విస్తరణతంత్ర రాజకీయం
మంత్రివర్గ విస్తరణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆశావహులు పట్టుడుతున్నారు. రాష్ట్రంలోని తమకు ఆప్తులైన కాషాయదళ నాయకులతో రహస్య సమావేశాలు కొనసాగిస్తున్నారు. మెరుగైన పనితీరు చూపించని కొందరు అమాత్యులకు పార్టీ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు తెరవెనుక మొదలయ్యాయి. గతంలోనే.. సం
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : మంత్రివర్గ విస్తరణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆశావహులు పట్టుడుతున్నారు. రాష్ట్రంలోని తమకు ఆప్తులైన కాషాయదళ నాయకులతో రహస్య సమావేశాలు కొనసాగిస్తున్నారు. మెరుగైన పనితీరు చూపించని కొందరు అమాత్యులకు పార్టీ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు తెరవెనుక మొదలయ్యాయి. గతంలోనే.. సంక్రాంతి నాటికి మంత్రివర్గ విస్తరణ, కొందరికి శాఖల మార్పు, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కమలనాథులు ప్రణాళిక రూపొందించుకున్నారు. పనితీరు ఆధారంగా కొందరు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని ప్రచారం జరిగింది. ఆ క్రమంలో కాంగ్రెస్, జనతాదళ్ను వీడి భాజపా టిక్కెట్టుపై గెలుపొంది, అమాత్యులుగా సేవలు అందిస్తున్న నాయకుల్లో గుబులు మొదలైంది. పార్టీ కోసం జెండా కర్రలు మోసిన తమను పక్కన పెట్టి, కొత్తగా వచ్చిన వారికి మంత్రిగా బాధ్యతలు అప్పగించారని మాజీ మంత్రులు రేణుకాచార్య, బసవనగౌడ పాటిల్ యత్నాళ్ నేరుగానే తమ నిరసన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు పూర్తయిన తర్వాతే విస్తరణ చేపట్టాలని హస్తినలో పార్టీ అధిష్ఠానం యోచిస్తోంది. అప్పటి వరకు ఆగడం సాధ్యం కాదని, ఇప్పుడే విస్తరణ చేపట్టాలనే వారి గళం జోరందుకుంది. ఇప్పుడు కొందరికి పదవీ గండం కలిగితే, తేనెతుట్టెను కెలికినట్లు అవుతుందని భాజపా జాతీయ నాయకత్వం యోచిస్తోంది. తమ పదవులకు ఎటువంటి గండం ఉండదని కొందరు నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కొత్త వారికి అవకాశం కల్పించేందుకు అనుగుణంగా కేంద్ర హోం మంత్రి అమిత్షా నేతృత్వంలో కర్ణాటకలో వరుసగా మూడు రోజులు సభలను నిర్వహిద్దామనుకున్న ప్రణాళిక కొవిడ్ నిబంధనలతో రద్దయింది. కొవిడ్ నిర్వహణ, జిల్లా వ్యవహారాల బాధ్యతలను అప్పగించడంలో అశోక్, మాధుస్వామిలకు మొండి చేయి చూపించారు. వారిద్దరికీ ఏ జిల్లా బాధ్యతలనూ అప్పగించలేదు. బెంగళూరు నగర జిల్లాపై పట్టు సాధించేందుకు అశోక్, సోమణ్ణ మధ్య మొదటి నుంచి ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. వారిద్దరికీ ఉద్యాననగరి బాధ్యతలు అప్పగించకుండా ముఖ్యమంత్రే స్వయంగా నగర బాధ్యతలను తన వద్ద ఉంచుకున్నారు.
ఇప్పుడప్పుడే కాదు..
