు, ఆరోగ్యశాఖ అధికారులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!