మహిళా అక్షరాస్యతతోనే అభివృద్ధి
మహిళా అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి సాధ్యం. తల్లిదండ్రులు మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలకు సైతం ఉన్నత విద్య అందించాలని కంప్లి పురసభ అధ్యక్షురాలు వి.శాంతలా సూచించారు. కంప్లి చక్కెర కర్మాగార ప్రాంతంలోని ముక్తినాథేశ్వర కల్యాణ మంటపంలో సోమవారం సాయంత్రం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా
జ్యోతి వొెలిగించి సమితిని ప్రారంభిస్తున్న అతిథులు
కంప్లి, న్యూస్టుడే: మహిళా అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి సాధ్యం. తల్లిదండ్రులు మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలకు సైతం ఉన్నత విద్య అందించాలని కంప్లి పురసభ అధ్యక్షురాలు వి.శాంతలా సూచించారు. కంప్లి చక్కెర కర్మాగార ప్రాంతంలోని ముక్తినాథేశ్వర కల్యాణ మంటపంలో సోమవారం సాయంత్రం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవా సమితిని ఆమె నూతనంగా ప్రారంభించి మాట్లాడారు. సమితి సభ్యులు ప్రజల సమస్యలపై స్పందించాలి. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. సమితి అధ్యక్షురాలు రబియా నిసార్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాల కోసమే సమితి ఏర్పడిందన్నారు. కన్నడ సంస్కృతి శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు పి.బ్రహ్మయ్య, హొన్నూర్ సాబ్, రామకృష్ణ, హేమవతి పూర్ణచంద్ర, ఉషా, పుష్పలత పాల్గొన్నారు.
ఆడపిల్లలను గౌరవిద్దాం
సిరుగుప్ప, న్యూస్టుడే: ఎక్కడ మహిళలను గౌరవిస్తామో అక్కడ శాంతి, సౌభాగ్యం నెలకొంటాయని స్వామీ వివేకానంద వ్యక్తిత్వ వికాస సంస్థ అధ్యక్షుడు కె.జె.నరసింహులు పేర్కొన్నారు. పట్టణంలోని 5వ వార్డు ప్రభుత్వ పాఠశాలలో సోమవారం జాతీయ ఆడపిల్లల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఆడపిల్లలను ఎంతగానో గౌరవించి ఆరాధిస్తాం, అన్ని రంగాల్లో మహిళలు ముందుకు సాగుతున్నారన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న నరసింహులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధిపత్య పోరులో గట్టెక్కేదెవరు?
[ 26-04-2024]
దేశవ్యాప్తంగా రెండోది.. రాష్ట్రంలో తొలివిడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈసారి 400 లోక్సభ నియోజకవర్గాలు దక్కించుకోవాలని- కన్నడనాట అందులో 25 స్థానాలుండాలని భాజపా కంకణం కట్టుకోగా.. ఇక్కడ 20 స్థానాలను దక్కించుకుని సత్తా చాటాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. -
మూగబోయిన కరావళి కోకిల
[ 26-04-2024]
కరావళి కోకిల’గా గుర్తింపు పొందిన యక్షగాన భాగవత సుబ్రహ్మణ్య ధారేశ్వర (67) గురువారం వేకువజామున బెంగళూరులో తుది శ్వాస విడిచారు. -
పట్టాలపై కడతేరిన కష్టజీవులు
[ 26-04-2024]
ఆ ముగ్గురు యువకులూ రైలు పట్టాలపై కడతేరిపోయారు. ప్రమాదవశాత్తు రైలు కింద పడ్డారా? ఆత్మహత్య చేసుకున్నారో తెలియదుగానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరులో రైలు కిందపడి మృతి చెందిన సంఘటన బెంగళూరు మారతహళ్లి రైల్వేస్టేషన్ సమీపాన విషాదాన్ని నింపింది. -
నేహా హత్య కేసులో పురోగతి
[ 26-04-2024]
నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్, ఎస్పీ వెంకటేశ్ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. -
తల్లి ఆత్మహత్య..కొడుకు చేతిలో తండ్రి హత్య
[ 26-04-2024]
భర్త వేధింపులు తట్టుకోలేక తిప్పమ్మ (52) అనే గృహిణి ఉరి వేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ‘నీ వేధింపులే తల్లి బలవన్మరణానికి కారణం’ అంటూ ఆమె కుమారుడు రమేశ్ (30) తన తండ్రి అంజనప్ప (60)ను గురువారం వేకువజామున హత్య చేశాడు. -
జేఈఈలో జయకేతనం!
[ 26-04-2024]
జేఈఈ మెయిన్, బీఈ, బీటెక్లో తొలి పేపర్ కోసం నిర్వహించిన పరీక్షల్లో కర్ణాటక విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం అర్ధరాత్రి వెల్లడించిన ఈ ఫలితాల్లో కర్ణాటక విద్యార్థులు ముగ్గురు వంద పర్సంటైల్ సాధించారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మోదీని ప్రశ్నించలేని జోషి
[ 26-04-2024]
హుబ్బళ్లి-ధార్వాడ లోక్సభ నియోజకవర్గంలోని ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసోటిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, స్థానిక నాయకులను కోరారు.