కర్ఫ్యూ సడలించినా..కానరాని సంచారం
జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నా....వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని వారాంతపు కర్ఫ్యూను జిల్లా పాలనాధికారి కొద్దిగా సడలింపు చేసినా....జనం బయటకు రావడం లేదు. దీంతో నగరంలో ప్రధాన రహదారులు, కూడళ్లు జనం లేక వెలవెలబోయాయి. సినిమా థియేటర్లుకు 50 శాతం
బోసిపోయిన బెంగళూరు రహదారి
బళ్లారి, న్యూస్టుడే: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నా....వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని వారాంతపు కర్ఫ్యూను జిల్లా పాలనాధికారి కొద్దిగా సడలింపు చేసినా....జనం బయటకు రావడం లేదు. దీంతో నగరంలో ప్రధాన రహదారులు, కూడళ్లు జనం లేక వెలవెలబోయాయి. సినిమా థియేటర్లుకు 50 శాతం సీట్లతో ప్రదర్శనకు అవకాశం కల్పించినా 30 శాతం కూడా ప్రేక్షకులు రావడం లేదని థియేటర్ లీజ్దారుడు లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. కొత్త సినిమాలు విడుదల చేయకపోవడం, కరోనా భయంతో జనం ముందుకు రావడంలేదన్నారు. దుస్తులు, గార్మెంట్స్, చెప్పుల దుకాణాలు, షాపింగ్ మాల్స్, కిరాణా, పండ్లు, కూరగాయల మారెట్లలో జనం కనిపించడం లేదు. పాఠశాలలు ప్రారంభించడానికి డీసీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ మొదటి రోజు ప్రారంభం కాలేదు. కరోనా మూడో దశ ప్రభావంతో పాటు, వాతావరణంలో మార్పులతో ప్రతి ఇంటిలో జలుబు, దగ్గు తదితర అనారోగ్య సమస్యలతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైనా తల్లిదండ్రులు పాఠశాలకు ఇప్పట్లో పంపించే పరిస్థితులు కనిపించడం లేదు. భోజనశాలలు తెరిచినప్పటికీ వినియోగదారులు రావడంలేదు. బెంగళూరు, కాళమ్మ, తేరువీధి, దొడ్డ మార్కెట్, ఎ.పి.ఎం.సి. కూడలి, పార్వతీనగర్, డబుల్ రహదారి, అనంతపురం, వాల్మీకి, హెచ్.ఆర్.గవియప్ప కూడలి, తదితర ప్రాంతాల్లో జనం ఎప్పుడు రద్దీగా కనిపించే వారు. వారాంతపు కర్ఫ్యూను సడలించినా జనం పలుచగా కనిపించారు. కరోనా భయంతో పాటు, రెండు వారాలుగా వారాంతపు కర్ఫ్యూ ఉండటంతో సడలింపు తెలియక ప్రజలు బయటకు రాలేదు. శనివారం వ్యాపారం పెద్దగా జరగలేదని వ్యాపారి రామాంజినేయులు ‘న్యూస్టుడే’కి తెలిపారు.
మీనాక్షి కూడలి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామనగరలో శివశక్తి ప్రదర్శన
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ఘట్టం గురువారం ప్రారంభమైన నేపథ్యంలో శక్తి ప్రదర్శనకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ రామనగర పట్టణాన్ని వేదికగా మలుచుకున్నారు. కాంగ్రెస్ తరఫున బెంగళూరు గ్రామీణ అభ్యర్థిగా సోదరుడు డీకే సురేశ్ -
పేలుడు కేసులో నిందితుడి అరెస్టు
[ 29-03-2024]
బ్రూక్ఫీల్డ్ పరిధి రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు నిందితుడు ముజామిల్ షరీఫ్ను అరెస్టు చేశామని జాతీయ తనిఖీ దళం గురువారం రాత్రి ప్రకటించింది. -
గెలిచాకే మోదీని కలుస్తా: ఈశ్వరప్ప
[ 29-03-2024]
శివమొగ్గ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో దిగాలని నిర్ణయించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన సొంత కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. -
నాకు ప్రాణాపాయం
[ 29-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ తనను అంతం చేసేందుకు కొందరు భాజపా నాయకులు కంకణం కట్టుకున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. -
ఐదుగురు కుమార్తెలతో తల్లి ఆత్మహత్యాయత్నం
[ 29-03-2024]
భర్త గోపాల్ వేధింపులు, ఆర్థిక సమస్యలతో అనిత అనే గృహిణి తన ఐదుగురు కుమార్తెలకు విషం తాగించి, తానూ బలవన్మరణానికి ప్రయత్నించింది. -
యాప్ల తోడుగా ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా!
[ 29-03-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను సజావుగా, సులువుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనేక యాప్లను సిద్ధం చేసింది. ఈ యాప్లు ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేలా చేస్తాయని జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్కుమార్ మిశ్రా తెలిపారు. -
కఠోర శ్రమతో సులువుగా లక్ష్య సాధన
[ 29-03-2024]
నవోదయ రీగెల్-24 వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. గురువారం రాత్రి నవోదయ స్టేడియంలో మూడు రోజుల కార్యక్రమాలను రాయచూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ హనుమంతప్ప జ్యోతి వెలిగించి ప్రారంభించారు. -
ప్రగతిని తుంగలో తొక్కిన భాజపా
[ 29-03-2024]
బెంగళూరు గ్రామీణ లోక్సభ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి హస్తినలో మీ స్వరాన్ని వినిపించేందుకు డీకే సురేశ్ను మరోసారి గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. ఇక్కడి ప్రజల సమస్యలకు మొదటి నుంచి ఆయన స్పందిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు. -
మరింత పడిపోయిన విద్యుదుత్పాదన
[ 29-03-2024]
రాష్ట్రంలోని శాఖోత్పన్న విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పాదన సగానికి పతనమైంది. గురువారం సాయంత్రం 4.24 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం. -
లాడ్జిలో దంపతుల ఆత్మహత్య
[ 29-03-2024]
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంపతులు కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా సోమవార్పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు