హస్తినలో చందన మేనా!
గణతంత్ర దినోత్సవాలకు కర్ణాటక నుంచి పంపించిన శకటాన్ని హస్తినలోని రాజ్పథ్ వీధిలో ముందస్తుగా ఆదివారం నడిపించారు. హస్తకళా ఉత్పత్తులు, బొమ్మలు ఉన్న శకటాన్ని ఈసారి ఎంపిక చేశామని సమాచార శాఖ కమిషనర్ డాక్టర్ పి.ఎస్.హర్ష వెల్లడించారు. ఈ ఏడాది కర్ణాటక శకటం ప్ర
కర్ణాటక శకటం వద్ద సమాచార శాఖ అధికారులు, యక్షగాన కళాకారులు
బెంగళూరు (గ్రామీణం), న్యూస్టుడే : గణతంత్ర దినోత్సవాలకు కర్ణాటక నుంచి పంపించిన శకటాన్ని హస్తినలోని రాజ్పథ్ వీధిలో ముందస్తుగా ఆదివారం నడిపించారు. హస్తకళా ఉత్పత్తులు, బొమ్మలు ఉన్న శకటాన్ని ఈసారి ఎంపిక చేశామని సమాచార శాఖ కమిషనర్ డాక్టర్ పి.ఎస్.హర్ష వెల్లడించారు. ఈ ఏడాది కర్ణాటక శకటం ప్రత్యేక బహుమతి దక్కించుకుంటుందని సమాచార శాఖ అధికారులు, శకటం రూపకర్తలు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రదర్శనకు 12 రాష్ట్రాల స్తబ్ద చిత్రాలు ఎంపిక చేయగా వాటిలో ఒకటిగా, దక్షిణాది నుంచి ఎంపికైన ఏకైక స్తబ్ద చిత్రం కర్ణాటకదే కావడం గమనార్హం. వరుసగా 13వ ఏడాది కర్ణాటక స్తబ్దచిత్రం రాజ్పథ్ వీధిలో గణతంత్ర దినోత్సవం రోజు ప్రదర్శిస్తున్నామని చెప్పారు. కౌశల్యంతో తయారు చేసిన కుండ, శ్రీగంధంతో చేసిన చిన్న వస్తువులు, చేతిమగ్గంపై నేసిన చీరలు, చేతితో తయారు చేసిన ఒక ప్రత్యేక కళాకృతితో కలిపి 16 హస్తకళా వస్తువులు, జియో ట్యాగ్ సంకేతపు జాబితాలో ఉన్నవాటిని ఈ శకటంపై ఉంచామన్నారు. మైసూరు కలప, దంతం ముక్కలతో అలంకరించిన ఏనుగు బొమ్మ శకటం ముందు భాగంలో తీర్చిదిద్దారు. యక్షగాన కళాకారిణి బొమ్మ, గంజీఫా కళాకృతులను వెనుక అమర్చారు. తీరప్రాంత జిల్లాల ప్రత్యేకతను ప్రదర్శించే భూతారాధన మాస్కు ధరించిన లోహపు కళాకృతులు, బిదరి కళాకృతి.. నెమలిబొమ్మ ఈ శకటంపై ప్రత్యేకాకర్షణగా పేర్కొనవచ్ఛు
● చెన్నపట్టణ, కిన్నాళె కలప బొమ్మలు (ఇన్లే కార్వింగ్), కంచు ప్రతిమలు, వెదురు కళాకృతులు, టెర్రకోట, వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీగంధపు బొమ్మలు, దంతాలపై చెక్కిన చిత్తరువులు, కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని అధికారులు వివరించారు. స్వాతంత్య్ర పోరాట యోధురాలు కమలాదేవి చటోపాధ్యాయ ఉపయోగించిన గంధం పెట్టె, నెమలి ఆకారంలోని దీపపు సిమ్మెలు, సండూరులో అరటి నారతో చేసిన గోనెసంచులు, ఇళకల్, మొళకాల్మూరు, మైసూరు చీరలు, పశ్చిమ కనుమల్లో లభించే బెత్తం, వెదురు, అడవి తీగలు, తాటి ఆకులతో చేసిన బుట్టలు హస్తిన ప్రదర్శనకు సమకూర్చామన్నారు. ప్రముఖ కళా దర్శకుడు శశిధర్ అడపకు చెందిన ప్రతిరూపి సంస్థకు చెందిన వంద మందికి పైగా కళాకారులు ఈ శకటం రూపకల్పనలో శ్రమించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ప్రవీణ్ దయానంద రావు, ఆయన నేతృత్వంలోని కళాకారులు, జానపద కళాకారుడు డాక్టర్ రాధాకృష్ణ ఉరాళ నేతృత్వంలోని కళాకారులు ఈ శకటంతో ప్రదర్శనలో పాల్గొంటారు.
రాజ్పథ్లో కర్ణాటక స్తబ్ద చిత్రం నమూనా ప్రదర్శన సంభ్రమం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రణక్షేత్రంలో వైరిపక్షాల దూకుడు
[ 19-04-2024]
దేశవ్యాప్తంగా మూడోవిడత- రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. వీటి ఉపసంహరణకు ఈనెల 22న తుది గడువు. -
కట్టుదిట్టంగా సీఈటీ
[ 19-04-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయ విద్య (బీఎస్సీ) తదితర వృత్తి విద్య కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 737 పరీక్ష కేంద్రాల్లో సాధారణ ప్రవేశ పరీక్ష (సీఈటీ) గురువారం నిర్వహించారు. -
ధార్వాడ బరిలోకి రైతునేత
[ 19-04-2024]
ధార్వాడ లోక్సభ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వ్యతిరేకంగా శిరహట్టి భావైక్యత మహాసంస్థానం పీఠాధిపతి ఫకీర దింగాలేశ్వర స్వామి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
తిరుమలలో కర్ణాటక యువకుడి హల్చల్
[ 19-04-2024]
బెంగళూరు దక్షిణ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సౌమ్యారెడ్డి గెలవాలని ఆపార్టీ కార్యకర్త నాగేంద్ర ఆమె ఫొటోతో శ్రీవారి ఆలయం ఎదుట గురువారం హల్చల్ చేశాడు. -
గెలుపు ఉత్తరం ఎవరికో!
[ 19-04-2024]
ఉత్తర కన్నడ లోక్సభ నియోజకవర్గం మునుపెన్నడూ లేనంతగా రాజకీయ వేడితో సెగలుగక్కుతోంది. -
‘చిక్కోడి’ ఎవరికి చిక్కేనో..
[ 19-04-2024]
మరాఠాగడ్డకు చేరువలోని బెళగావి జిల్లా చిక్కోడి లోక్సభ నియోజకవర్గ ఎన్నిక అత్యంత ఆసక్తి రేపుతోంది. భాజపా సిట్టింగ్ ఎంపీ అణ్ణా సాహెబ్ జొల్లై తిరిగి పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ తరఫున యువకెరటం ప్రియాంక జార్ఖిహొళి బరిలో ఉ -
ఓటరు జాగృతికి వినూత్న ప్రచారం
[ 19-04-2024]
జిల్లా యంత్రాంగం, పంచాయతీ, స్వీప్ సమితి సంయుక్తంగా పోలింగ్ శాతం పెంచడానికి గురువారం వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించాయి. -
ప్రేమించలేదని.. విద్యార్థిని దారుణహత్య
[ 19-04-2024]
తన ప్రేమను నిరాకరించిన నేహా హీరేమఠ (20) అనే విద్యార్థినిని ఫయాజ్ (24) అనే యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. -
‘ఉబర్’కు జరిమానా
[ 19-04-2024]
ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్ గార్గ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM