మీర్సాదిక్ సౌధానికి చెదలు
‘ఎవరికైనా నమ్మక ద్రోహం చేస్తే.. అలాంటి వ్యక్తిని మీర్ సాదిక్’ అని పిలుస్తుంటారు. ఇంతకూ ఆ మీర్ సాదిక్ ఎవరు? అతడి సమాధి ఎక్కడుంది? అనే ప్రశ్నలు తొలుస్తుంటాయి. శ్రీరంగపట్టణంలో మీర్ సాదిక్ సమాధి ఉన్నప్పటికీ బాహ్య ప్రపంచానికి అంతగా పరిచయం లేదు.
శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణం
ఇదే.. చారిత్రక మీదర్సాదిక్ సమాధి కట్టడం..
మండ్య, న్యూస్టుడే : ‘ఎవరికైనా నమ్మక ద్రోహం చేస్తే.. అలాంటి వ్యక్తిని మీర్ సాదిక్’ అని పిలుస్తుంటారు. ఇంతకూ ఆ మీర్ సాదిక్ ఎవరు? అతడి సమాధి ఎక్కడుంది? అనే ప్రశ్నలు తొలుస్తుంటాయి. శ్రీరంగపట్టణంలో మీర్ సాదిక్ సమాధి ఉన్నప్పటికీ బాహ్య ప్రపంచానికి అంతగా పరిచయం లేదు. కనీసం పరిసర ప్రాంతాల్లోని ప్రజలను తరిచి చూసినా బిక్కమొహమే దర్శనమిస్తుంది. బ్రిటిషర్లను గడగడలాడించిన టిప్పు సుల్తాన్ సామ్రాజ్యంలో మీర్ సాదిక్ ఓ మంత్రి. అంతకుమించి టిప్పు సుల్తాన్కు అత్యంత విశ్వాసపాత్రుల్లో ఒకరిగా గుర్తింపు పొందాడు. ఒక విధంగా చెప్పాలంటే మీర్ సాదిక్ తలలో నాలుక వంటివాడని అప్పట్లో పేరుండేది. ఇంతటి విశ్వాసపాత్రుడైన మీర్సాదిక్ బ్రిటిషర్లతో చేతులు కలిపాడు. అప్పటికే మూడు యుద్ధాలతో తీవ్ర గర్వభంగాన్ని ఎదుర్కొన్న బ్రిటిష్ అధికారులు నాలుగో యుద్ధం సమయంలో మీర్ సాదిక్ను మచ్చిక చేసుకున్నారు. ఎలాంటి ప్రలోభాలకు గురిచేశారోగానీ టిప్పు సైనిక రహస్యాల్ని ఎప్పటికప్పుడు బ్రిటిషర్లకు చేరవేసేవాడు. శత్రువులు చొరబడేందుకు ఏమాత్రం వీలులేని శ్రీరంగపట్టణ కోటలోకి ఏవిధంగా ప్రవేశించడానికి వీలుంటుందోననే రహస్య మార్గాన్ని వెల్లడించాడట. మీర్ సాదిక్ సూచనల ఆధారంగానే బ్రిటిష్ సైన్యాలు కోటలోనికి ప్రవేశించి టిప్పును సంహరించడంతో పాటు కోటను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. టిప్పు వీర మరణం వార్తను తెలుసుకున్న విశ్వాసపాత్రుడుగా ఉండే అబ్దుల్ గఫూర్ అనే వ్యక్తి మీర్ సాదిక్ను ముక్కలుగా నరికాడని చరిత్ర చెబుతోంది. శ్రీరంగపట్టణను కైవశం చేసుకునేందుకు సహకరించిన మీర్ సాదిక్ శవాన్ని బ్రిటిష్ అధికారులు అప్పటికే సలీం ఆలీ అనే మంత్రి కోసం నిర్మించిన కట్టడంలో సమాధి చేశారనేది చరిత్ర.
* ఇక వర్తమానంలోకి వస్తే.. టిప్పు సుల్తాన్ సమాధుల నుంచి దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్ సాదిక్ సమాధి కట్టడం నేడోరేపో కూలేందుకు సిద్ధంగా ఉంది. అటువైపు వెళ్లడానికి ఏ ఒక్కరూ సాహసించరు. పగటిపూట వెళ్లడానికి కూడా వీలులేనంతటి పరిస్థితులు కనిపిస్తాయి. కట్టడం శిథిలావస్థకు చేరుకున్నా, అందులోని సమాధి ప్రాంతం నిర్మాణ వ్యర్థాలతో కనిపిస్తున్నా అటువైపు ఏ ఒక్కరు కూడా వెళ్లని పరిస్థితులున్నాయి. టిప్పు సుల్తాన్ను మోసగించాడనే ఆగ్రహం ఇప్పటికీ అక్కడి ప్రజల్లో కనిపిస్తుంది. ఈ కారణంగానే అక్కడో సమాధి ఉందనే విషయం స్థానికులకు తెలియదంటే ఆశ్చర్యమే. శ్రీరంగపట్టణ పతనానికి కారణమైన మీర్ సాదిక్ సమాధి ప్రాంతాన్ని భావితరాలకు తెలియాలంటే సంరక్షణ చర్యలు ఎంతైనా అవసరం. నిర్లక్ష్యం ఇదే విధంగా కొనసాగితే మరో రెండు మూడేళ్ల తరువాత ఆ ప్రాంతం పూర్తిగా శిథిలవమడం ఖాయం.
సమాధి పరిసరాలన్నీ అధ్వానంగా కనిపిస్తున్న తీరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు