ముప్పు ముంగిట నగరవాసి
రాజధాని నగరంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మరోసారి విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఒకే రోజు 30,590 కరోనా కేసులు దాఖలైనట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు ప్రకటించారు. మరోవైపు చికిత్స ఫలించక
డాక్టర్ అంబేడ్కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో కరోనా చికిత్స కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కేజే జార్జి తదితరులు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : రాజధాని నగరంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మరోసారి విజృంభిస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఒకే రోజు 30,590 కరోనా కేసులు దాఖలైనట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు ప్రకటించారు. మరోవైపు చికిత్స ఫలించక ఐదుగురు మృతి చెందారు. క్రియాశీల కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. వారిలో 20 శాతం మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మిగతా రోగులు ఇళ్ల వద్దనే సేవలు పొందుతున్నారు. ఏక్షణంలోనైనా రోజువారీ కరోనా కేసులు లక్ష దాటే ప్రమాదం లేకపోలేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ హెచ్చరించారు. కేసులు పెరుగుతున్నా.. వ్యాధి తీవ్రత తక్కువగానే ఉందని ఆయన వివరించారు. అలాగని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైరస్ పీడితులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు సంబంధిత కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించిన దాఖలాలు లేవు. వైద్యులు, నర్సులు, ఇతర ఉద్యోగులను ఇంకా నియమించలేదు. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యులకే వీటి బాధ్యత అప్పగించారు. ఇప్పటికిప్పుడు అత్యవసర రోగులను బౌరింగ్, కేసీ జనరల్, సీవీరామన్ ఆసుపత్రుల్లో చేరుస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ పడకలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు ప్రకటించారు. చికిత్సకు ప్రతిగా వైద్య రుసుములు పెంచాలని ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం సామాన్య వార్డులో రోజుకు పడక రుసుముగా రూ.10 వేలు, ఐసీయూ వార్డులో రూ.15 వేలు, వెంటిలేటర్ పడకకు రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. ఆ మొత్తాన్ని పెంచాలని వారంతా కోరుతున్నారు.
బి నగరంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో కరోనా చికిత్స కేంద్రాన్ని మళ్లీ ప్రారంభించారు. అక్కడి వైద్య సౌకర్యాలను ఎమ్మెల్యే కేజే జార్జి గురువారం పరిశీలించారు. ప్రస్తుతం 50 పడకలు ఏర్పాటు చేశామని, అందులో పది ఆక్సిజన్ పడకలు ఉన్నాయని ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.