Crime News: సినిమాలుచూసి బ్యాంకులో దొంగతనం..మెకానికల్ ఇంజినీరు అరెస్టు
సినిమాలు, వీడియోలు చూసి బ్యాంకులో ఎలా దొంగతనం చేయాలో తెలుసుకుని ఆచరణలో పెట్టిన ధీరజ్ (25)ను బెంగళూరులోని మడివాళ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిందితుడు ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా చేరాడు. గత వారం భారతీయ
ధీరజ్
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే: సినిమాలు, వీడియోలు చూసి బ్యాంకులో ఎలా దొంగతనం చేయాలో తెలుసుకుని ఆచరణలో పెట్టిన ధీరజ్ (25)ను బెంగళూరులోని మడివాళ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిందితుడు ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా చేరాడు. గత వారం భారతీయ స్టేట్ బ్యాంకు శాఖ మూసి వేసే సమయానికి ముందు నిందితుడు లోనికి ప్రవేశించాడు. కత్తి చూపించి ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను బెదిరించాడు. లాకర్ను తెరిపించి అందులో ఉన్న రూ.85 లక్షల నగదు, ఆభరణాలను సంచిలో నింపుకొని పరారయ్యాడు. బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు. లోన్ యాప్లలో రుణాలు తీసుకుని, అమెరికాలోకి కొన్ని సంస్థలతో ఆన్లైన్ ట్రేడింగ్ నిర్వహించిన ధీరజ్ సుమారు రూ.35 లక్షల రుణం తీసుకున్నాడు. తన విలాసాలకు మరో రూ.5 లక్షలు ఖర్చు చేశాడు. రుణభారం పెరిగిపోవడంతో ఒక్కడే బ్యాంకులో ఎలా దొంగతనం చేయాలో వీడియోలు చూసి, తన పథకాన్ని అమలు చేసి, చివరకు దొరికిపోయాడని ఆగ్నేయ విభాగం డీసీపీ శ్రీనాథ్ మహదేవ్ జోషి తెలిపారు. దొంగతనం చేసిన తర్వాత బస్సులో చిక్కమగళూరు, బళ్లారి, శివమొగ్గ, అనంతపురం తదితర ప్రాంతాల్లో సంచరించాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసు బృందాన్ని అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దక్షిణాదిపైనే కమలదండు గురి
[ 20-04-2024]
సీనియర్ల పోటీ మధ్య రాష్ట్ర భాజపా అధ్యక్ష పగ్గాలు దక్కించుకున్న యువ నేత బి.వై.విజయేంద్ర సారథ్యంలో తొలిసారిగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. -
నటి హర్షికపై దాడి
[ 20-04-2024]
పులకేశినగరలో తన భర్త భువన్తో కలిసి వెళుతున్న సమయంలో కొందరు దుండగులు తమపై దాడి చేసి, తన గొలుసు దోచుకునేందుకు ప్రయత్నించారని పులకేశినగర ఠాణాలో నటి హర్షిక పుణచ్చ ఫిర్యాదు చేశారు. -
ప్రేమ పేరుతో రక్తపుటేరులా?
[ 20-04-2024]
కర్ణాటకలో లవ్ జిహాద్ ఘటనలు ఎక్కువవుతున్నాయంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. -
అగ్రనేతల గడ్డపై ఎవరిదో విజయం?
[ 20-04-2024]
బళ్లారి లోక్సభ నియోజకవర్గం నుంచి 1999లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, భాజపా నుంచి ఫైర్బ్రాండ్గా ప్రత్యేక గుర్తింపు పొందిన దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మాస్వరాజ్ బరిలో నిలిచారు. -
ప్రధాని ప్రాభవమే శోభకు శ్రీరామరక్ష
[ 20-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం సందర్శించనున్న నేపథ్యంలో రాజకీయ ముఖచిత్రం మార్పులకు నోచుకుంటుందని, కమలనాథులకు విజయం చేరువవుతుందనే అంచనాలు తెరపైకి వచ్చాయి. -
కాంగ్రెస్లోకి మాలికయ్య గుత్తేదార్
[ 20-04-2024]
మాజీ మంత్రి మాలికయ్య గుత్తేదార్, కుమటా మాజీ ఎమ్మెల్యే శారదా మోహన్శెట్టి తదితరులు శుక్రవారం బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
గదగలో నలుగురి దారుణ హత్య
[ 20-04-2024]
గదగ పట్టణంలోని చెన్నమ్మ కూడలి సమీపాన దాసర వీధిలో గురువారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. -
నకిలీ పత్రాలతో నిలువుదోపిడీ
[ 20-04-2024]
ఒకే ఇంటి స్థలానికి లెక్కలేనన్ని నకిలీ పత్రాలు సిద్ధం చేసి వాటిని 22 బ్యాంకుల్లో కుదువ పెట్టి రూ.10 కోట్లకు పైగా రుణాన్ని తీసుకున్న ఆరుగురు వంచకులను బెంగళూరు జయనగర ఠాణా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!