గణతంత్ర వేడుకకు ఘన సాధన
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కబ్బన్ రోడ్డు మానిక్ షా పరేడ్ మైదానంలో రక్షణ శాఖ సిబ్బంది, పోలీసులు శనివారం సాధన (అభ్యాస) ప్రక్రియను చేపట్టారు. కేఎస్ఆర్పీ, శ్వానదశ, అశ్విక దళ సిబ్బంది, సివిల్ పోలీసులు, సైనికులు, సైన్యంలోని వివిధ దళాల ప్రతినిధులు కవాతులో
మేము సైతం అంటూ శ్వానదళ సిబ్బంది
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కబ్బన్ రోడ్డు మానిక్ షా పరేడ్ మైదానంలో రక్షణ శాఖ సిబ్బంది, పోలీసులు శనివారం సాధన (అభ్యాస) ప్రక్రియను చేపట్టారు. కేఎస్ఆర్పీ, శ్వానదశ, అశ్విక దళ సిబ్బంది, సివిల్ పోలీసులు, సైనికులు, సైన్యంలోని వివిధ దళాల ప్రతినిధులు కవాతులో పాల్గొన్నారు. రక్షణ శాఖ, పోలీసు సిబ్బంది తమ అధునాతన వాహనాలను ప్రదర్శించారు. కొవిడ్ మూడో అలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా సాంస్కృతిక కార్యక్రమాలను అధికారులు రద్దు చేశారు. గణతంత్ర దినోత్సవానికి గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ మైదానంలో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి సందేశమిస్తారు. ముఖ్యమంత్రి, మంత్రులు సహా పరిమిత సంఖ్యలో అధికారులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. సిబ్బంది అందరికీ స్వాబ్ పరీక్ష నిర్వహించి, నెగెటివ్ నివేదిక వచ్చిన వారినే ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం ఇస్తున్నామని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. మైదానాన్ని పాలికె సిబ్బంది శుభ్రం చేసి, రక్షణ శాఖకు అప్పగించారు. ఆసనాలను శానిటైజ్ చేసే ప్రక్రియను ఆరోగ్య శాఖ సిబ్బంది చేపట్టారు.
లఫె్ట్..రైట్.. లఫె్ట్..రైట్
సాయుధదళం పదసంచలనం
ఆసనాలను శుభ్రపరుస్తున్న కార్మికుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM