వ్యవసాయం పండగే
వ్యవసాయ ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయాలన్న లక్ష్యంతో కర్ణాటక సర్కారు మరో కీలక అడుగు వేసింది. గత బడ్జెట్లో ప్రకటించినట్లే వ్యవసాయం, ఉద్యాన శాఖల నుంచి అనుబంధ వ్యవసాయాన్ని వేరుచేస్తూ ప్రత్యేక డైరెక్టరేట్ (శాఖ) రూపుదాల్చింది. ఈ విభాగాల్లో
ప్రత్యేక డైరెక్టరేట్కు రూపకల్పన
రైతుల ఆదాయానికి భరోసా
పందెం గుర్రాల పోషణకు ప్రత్యేక నిధులు
ఈనాడు డిజిటల్, బెంగళూరు : వ్యవసాయ ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయాలన్న లక్ష్యంతో కర్ణాటక సర్కారు మరో కీలక అడుగు వేసింది. గత బడ్జెట్లో ప్రకటించినట్లే వ్యవసాయం, ఉద్యాన శాఖల నుంచి అనుబంధ వ్యవసాయాన్ని వేరుచేస్తూ ప్రత్యేక డైరెక్టరేట్ (శాఖ) రూపుదాల్చింది. ఈ విభాగాల్లో నిపుణులైన 13 మందితో కొత్త డైరెక్టరేట్ త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. అనుబంధ వ్యవసాయానికి (సెకండరీ అగ్రికల్చర్) ఇకపై ప్రత్యేక నిధులు, బ్యాంకు రుణాలు, రాయితీలు, మార్కెట్లకు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు కానున్నాయి. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, అటవీ శాఖల అధికారులు అనుబంధ వ్యవసాయ శాఖలో వివిధ హోదాలో నియమితులవుతారు. గత ఆగస్టులో కేంద్ర వ్యవసాయ ఆదాయ పర్యవేక్షణ సమితితో ముఖ్యమంత్రి పలుమార్లు చర్చించారు. ఈ సమితి సిఫార్సులతో అనుబంధ వ్యవసాయ శాఖ విధివిధానాలను సిద్ధం చేశారు.
బృందమిదిగో..
వ్యవసాయ శాఖ డైరెక్టర్ అనుబంధ వ్యవసాయ శాఖకూ డైరెక్టర్గా వ్యవహరిస్తారు. చక్కెర, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల శాఖ డైరెక్టర్లు సభ్యులుగా, వాటర్షెడ్ అభివృద్ధి, పశు సంవర్ధక, ఉద్యాన, మత్స్య, వ్యవసాయ మార్కెటింగ్ శాఖల సంయుక్త సంచాలకులు, అటవీశాఖ ప్రధాన పరిరక్షకులు సాంకేతిక అధికారులుగా పని చేస్తారు. వ్యవసాయ శాఖ, వ్యవసాయ ఆర్థిక కోర్సుల ఆచార్యులు, సర్కారు గుర్తించిన ఆదర్శ రైతులు, రైతు ప్రతినిధులు సభ్యులుగా పని చేస్తారు. శాశ్వత నియామకాలు చేపట్టే వరకు వీరంతా తాత్కాలికంగా విధులు నిర్వహిస్తారు. ప్రాజెక్టు మేనేజ్మెంట్, డిజిటల్ టెక్నాలజీ, డేటా అనాలసిస్ నిపుణులను పొరుగు సేవల విధానంతో నియమిస్తారు. కొత్త బృందం సమీకృత వ్యవసాయ వ్యవస్థ, వ్యవసాయ వలయాల్లో మార్కెట్ వ్యవస్థలను పర్యవేక్షిస్తారు.
రైతులకు భరోసా
పండించిన పంటకు మార్కెట్ ధర లభించకున్నా రైతుకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించటమే అనుబంధ వ్యవసాయ శాఖ లక్ష్యం. వర్షం, నీటిపారుదల పంటలు అతివృష్టితో నష్టపోయినా రైతుకు ఈ అనుబంధ వ్యవసాయం ఆదుకుంటుంది. స్థానికంగా లభించే వ్యవసాయ, ప్రకృతి సహజమైన వనరులతో ప్రాథమిక, అనుబంధ ఉత్పత్తులు చేపట్టేలా రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ డైరెక్టరేట్ సహకరిస్తుంది. ఉత్పత్తుల తయారీకి అవసరమైన నిధులు, ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలను వివిధ వ్యవస్థల ద్వారా కల్పిస్తారు. స్థానిక మానవ వనరులకు తగిన శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరుస్తారు. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులకు అవసరమైన ముడిసరుకులు శూన్య పెట్టుబడితోనే సేకరించే విధానాలపై అవగాహన కల్పించనున్నారు. తేనెటీగలు, పందెపు గుర్రాలు, మొక్కల పెంపకం, వన్య మృగాల పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయ, పట్టు, జీవ రసాయన ఎరువులు, ప్రకృతి ఔషధం, పూలు, సాంబారు పదార్థాలు, సొంఠి, పసుపు జామ్, వ్యవసాయ పర్యాటకం, ఆయుష్ వైద్యం, పశువుల ఆహారం, నేల సార పరీక్షలు, సుగంధ ద్రవ్యాల తయారీ వంటి 50రకాల అనుబంధ వ్యవసాయ పరిశ్రమలు ఈ డైరెక్టరేట్ పరిధిలోనికి వస్తాయి.
మొక్కల పెంపకానికీ సర్కారు వెన్నుదన్ను
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హత్యకు.. కొడుకే కిరాయి ఇచ్చాడట
[ 23-04-2024]
జిల్లా కేంద్రం గదగ దాసరవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును గదగ పోలీసులు ఛేదించారు. -
రైతన్నకు కరవు సాయం
[ 23-04-2024]
తీవ్ర కరవు బారినపడిన తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వివక్షతో నిధుల విడుదలను జాప్యం చేస్తోందంటూ సుప్రీంకోర్టులో కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్ సోమవారం కీలక మలుపు తిరిగింది. -
హామీలు విస్మరించిన భాజపా
[ 23-04-2024]
పేదలు, మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
హత్యోన్మాదంపై నిరసన వెల్లువ
[ 23-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యను ఖండిస్తూ వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపునకు ధార్వాడలోని వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్పందించారు -
బడుగుల ఓట్లే నిర్ణయాత్మకం
[ 23-04-2024]
ప్రముఖ హృద్రోగ చికిత్స నిపుణుడు డాక్టర్ సీఎన్ మంజునాథ్ రాజకీయ అరంగేట్రం.. ఆయనకు పెను సవాళ్లను విసురుతోంది. -
ఆకట్టుకునేలా అవగాహన
[ 23-04-2024]
ఎన్నికల్లో యువత తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలంటూ అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు -
అభ్యర్థికి కాదు.. అమాత్యులకే అగ్నిపరీక్ష
[ 23-04-2024]
బళ్లారి లోక్సభ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాంను గెలిపించుకునే బాధ్యత బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, బి.జడ్.జమీర్ అహ్మద్ ఖాన్ భుజస్కందాలపై ఉండటంతో ఈ ఎన్నికలు అభ్యర్థికన్నా అమాత్యులకే అగ్నిపరీక్షగా మారాయి -
గ్యారంటీలతో ప్రజలకు ఊతం
[ 23-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆచార్య రాజీవ్గౌడకు మద్దతుగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం దాసరహళ్లిలో రోడ్షో నిర్వహించి, ఓట్లు అభ్యర్థించారు. -
‘ఉచిత’ హారం..అపూర్వ సత్కారం
[ 23-04-2024]
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఒక విద్యార్థిని సోమవారం రాత్రి ప్రత్యేకంగా సత్కరించింది. అరసికెరెలో మొదటి ఏడాది న్యాయశాస్త్రాన్ని చదువుతున్న జయశ్రీ ‘ఉచిత బస్సు టికెట్ల’తో చేసిన హారంతో ఆయనను సన్మానించింది.
తాజా వార్తలు (Latest News)
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!