మంత్రివర్గ విస్తరణకు తనపై ఒత్తిడి పెరుగుతున్నా.. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రశాంతంగా ఉన్నారు. విస్తరణకు సంబంధించి కేంద్ర నాయకులు ఇప్పటి వరకు పచ్చ జెండా ఊపలేదు. అది జాప్యమయ్యే అవకాశం ఉందని సూచన ప్రాయంగా వెల్లడించారు. మంత్రిగా అవకాశం కల్పించాలని తనను, జాతీయ నాయకులను కోరుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. విస్తరణకు సంబంధించిన చర్చలు ఈ వారంలో ఉంటాయని భావించినా, ఇప్పటి వరకు కేంద్ర నాయకుల నుంచి తనకు పిలుపు రాలేదన్నారు. మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్, మండళ్లకు అధ్యక్షుల నియామకం, పాలికె ఎన్నికల ప్రక్రియ తదితర అంశాలను చర్చించేందుకు మంగళవారం నుంచి గురువారం వరకు పార్టీ ప్రధాన కార్యాలయం ‘జగన్నాథ భవన్’లో భాజపా రాష్ట్రాధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ నేతృత్వంలో నాయకులు సమావేశమవుతారని సీఎం తెలిపారు. పార్టీలో నాయకుల మధ్య ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ నెల 28కి ఆరు నెలలు పూర్తవుతాయని, ఈమధ్య సాధనకు సంబంధించిన పుస్తకాన్ని విడుదల చేసి, ఆ రోజు విలేకరులతో మాట్లాడతానని చెప్పారు. ఆలోగా బడ్జెట్ రూపకల్పనకు చర్యలు తీసుకుంటానని సీఎం పేర్కొన్నారు.
బొమ్మై మంత్రివర్గంలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉండగా, మరి కొందరిని మంత్రి స్థానం నుంచి తప్పించి, కనీసం 10 మందికి మంత్రులుగా అవకాశం ఇవ్వాలని భాజపా జాతీయ నాయకత్వం కోరుకుంటోంది. తమ మధ్య వైరాన్ని పక్కనపెట్టి రేణుకాచార్య, బసవనగౌడ పాటిల్ ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బెళగావి విభాగంలో జార్ఖిహొళి సోదరులు, మంత్రి ఉమేశ్ కత్తితో అక్కడి భాజపా ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలను నిర్వహించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు విస్తరణ జోలికి వెళ్లే అవకాశం తక్కువ అని రాజకీయ విశ్లేషకుల మదింపు.
నాకు అర్హతలేదా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గర్జించి.. విశ్రమించారు
[ 25-04-2024]
రాష్ట్రంలో తొలివిడత (దేశవ్యాప్తంగా రెండో విడత) ఎన్నికల బహిరంగ ప్రచారానికి బుధవారం తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించక ముందే ప్రారంభమైన ప్రచారం దాదాపు 45 రోజుల పాటు కొనసాగింది. -
‘వారు.. సహకరించలేదు’
[ 25-04-2024]
‘హాసనలో కొందరు భాజపా నాయకులు మాకు ప్రచారంలో సహకరించలేదు. మండ్యలో సుమలత అంబరీశ్ సాయం చేయలేదు’ అని మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ ఆక్రోశించారు. -
సీవోడీ అదుపులో ఫయాజ్
[ 25-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడలోని ఓ కళాశాల ఆవరణలో విద్యార్థిని నేహా హీరేమఠను హత్య చేసిన నిందితుడు మహ్మద్ ఫయాజ్ను సీవోడీ అధికారులు కారాగారం నుంచి బుధవారం అదుపులోనికి తీసుకున్నారు. -
భాజపాతో అన్నింటా అన్యాయం
[ 25-04-2024]
కలబురగి లోక్సభ అభ్యర్థి రాధాకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓటర్లకు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఓటమితో ఈ ప్రాంతం చాలా నష్టపోయిందన్నారు. -
చిక్క ఎవరి చేతికి చిక్కేనో!
[ 25-04-2024]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రభావితమయ్యే లోక్సభ నియోజకవర్గాల్లో చిక్కబళ్లాపుర కీలకమైంది. తెలుగు మాతృభాషగా మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండటం, పొరుగు రాష్ట్రమే పూర్తిగా సరిహద్దుగా ఉండటంతో అక్కడి పార్టీలు, నేతల ప్రతిస్పందనలను ఇక్కడి వారు గమనిస్తుంటారు. -
నంజుండి చేతికి కాంగ్రెస్ పతాకం
[ 25-04-2024]
విధానపరిషత్ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన భాజపా నేత కేపీ నంజుండి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్సింగ్ సుర్జేవాల, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పతాకాన్ని అందుకున్నారు. -
సుమలత ప్రచారం రద్దు
[ 25-04-2024]
మండ్యలో జనతాదళ్, భాజపా ఉమ్మడి అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి మద్దతుగా లోక్సభ సభ్యురాలు సుమలత అంబరీశ్ ప్రచార పర్వం చివరి క్షణంలో రద్దయింది. -
ఓటేద్దాం.. కదలిరండి
[ 25-04-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలను పండగలా భావించి అందరూ ముందుకు రావాలని బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు బుధవారం ప్లకార్డులు ప్రదర్శించి, జన చైతన్యానికి ముందడుగు వేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?