‘ఛార్జీల పెంపుపై తొందరపడం’
విద్యుత్తు, నీరు, పాల ధరలు పెంచాలన్న తొందర మాకేం లేదని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యానించారు. ఛార్జీల పెంపు అనివార్యతలపై సమగ్రంగా చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే పాల ధర లీటరుకు రూ.3 పెంచాలని పాడి సమాఖ్య ప్రతిపాదించింది. శుక్రవారం ఇంధన
ఈనాడు డిజిటల్, బెంగళూరు: విద్యుత్తు, నీరు, పాల ధరలు పెంచాలన్న తొందర మాకేం లేదని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై వ్యాఖ్యానించారు. ఛార్జీల పెంపు అనివార్యతలపై సమగ్రంగా చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే పాల ధర లీటరుకు రూ.3 పెంచాలని పాడి సమాఖ్య ప్రతిపాదించింది. శుక్రవారం ఇంధన మంత్రి సునీల్కుమార్ సైతం విద్యుత్తు ఛార్జీల పెంపు అనివార్యమని ప్రకటించారు. జలమండలి, జలవనరులు, నగర, గ్రామీణాభివృద్ధి శాఖలు రూ.12 వేల కోట్లు బకాయిపడిన నేపథ్యంలో ఛార్జీల పెంపు తప్ప మరోమార్గం లేదన్నారు. ప్రజలకు భారమయ్యే పన్నుల విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోబోమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. తాము ఎవరి ఒత్తిడికి లోనై కర్ఫ్యూను ఉపసంహరించలేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేసులు పెరిగినా, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగా ఉంటూ, కోలుకునే వారి ప్రమాణం ఎక్కువగా ఉంది. నిపుణుల సలహాతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మేకెదాటు ప్రాజెక్టుపై తాము చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకే కర్ఫ్యూ నిబంధనలు అమలు చేసి, ఆపై ఎత్తివేసినట్లు విపక్ష నేత సిద్ధరామయ్య ఆరోపించారు. నిబంధనలు ఎత్తివేసిన వెంటనే వారిపై పన్నుల భారం మోపిందని సర్కారును దుయ్యబట్టారు. సిద్ధరామయ్య చేసిన ఆరోపణలు నిరాధారమని ముఖ్యమంత్రి కొట్టిపారేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్